logo

315 లీటర్ల సారా స్వాధీనం

మండలంలోని గుండువారిగూడెం గ్రామంలో గురువారం దాడులు నిర్వహించి 315 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని,

Published : 23 Feb 2024 01:23 IST

ఎటపాక, న్యూస్‌టుడే: మండలంలోని గుండువారిగూడెం గ్రామంలో గురువారం దాడులు నిర్వహించి 315 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని, 11,550 లీటర్ల బెల్లం పులుపును ధ]]్వంసం చేసి, ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఈబీ పాడేరు ఏఈఎస్‌ నాగ రాహుల్‌ తెలిపారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ దాడిలో రంపచోడవరం, చింతూరు, భద్రాచలం, ఎటపాక ఎస్‌ఈబీ, పోలీస్‌ సిబ్బందితదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని