logo

మన్యంలో ‘నిజం గెలవాలి’

నారా భువనేశ్వరి ఈనెల 27న అరకులోయలో పర్యటించనున్నట్లు తెదేపా అరకులోయ నియోజకవర్గ సమన్వయకర్త దొన్నుదొర గురువారం తెలిపారు.

Updated : 23 Feb 2024 02:52 IST

అరకులోయ, న్యూస్‌టుడే: నారా భువనేశ్వరి ఈనెల 27న అరకులోయలో పర్యటించనున్నట్లు తెదేపా అరకులోయ నియోజకవర్గ సమన్వయకర్త దొన్నుదొర గురువారం తెలిపారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా ఆమె అరకులోయ రానున్నారని చెప్పారు. అరకులోయ మండలం ముసిరిగుడకి చెందిన తెదేపా కార్యకర్త బసు.. చంద్రబాబునాయుడి అరెస్టు సమయంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించనున్నారని దొన్నుదొర వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని