జాబ్ క్యాలెండర్ జాడేది..!
మన్యంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. నానా ఇబ్బందులు ఎదుర్కొని డిగ్రీలు పూర్తి చేసినా సకాలంలో నోటిఫికేషన్లు లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
మన్యంప్రాంత యువత ఆవేదన
నిరుద్యోగ భృతి నిలిచి ఇబ్బంది
ఎటపాక, న్యూస్టుడే
మన్యంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. నానా ఇబ్బందులు ఎదుర్కొని డిగ్రీలు పూర్తి చేసినా సకాలంలో నోటిఫికేషన్లు లేక ఇళ్లకే పరిమితం అవుతున్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఆసరాగా ఉండేందుకు నిరుద్యోగ భృతి అందించి ఆదుకుంది. ప్రస్తుత ప్రభుత్వం అది పెంచుతామని చెప్పి ఉన్నది కూడా రద్దు చేసిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. డిగ్రీ పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య ఏటా వేలల్లో ఉంటోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఎన్నో ఆశలతో పుస్తకాలు పట్టి చదివి సిద్ధమవుతున్నా.. నోటిఫికేషన్లు రాకపోవడంతో నిరాశే మిగులుతోందని నిరుద్యోగులు చెబుతున్నారు. రంపచోడవరం నియోజకవర్గంలోని చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో ఏటా సుమారు ఐదువేల మంది ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీల్లో డిగ్రీలు పూర్తి చేసుకుంటున్నారు. చాలామంది ఉద్యోగాలు దొరక్క ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే పరిస్థితి. పోలీస్ కానిస్టేబుల్, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నా... ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై యువత అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు విలువ లేదు
-కట్టా వెంకటరమణ ఏంఏ తెలుగు, నిరుద్యోగి, గోగుబాక
రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మా ప్రాంతంలో పరిశ్రమలు, సంస్థలు లేవు. విద్యార్థులకు అమ్మఒడి కింద డబ్బులిచ్చారు. వారికి ఉన్న విలువ కూడా చదువుకున్న విద్యావంతులకు లేకుండా పోయింది. ఈ ప్రాంతం వదలి మరో ప్రాంతానికి వెళ్లి బతకాలంటే అక్కడిచ్చే వేతనం ఇంటి అద్దె ఖర్చులకూ సరిపడని పరిస్థితి. దయచేసి నిరుద్యోగ భృతి అందించాల్సి ఉంది.
తల్లిదండ్రులకు భారం కాలేక ఇబ్బంది
-చింతా వెంకన్నబాబు, ఇంజినీరింగ్, నిరుద్యోగి, గోగుబాక
పెద్ద చదువులు చదివి ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏవైనా ప్రైవేటు ఉద్యోగాలు తెచ్చుకుందామని ఆశపడినా మా ప్రాంతం చుట్టుపక్కల పరిశ్రమలు లేవు. తల్లిదండ్రులకు దూరంగా వెళ్తే వారి బాగోగులు ఎవరు చూడాలి?, నేను ఇంజినీరింగ్ చదివాను. ఇంతవరకూ ఉద్యోగం లేదు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందనే ఆశతో ఉన్నాం. నాలుగేళ్లు గడిచినా జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు. వేల సంఖ్యలో కొలువులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మమ్మల్ని కన్న తల్లిదండ్రులకు భారం కాలేక ఇబ్బంది పడుతున్నాం. విద్యావంతులకు తగినట్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కట్టుకథల జగనన్న కాలనీలు
[ 19-04-2024]
విశాఖ నగరం నడిబొడ్డున, సముద్రతీరాన, కొండను పిండిచేసి సుమారు రూ. 500 కోట్ల ప్రజాధనంతో తొమ్మిది ఎకరాల్లో రాజసౌధం నిర్మించుకున్నారు జగన్. -
వినలేదు వేదన... ఎందుకీ వంచన!
[ 19-04-2024]
వైకాపా ఎన్నికల మేనిఫెస్టోని భగవద్గీత, బైబిల్, ఖురాన్గా వర్ణిస్తూ.. 99 శాతం హామీలు నెరవేర్చేశామని డాంబికాలు పలుకుతున్నారు జగన్. -
తొలిరోజు నామినేషన్లకు దూరంగానే..
[ 19-04-2024]
నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తొలిరోజు గురువారం అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయలేదని అరకు, పాడేరు రిటర్నింగ్ అధికారులు అభిషేక్, భావన తెలిపారు. -
పసర మందు పట్టిస్తాం.. కేజీహెచ్కు వెళ్లేది లేదు
[ 19-04-2024]
విశాఖపట్నం వెళ్లేది లేదంటూ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థి, తల్లిదండ్రులు మొండికేశారు. -
వైకాపాకు రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
[ 19-04-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. వైకాపాకు చెందిన రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు వడుగుల జ్యోతి గురువారం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
నామినేషన్ల పర్వం ప్రారంభం
[ 19-04-2024]
జిల్లాలో ఆరు అసెంబ్లీ, ఒక ఎంపీ స్థానానికి సంబంధించి గురువారం నామినేషన్లు ప్రక్రియ ప్రారంభమైంది. -
స్పందించాల్సిన తరుణమిదే!
[ 19-04-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వారికోసం ఎన్నికల సంఘం అమలు చేసే సంస్కరణలు ఓటర్లకు మేలు చేస్తున్నాయి. -
జగన్.. ఇదేనా స్వచ్ఛ సంకల్పం?
[ 19-04-2024]
చింతపల్లిలో స్వచ్ఛభారత్ కల నెరవేరడం లేదు. మేజర్ పంచాయతీలో నమూనా ప్రాజెక్టుగా నిర్మించిన ఘన సంపద ఉత్పాదన కేంద్రం నేటికీ నిరుపయోగంగా మిగిలిపోయింది. -
నిఘా కన్ను.. శాంతికి దన్ను!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంత వాతావరణంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటంతో పోలీసుల పాత్ర ఎంతో కీలకం. -
మూకుమ్మడి రాజీనామాల బాటలో మరింతమంది
[ 19-04-2024]
వడ్డాది, పొట్టిదొరపాలెం, దిబ్బిడి, ఆర్.శివరాంపురం, విజయరామరాజుపేట గ్రామాలకు చెందిన వాలంటీర్లు గురువారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. -
దళితులకు జగన్ అన్యాయం
[ 19-04-2024]
దళితులకు అన్యాయం చేసి దళిత ద్రోహిగా సీఎం జగన్మోహన్రెడ్డి మారారని అనకాపల్లి పార్లమెంట్ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్ అన్నారు. -
జిల్లాలో 30 పోలింగ్ కేంద్రాల మార్పు!
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎదురుకాల్పుల్లో భారీగా మావోయిస్టులు చనిపోవడంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. -
సీఎం జగన్ రాక నేడు
[ 19-04-2024]
సీఎం జగన్మోహన్రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా తుని మీదుగా పాయకరావుపేటలోకి ప్రవేశిస్తుంది. -
62 కేజీల గంజాయి పట్టివేత
[ 19-04-2024]
రెండు వేర్వేరు కేసుల్లో రూ.3.10 లక్షల విలువైన 62 కేజీల గంజాయిని పట్టుకుని నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డొంకరాయి పోలీసు స్టేషన్ ఎస్సై శివకుమార్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు