పరిశీలన జాగు.. జాబితాలెప్పటికి బాగు?
ఇంటింటా సర్వేతో పాటు అంతకు ముందు ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులు చాలావరకు పెండింగ్లో ఉన్నాయి
వచ్చేనెల్లో ఓటర్ల జాబితా ముసాయిదా ప్రదర్శన
పెండింగ్లో ఫాం-7, 8 దరఖాస్తులే ఎక్కువ
ఓటర్ల జాబితాలు, దరఖాస్తుల పునఃపరిశీలన
ఈనాడు, పాడేరు, న్యూస్టుడే, పాడేరు పట్టణం: ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణకు జులై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఇంటింటి సర్వే చేపట్టారు. ఓట్ల చేర్పులు, తొలగింపులు, మార్పులపై భారీగా దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం వాటిని పునః పరిశీలన చేస్తున్నారు. వచ్చేనెలలోనే ముసాయిదా జాబితాను ప్రదర్శించబోతున్నారు. ఆలోగా ఈ దరఖాస్తులన్నింటినీ పరిశీలించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు.
ఇంటింటా సర్వేతో పాటు అంతకు ముందు ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్లో వచ్చిన దరఖాస్తులు చాలావరకు పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఆధారాలతో సహా పరిశీలించిన తర్వాతనే సమ్మతించడమో, తిరస్కరించడమో చేయాలి. ఈ ప్రక్రియ మందకొడిగా జరుగుతోంది. బీఎల్వోలుగా ఎక్కువ మంది వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది ఉన్నారు. వీరికి రోజువారీ విధులతో పాటు ఈ దరఖాస్తుల పరిశీలన చేయాల్సి ఉండడంతో జాప్యం జరుగుతోంది. దీంతో అక్టోబర్ 17 నాటికి జాబితా పూర్తిస్థాయిలో స్వచ్ఛీకరణ జరిగే అవకాశం లేదని అధికారులే చెబుతున్నారు.
జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 7.34 లక్షల మంది ఓటర్లు ఉండగా, సర్వే గడువు ముగిసే నాటికి 97 శాతం పరిశీలన చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇంటింటి సర్వేలో చాలా లోపాలు ఉన్నాయని బూత్లెవల్ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. చనిపోయిన వారి వివరాలను ఎప్పటికప్పుడు బీఎల్వోలు తమ లాగిన్ ఐడీలో అప్లోడ్ చేయాల్సి ఉండగా.. ఆ విషయంలో నిర్లిప్తత ప్రదర్శించినట్లు వారు చెబుతున్నారు. సర్వే సమయంలో మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకోకుండా తర్వాత వచ్చి తీసుకుంటామంటూ వెళ్లిపోవడంతో పునఃపరిశీలన జాప్యమవుతోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియ పకడ్బందీగా సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు మాత్రమే క్షేత్రస్థాయి పరిశీలనలో భాగస్వాములు అవుతున్నారని బీఎల్ఏలంటున్నారు.
తూతూమంత్రపు పరిశీలన
తొలగింపు జాబితాలోని ఓటర్లను వారి చిరునామాలకు వెళ్లి ప్రత్యక్షంగా పరిశీలించాలని కలెక్టర్ సుమిత్కుమార్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఫాం-7 ద్వారా ఎవరిదైనా ఓటు తొలగిస్తే వారి కుటుంబసభ్యులకు నోటీసు జారీచేయాలని, దరఖాస్తు చేసిన వ్యక్తిని కూడా పిలిపించాలని సూచించారు. జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి సెప్టెంబర్ 12 వరకు ఓట్ల తొలగింపునకు 25 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వారందరికీ నోటీసులు జారీచేసి 15 రోజులు సమయం ఇచ్చి వివరణ తీసుకోవాలి. అప్పటికీ సమాధానం రాకపోతే బీఎల్వో ద్వారా నోటీసు పంపి ఏడు రోజుల సమయం ఇవ్వాలి. ఈ ప్రక్రియకు కనీసం 21 రోజులు పట్టనుంది. ఇక్కడ బీఎల్వోలు అంత సమయం తీసుకోవడం లేదు. తూతూమంత్రపు పరిశీలనతో వచ్చిన దరఖాస్తులను వచ్చినట్లే ఆమోదించి తొలగించేస్తున్నారు. ఫాం-8లో సవరణల కోసం 45 వేలకు పైగా వస్తే అందులో 11,689 మాత్రమే ఇప్పటి వరకు ఆమోదించారు.. ఇంకా 31 వేలకు పైగా దరఖాస్తులు పెండిగ్లో పెట్టారు. వాస్తవానికి సవరణలే వేగంగా జరగాలి.. తొలగింపులపై ఆచితూచి ముందుకు వెళ్లాలి. ఇక్కడ అధికారులు ఇందుకు భిన్నంగా వెళుతున్నారు. దీనివల్ల ముసాయిదా జాబితా మరలా తప్పులతడకగా విడులయ్యే అవకాశం ఉందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ రెవెన్యూ అధికారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోలుకోలేని దెబ్బ
[ 06-12-2023]
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పాడేరు- అరకు మార్గంలో బర్మన్గుడ గ్రామానికి చెందిన ఒలిబిరి భీమన్న అనే గిరిజన రైతు ఎకరం వరి పంట చేతికి వచ్చే సమయంలో వరి పనలు పూర్తిగా నీటమునగడంతో నష్టపోయానని వాపోయారు. -
బోట్ల వెలికితీతకు సన్నాహాలు
[ 06-12-2023]
చేపలరేవు జీరో జెట్టీలో మునిగిన బోట్లను వెలికి తీసేందుకు మత్స్యశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు విశాఖ పోర్టు అథారిటీ(వీపీఎ) అధికారులకు లేఖ రాసింది. -
తెదేపా బలోపేతానికి కృషి
[ 06-12-2023]
అరకులోయ శాసనసభ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దొన్నుదొర అన్నారు. -
చంద్రన్నతోనే పేదలకు న్యాయం
[ 06-12-2023]
తెదేపాతోనే రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. మండలంలోని తాళ్లగొమ్మూరులో మంగళవారం పర్యటించిన ఆమె సీపీఎం, వైకాపాల నుంచి తెదేపాలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. -
వైకాపాను గద్దె దించడమే లక్ష్యం: భాజపా
[ 06-12-2023]
సీఎం జగన్మోహన్రెడ్డి ఇసుక, మద్యం, మైనింగ్ మాఫియాలతో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటున్నారని భాజపా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ మండిపడ్డారు. -
విజయసాయి బంధువులకు రూ.వందల కోట్లలో టీడీఆర్
[ 06-12-2023]
టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్) పత్రాల జారీ కోసమే దసపల్లా భూముల్లో మాస్టర్ ప్లాన్ రహదారి-2041ని అభివృద్ధి చేయడానికి జీవీఎంసీ రహదారి అభివృద్ధి ప్రణాళిక (ఆర్డీపీ) నోటిఫికేషన్ జారీ చేసిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ ఆరోపించారు. -
డ్వాక్రా సొమ్ము పక్కదారి
[ 06-12-2023]
డ్వాక్రా మహిళల ఖాతాలకు వెళ్లాల్సిన పొదుపు సొమ్ము కొంత మంది సిబ్బంది తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
సూపర్వైజర్ శ్రీధర్ అనుమానాస్పద మృతి
[ 06-12-2023]
శరగడం శ్రీధర్ (24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. పాడేరు నుంచి మైదాన ప్రాంతంలోని స్వగ్రామానికి శ్రీధర్ మంగళవారం ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. -
మహాసభలకు భారీగా తరలింపు
[ 06-12-2023]
విజయవాడలో జరనున్న ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల రాష్ట్ర మహాసభలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా తరలివెళ్లాలని సంఘం నేతలు నిర్ణయించారు. -
రానున్న 24 గంటలూ అధికారులంతా అప్రమత్తం
[ 06-12-2023]
మిగ్జాం తుఫాను ప్రభావంతో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ ఆదేశించారు. -
మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలి
[ 06-12-2023]
మిగ్జాం తుపాను తీవ్రత ఇంకా తగ్గని నేపథ్యంలో తీరప్రాంతాల్లో మత్స్యకారులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక ఉప కలెక్టర్ మహేష్ సూచించారు. -
‘ఇప్పటికైనా కళ్లు తెరవండి జగన్మోహన్రెడ్డి’
[ 06-12-2023]
‘అమరావతే ఏపీ రాజధాని అని కేంద్రం మరోసారి స్పష్టంగా చెప్పింది. ఇప్పటికైనా మీ కళ్లు తెరవండి జగన్మోహన్రెడ్డి గారు..’ అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన ట్విటర్ ద్వారా స్పందించారు. -
‘ఉపేంద్రగాడి అడ్డా’ సందేశాత్మక సినిమా
[ 06-12-2023]
ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మించిన ‘ఉపేంద్ర గాడి అడ్డా’ చిత్రం సక్సెస్ మీట్ కార్యక్రమం మంగళవారం డాబాగార్డెన్స్ అల్లూరిసీతారామరాజు విజ్ఞానకేంద్రంలో నిర్వహించారు.


తాజా వార్తలు (Latest News)
-
Gurpatwant Singh Pannun: పన్నూ బెదిరింపుల వీడియో.. దిల్లీలో అలర్ట్
-
Atlee: ‘జవాన్’కు అరుదైన గౌరవం.. ఆనందంగా ఉందంటూ అట్లీ పోస్ట్
-
AP High Court: విశాఖకు కార్యాలయాలను తరలించడంపై జీవో.. హైకోర్టులో విచారణ
-
BJP: అసెంబ్లీలకి ఎన్నికైన.. 10 మంది భాజపా ఎంపీల రాజీనామా
-
Automobile Sales: రికార్డు స్థాయికి వాహన విక్రయాలు.. నవంబర్లో 28.54 లక్షల అమ్మకాలు
-
AP High Court: ‘ఇసుక కేసు’లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా