logo

మలుపుల్లో సెల్ఫీ.. చేజేతులా ముప్పు

మారేడుమిల్లికి వచ్చే పర్యటకుల్లో కొందరు చేజేతులా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు.

Published : 23 Feb 2024 01:28 IST

వాలమూరు వద్ధ రహదారిపైనే సెల్ఫీలు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లికి వచ్చే పర్యటకుల్లో కొందరు చేజేతులా ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇక్కడి రహదారుల పరిస్థితులు, కొండవాగులపై అవగాహన ఉండటం లేదు. భద్రాచలం రహదారిలో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ మార్గం దట్టమైన అడవులతో విస్తరించి ఉండడం, పైగా సన్నగా, వంపులు తిరుగుతూ సాగిపోవడంతో పర్యాటకుల వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. యువత ప్రధాన రహదారులపైనే సెల్ఫీలు తీసుకుంటుండడంతో మలుపుల్లో వచ్చే వాహనాలు ఢీ కొంటున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇలాగే ఇద్దరు మహిళలను కారు ఢీకొట్టడంతో వారిద్దరూ ఏకంగా వంతెన పైనుంచి కిందికి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చే వాహనాలు రహదారులపై పర్యటకులను తప్పించే క్రమంలో చెట్లను, విద్యుత్తు స్తంభాలను ఢీకొట్టిన ఘటనలూ జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు