జాబ్ క్యాలెండర్ జాడేది..!
మన్యంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. నానా ఇబ్బందులు ఎదుర్కొని డిగ్రీలు పూర్తి చేసినా సకాలంలో నోటిఫికేషన్లు లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
మన్యంప్రాంత యువత ఆవేదన
నిరుద్యోగ భృతి నిలిచి ఇబ్బంది
ఎటపాక, న్యూస్టుడే
మన్యంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. నానా ఇబ్బందులు ఎదుర్కొని డిగ్రీలు పూర్తి చేసినా సకాలంలో నోటిఫికేషన్లు లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఆసరాగా ఉండేందుకు నిరుద్యోగ భృతి అందించి ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం అది పెంచుతామని చెప్పి ఉన్నది కూడా రద్దు చేసిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డిగ్రీ పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య ఏటా వేలల్లో ఉంటోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఎన్నో ఆశలతో పుస్తకాలు పట్టి చదివి సిద్ధమవుతున్నా.. నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరాశే మిగులుతోందని నిరుద్యోగులు చెబుతున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో ఏటా సుమారు ఐదువేల మంది ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుంటున్నారు. చాలామంది ఉద్యోగాలు దొరక్క ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే పరిస్థితి. పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నా... ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై యువత అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు విలువ లేదు
-కట్టా వెంకటరమణ ఏంఏ తెలుగు, నిరుద్యోగి, గోగుబాక
రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మా ప్రాంతంలో పరిశ్రమలు, సంస్థలు లేవు. విద్యార్థులకు అమ్మఒడి కింద డబ్బులిచ్చారు. వారికి ఉన్న విలువ కూడా చదువుకున్న విద్యావంతులకు లేకుండా పోయింది. ఈ ప్రాంతం వదలి మరో ప్రాంతానికి వెళ్లి బతకాలంటే అక్కడిచ్చే వేతనం ఇంటి అద్దె ఖర్చులకూ సరిపడని పరిస్థితి. దయచేసి నిరుద్యోగ భృతి అందించాల్సి ఉంది.
తల్లిదండ్రులకు భారం కాలేక ఇబ్బంది
-చింతా వెంకన్నబాబు, ఇంజినీరింగ్, నిరుద్యోగి, గోగుబాక
పెద్ద చదువులు చదివి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏవైనా ప్రైవేటు ఉద్యోగాలు తెచ్చుకుందామని ఆశపడినా మా ప్రాంతం చుట్టుపక్కల పరిశ్రమలు లేవు. తల్లిదండ్రులకు దూరంగా వెళ్తే వారి బాగోగులు ఎవరు చూడాలి?, నేను ఇంజినీరింగ్ చదివాను. ఇంతవరకూ ఉద్యోగం లేదు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందనే ఆశతో ఉన్నాం. నాలుగేళ్లు గడిచినా జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు. వేల సంఖ్యలో కొలువులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మమ్మల్ని కన్న తల్లిదండ్రులకు భారం కాలేక ఇబ్బంది పడుతున్నాం. విద్యావంతులకు తగినట్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం