మిగ్జాం బీభత్సం.. రైతన్న కలవరం
తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా రంపచోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి వంతల రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లిపాక గ్రామంలో బుధవారం పర్యటించిన ఆమె నీటి మునిగిన వరి, మిర్చి, పత్తి పొలాలను పరిశీలించారు.
ఎటపాక, న్యూస్టుడే: తుపాను వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా రంపచోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి వంతల రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెల్లిపాక గ్రామంలో బుధవారం పర్యటించిన ఆమె నీటి మునిగిన వరి, మిర్చి, పత్తి పొలాలను పరిశీలించారు. తెదేపా నేతుల పుట్టి రమేష్బాబు, కానూరి బుల్లెయ్య, మాచినేని రాజేష్, బొల్లా రమేష్, గుర్రం సాయి, కర్రి బుజ్జి, చిలుకూరి శ్రీనివాసరావు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
వరరామచంద్రాపురం, కూనవరం, న్యూస్టుడే: ప్రభుత్వం కుంటిసాకులు చెప్పకుండా, తుపానుకు నష్టపోయిన ప్రతీ రైతుని ఆదుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు ములకాల సాయికృష్ణ డిమాండ్ చేశారు. వర్షాలతో మునిగిపోయిన వరి, మిర్చి, పొగాకు, అపరాల పంటలను వారు బుధవారం పరిశీలించారు. కూనవరం మండలంలో పాడైన పంటలను సీపీఎం, భాజపా, తెదేపా నాయకులు పరిశీలించారు. మేకల నాగేశ్వరరావు, సీతారామయ్య, నాగమణి, నోముల రామారావు, సత్యనారాయణ పాల్గొన్నారు.
రాజవొమ్మంగి, న్యూస్టుడే: తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేల నష్టపరిహారం ఇవ్వాలని మండల తెదేపా అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు, మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బొదిరెడ్డి త్రిమూర్తులు డిమాండ్ చేశారు. రాజవొమ్మంగి, దూసరపాము, బడదనాంపల్లి, తంటికొండలో పర్యటించారు.
రంపచోడవరం, న్యూస్టుడే: తుపాను ప్రభావంతో నియోజకవర్గంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత శీతంశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులకు పరిహారం ఇవ్వాలన్నారు.
కొయ్యూరు, న్యూస్టుడే: నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని జీసీసీ మాజీ ఛైర్మన్ ఎంవీవీ ప్రసాద్ కోరారు. కొయ్యూరులో నీటి మునిగిన వరి పనలను బుధవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. బాధితులకు వైకాపా ప్రభుత్వం కనీసం భోజనం పెట్టలేకపోయిందని విమర్శించారు. అంతాడ పంచాయతీలో సీపీఐ మండల కార్యదర్శి దేముడు, రావణాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు పర్యటించి పంట నష్టాలను పరిశీలించారు.
అరకులోయ పట్టణం: బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయం అందించి ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, మండల కార్యదర్శి కిండంగి రామారావు డిమాండ్ చేశారు. యండపల్లివలస, బస్కి పంచాయతీ గ్రామాల్లో సీపీఎం నాయకులు పర్యటించి పాడైన పంటలను పరిశీలించారు.
ప్రమాదకరంగా ఘాట్రోడ్లు
చింతపల్లి గ్రామీణం,పాడేరు: లంబసింగి సమీపంలోని చెరువులవెనం వ్యూపాయింట్కు వెళ్లే మార్గంలో, పాడేరు ఘాట్రోడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చెరువులవెనం వ్యూపాయింట్కు వెళ్లేందుకు గ్రావెల్ రోడ్డును నిర్మించారు. ఈ మార్గంలో ద్విచక్రవాహనాలు, జీపులు నడుస్తున్నాయి. తుపాను కారణంగా కొండపై నుంచి వర్షపు నీరు దిగువకు ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. వాటిని తొలగించే వరకు పర్యటకులకు కాలినడక తప్పదు.
మత్య్సగెడ్డలో పడి గిరిజనుడి మృతి
పెదబయలు గ్రామీణం, న్యూస్టుడే: మత్య్సగెడ్డలో పడి గిరిజనుడు మృతి చెందాడు. ఎస్సై మనోజ్కుమార్, స్థానికుల వివరాల ప్రకారం.. పెదకోడాపల్లి పంచాయతీ పరదానిపుట్టు సమీప మత్స్యగెడ్డ ఒడ్డున గ్రామానికి చెందిన బుధవారం కిల్లో రామకృష్ణ (40) మరొకరితో కలిసి పశువులు కాస్తున్నాడు. భారీ వర్షాలకు గెడ్డ ఒక్కసారిగా ఉద్ధృతిగా మారడంతో ఒడ్డు కూలిపోయి రామకృష్ణ గెడ్డలో జారిపడి గల్లంతయ్యాడు. కొంత సమయానికి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వరదలో చిక్కుకున్న పశువుల కాపరులు
పాడేరు, న్యూస్టుడే: మత్స్యగెడ్డలో వరద ఉద్ధృతికి ముగ్గురు పశువుల కాపరులు చిక్కుకున్నారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇరాడపల్లి పంచాయతీ డి.సంపాలు సమీపంలో పశువులు గెడ్డలో దిగిపోయాయి. దీంతో కాపరులు వాటిని దారి మళ్లించేందుకు గెడ్డలో దిగి చిక్కుకున్నారు. వాలంటీరు నాగేశ్వరరావు ఈత కొట్టుకొంటూ వెళ్లి వారిని బయటకు తీసుకువచ్చారు.
వెలవెలబోయిన సంత
డుంబ్రిగుడ, న్యూస్టుడే: కించుమండ సంతబయలులో బుధవారం వారపు సంత వెలవెల బోయింది. తుపాను ప్రభావంతో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో క్రయ, విక్రయాలు నిలిచిపోయాయి. గిరిజనులు, వ్యాపారులు లేక నిర్మానుష్యంగా మారింది.
గూడెంకొత్తవీధి, సీలేరు, న్యూస్టుడే: గూడెంకొత్తవీధి తహసీల్దార్ కార్యాలయం వద్ద చెట్టు కొమ్మ విరిగిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. దేవరాపల్లి పంచాయతీ మల్లిఖార్జున గ్రామంలో ముర్ల చితుకులయ్య, పారత్వమ్మల ఇల్లు ధ్వంసమైంది. ధారకొండ, గుమ్మిరేవులలోని వరిచేలు నీటమునిగాయి.
జి.మాడుగుల, న్యూస్టుడే: కుంబిడిసింగి, గద్దెరాయి, సంఘం వంతెనల మీదుగా నీరు ప్రవహించింది. జి.మాడుగుల పాత రెవెన్యూ కాలనీలో రహదారికి అడ్డంగా చెట్టు పడింది. చేపల్లిలో ఇంటిపై చెట్టు పడింది. తుపాను వల్ల పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని జడ్పీటీసీ సభ్యురాలు ఎం.వెంకటలక్ష్మి అన్నారు. బుధవారం కుంబిడిసింగి, సంఘం, గద్దెరాయి వంతెనలను ఆమె పరిశీలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్