కోలుకోలేని దెబ్బ
మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పాడేరు- అరకు మార్గంలో బర్మన్గుడ గ్రామానికి చెందిన ఒలిబిరి భీమన్న అనే గిరిజన రైతు ఎకరం వరి పంట చేతికి వచ్చే సమయంలో వరి పనలు పూర్తిగా నీటమునగడంతో నష్టపోయానని వాపోయారు.
వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి, చెరకు పైర్లు
అన్నదాతలను వణికించిన మిగ్జాం తుపాను
వర్షానికి తడిసిన వరి పనలు
పాడేరు, న్యూస్టుడే: మిగ్జాం తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపి లేని వర్షంతో పాడేరు- అరకు మార్గంలో బర్మన్గుడ గ్రామానికి చెందిన ఒలిబిరి భీమన్న అనే గిరిజన రైతు ఎకరం వరి పంట చేతికి వచ్చే సమయంలో వరి పనలు పూర్తిగా నీటమునగడంతో నష్టపోయానని వాపోయారు. 30 వేలు వరకు ఖర్చు చేశానని తెలిపారు. పాడేరు మండలంలో చాలా మంది గిరిజనులు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తుగా అప్రమత్తమయ్యారు. మారుమూల గ్రామాల్లో గిరిజనులు ఒక్కరోజు ముందుగానే వరి కోతలు ప్రారంభించడంతో వరి పనలు తడిసిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి ప్రవహించింది.
చింతపల్లి, లంబసింగి ఘాట్రోడ్డులో నిలిచిన వాహనాలు
జిల్లాలో 21.61 మి.మీ వర్షపాతం: జిల్లా వ్యాప్తంగా మంగళవారం సరాసరి 21.61 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతావరణ శాఖ ప్రకటించింది. జిల్లాలో అత్యధికంగా అనంతగిరిలో 52.4 వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా దేవీపట్నం మండలంలో 3.4, డుంబ్రిగుడ 45.6, గంగవరం 36.8, పాడేరు 33.8,ఎటపాక 30.2, కూనవరం 24.2, హుకుంపేట 23.8, జి.మాడుగుల 26.2, రంపచోడవారం 20.4, జీ.కే.వీధి 20.8 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు జిల్లా వాతారణ శాఖ అధికారులు వెల్లడించారు.
అనంతగిరి, న్యూస్టుడే: మండలంలో ఎడతెరిపి లేని వర్షంతో జన జీవనం స్తంభించింది. గుమ్మ పంచాయతీ వంజలవలస గ్రామానికి చెందిన బిడ్డ పైడిరాజు పెంకుటిల్లు నేల మట్టం అయింది. ప్రభుత్వం తనకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన కోరారు. ఎక్కడికక్కడ రహదారులన్నీ చిత్తడిగా తయారయ్యాయి. శారద, గోస్తనీ నదులు ఉప్పొంగి ప్రవహించాయి.
సంపంగిగెడ్డలో కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు
డుంబ్రిగుడ, న్యూస్టుడే: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో డుంబ్రిగుడ, హుకుంపేట, అరకులోయ మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కించుమండ సంపంగిగెడ్డలో వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయింది. సంపరగెడ్డ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చాపరాయి, గోరాపూర్, కురిడి గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చాపరాయిలో పర్యటకుల సందర్శనను నిలుపు చేశారు. జాతీయ రహదారి చిత్తడిగా మారడంతో వాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. వరి కోతలు నిలిచిపోయాయి. కల్లాల్లో టార్పాలిన్లు వేసి గిరిజన రైతులు వరి పంటను కాపాడుకొంటున్నారు.
పాడేరు- అరకు మార్గంలోని బర్మన్గుడ వద్ద తడిసిన పనలను చూపిస్తున్న రైతు
చింతపల్లి గ్రామీణం, న్యూస్టుడే: మిగ్జాం తుపాను కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మన్యంలో భారీ వృక్షాలు నేలకొరిగాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు జలమయమయ్యాయి. మంగళవారం చింతపల్లి, లంబసింగి ఘాట్రోడ్డు వద్ద భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయాయి. పక్కనే ఉన్న గ్రామానికి చెందిన గిరిజనులు, తోటి ప్రయాణికులు సహాయంతో చెట్టు కొమ్మలు నరికి, రహదారికి అడ్డంగా ఉన్న చెట్టును తొలగించారు. రహదారిని క్లీయర్ చేయగా ఇరువైపులా నిలిచిన వాహనాలు ముందుకు కదిలాయి.
వి.కోడాపల్లి సమీపంలో రోడ్డుపై విరిగిపడిన చెట్టు కొమ్మల తొలగింపు
భారీ వర్షాలకు కూలిన ఇల్లు, పడిన చెట్లు
జి.మాడుగుల, న్యూస్టుడే: తుపాను ప్రభావంతో జి.మాడుగుల మండలంలోని భారీ వర్షం కురిసింది. భీరం పంచాయతీ వి.కోడాపల్లి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ వృక్షం రహదారికి అడ్డంగా పడిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పోలీసులు, స్థానిక నాయకులు, ప్రజలు సహకారంతో చెట్టును తొలగించి రాకపోకలు యథావిథిగా సాగించారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరించారు. జి.మాడుగుల పంచాయతీ చుట్టుమెట్ట గ్రామానికి చెందిన కిల్లో మహేష్కి చెందిన ఇల్లు సాయంత్రం 3 గంటల సమయంలో కూలిపోయింది. ఆ సమయంలో తల్లి కిల్లో లలిత, కుమారుడు ఇంట్లో ఉన్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఇల్లు పడిపోతున్నట్టు గమనించిన తల్లి, కుమారుడు బయటకు పరుగులు తీశారు. దీంతో ప్రమాదం తప్పింది. సొలభం పంచాయతీ ఏనుగుగొంది గ్రామానికి చెందిన మాతే దేవన్నదొర, లింగమ్మలకు చెందిన నాలుగు ఎకరాల కోసిన వరి పంట వరదకు కొంత కొట్టుకుపోయింది. బొయితిలి పంచాయతీ వై.మండిభ గ్రామంలో రాజ్మా విత్తనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు.
చుట్టుమెట్ట గ్రామంలో కూలిన కిల్లో మహేష్ ఇల్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం