logo

నేడు పవన్‌కల్యాణ్‌ బహిరంగ సభ

ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో గురువారం జనసేన ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుందని.. జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ సభలో పాల్గొని ప్రసంగిస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వెల్లడించారు.

Published : 07 Dec 2023 02:13 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానంలో గురువారం జనసేన ఆధ్వర్యంలో బహిరంగ సభ జరుగుతుందని.. జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌ సభలో పాల్గొని ప్రసంగిస్తారని జనసేన జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు వెల్లడించారు. బుధవారం ఆళ్వార్‌దాస్‌ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్‌ గురువారం మధ్యాహ్నం 1 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారని.. అక్కడి నుంచి నేరుగా బీచ్‌రోడ్డులోని నోవాటెల్‌ హోటల్‌కు వెళతారన్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ఎంవీపీకాలనీ ఆళ్వార్‌దాస్‌ మైదానానికి చేరుకుంటారన్నారు. ఈ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు.  జనసేన నాయకులు కోన తాతారావు మాట్లాడుతూ బహిరంగ సభ జరిగిన తర్వాత పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం ఉంటుందన్నారు.

జనసేనలోకి సుందరపు సతీష్‌..

యలమంచిలి నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి సుందరపు విజయ్‌కుమార్‌ సోదరుడు సుందరపు సతీష్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు జనసేన పార్టీలో చేరుతున్నట్లు పంచకర్ల రమేష్‌బాబు వెల్లడించారు. పవన్‌కల్యాణ్‌ సమక్షంలో గురువారం పార్టీలోకి చేరుతున్నారని, ఆయనను పవన్‌కల్యాణ్‌ కండువా కప్పి ఆహ్వానిస్తారన్నారు. విలేకర్ల సమావేశంలో సుందరపు విజయ్‌కుమార్‌, పసుపులేటి ఉషాకిరణ్‌, పంచకర్ల సందీప్‌, శివప్రసాద్‌, నాగలక్ష్మీ, ప్రశాంతి, త్రివేణి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు