పట్టించుకోని ప్రభుత్వం..ప్రవాసుల సాయం
ఏజెన్సీ ప్రాంతంలో పాఠశాలలకు భవనాలు అంతంత మాత్రం. దీంతో గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థుల భవితకు చేయూత
ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో రూ.మూడు లక్షలతో ఏర్పాటు చేసిన భోజనశాల
రంపచోడవరం, న్యూస్టుడే: ఏజెన్సీ ప్రాంతంలో పాఠశాలలకు భవనాలు అంతంత మాత్రం. దీంతో గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మన్యంలో గిరిజనులు ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 1986లో గురుకులాలు స్థాపించారు. అప్పట్లో రంపచోడవరంలోనూ ఒకటి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో అయిదు నుంచి పదో తరగతి వరకు 470మంది విద్యార్ధులు చదువుతున్నారు. పదేళ్ల క్రితం పాఠశాల భవనం స్లాబ్, గోడలు బీటలు వారాయి. ఫలితంగా ప్రమాదభరితంగా మారింది. దీంతో ఉన్న విద్యార్థులంతా రాత్రి వేళల్లో నిద్రించే భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం దీనిపై స్పందించడం లేదు.
రంపచోడవరంలో సుందరంగా తీర్చిదిద్దిన పాఠశాల భవనం
గురుకుల పాఠశాలలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై స్థానిక ప్రిన్సిపల్ అహ్మద్ ఆలీషా స్పందించి ఆరు తరగతి గదులను సొంత నిధులతో మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకొచ్చారు. దీంతో ప్రభుత్వం మంజూరు చేసిన పది ఐఎఫ్పీ (టీవీలను) తరగతి గదుల్లో అమర్చి విద్యార్ధులకు పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. దీంతో విద్యార్థుల ఇబ్బందులను తొలగించారు. అయితే చాలీచాలని భోజనశాల ఉండటంతో ప్రిన్సిపల్ అహ్మద్ ఆలీషా ఆమెరికాలో ఉంటున్న తన మిత్రుడు ఆనంద్కు ఇక్కడి పరిస్థితిని వివరించారు. అక్కడి ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఆనంద్ రూ.మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మొత్తంతో 200 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసేలా భోజనశాలను ఏర్పాటు చేశారు. సాయం చేసిన దాతను, చొరవ చూపిన ప్రిన్సిపల్ను ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే