logo

వైకాపాను గద్దె దించడమే లక్ష్యం: భాజపా

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక, మద్యం, మైనింగ్‌ మాఫియాలతో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటున్నారని భాజపా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ బాజీ మండిపడ్డారు.

Published : 06 Dec 2023 03:13 IST

సమావేశంలో మాట్లాడుతున్న భాజపా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ బాజీ, వేదికపై పాంగి రాజారావు, ఉమామహేశ్వరరావు తదితరులు

పాడేరు, న్యూస్‌టుడే: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇసుక, మద్యం, మైనింగ్‌ మాఫియాలతో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటున్నారని భాజపా మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ బాజీ మండిపడ్డారు. మంగళవారం పాడేరు పర్యటనలో భాగంగా స్థానిక మోదకొండమ్మ అమ్మవారి ఆడిటోరియంలో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రాక్షస పాలన సాగిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో వారిని గద్దె దించడమే తమ లక్ష్యమన్నారు. భాజపా మైనారిటీ మోర్చా, గిరిజన మోర్చాల ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై పోరాటం చేయటానికి ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుసా ఉమామహేశ్వరరావు, అల్లూరి జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సయ్యద్‌బాషా, రవికుమార్‌, ఉపాధ్యక్షులు చింతాడ మోహన్‌రావు, భాజపా జిల్లా కార్యదర్శి సల్లా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని