logo

చంద్రన్నతోనే పేదలకు న్యాయం

తెదేపాతోనే రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. మండలంలోని తాళ్లగొమ్మూరులో మంగళవారం పర్యటించిన ఆమె సీపీఎం, వైకాపాల నుంచి తెదేపాలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

Published : 06 Dec 2023 03:32 IST

పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పుతున్న మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి

కూనవరం, న్యూస్‌టుడే: తెదేపాతోనే రాష్ట్రంలోని పేదలకు న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. మండలంలోని తాళ్లగొమ్మూరులో మంగళవారం పర్యటించిన ఆమె సీపీఎం, వైకాపాల నుంచి తెదేపాలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు బడుగు, బలహీన వర్గాల కోసం అమలుచేసిన పలు సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం రద్దుచేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన కూటమి తిరగులేని ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎడవల్లి భాస్కరరావు, మండల పార్టీ అధ్యక్షుడు బరపాటి ప్రకాశరావు, ధనలక్ష్మి, బాయమ్మ, వెంకన్న, రవి, ప్రవీణ్‌, నాగిరెడ్డి, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని