logo

పాడేరులో 28న..గెలవాలి కార్యక్రమం

పాడేరు నియోజకవర్గంలో ఈనెల 28న నిజం గెలవాలి కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు.

Published : 23 Feb 2024 01:26 IST

నాయకులతో సమావేశమైన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు నియోజకవర్గంలో ఈనెల 28న నిజం గెలవాలి కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. గురువారం తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబునాయుడు అరెస్టును తట్టుకోలేక జి.మాడుగుల, కిండంగి గ్రామాల్లో మరణించిన కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారని చెప్పారు. పాడేరు నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని