వారంతా ఒక్కటిగా.. పేద విద్యార్థులకు తోడుగా..
గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఫోర్జీఆర్ ట్రస్టు అండగా నిలుస్తోంది. చదువుపై ఆసక్తి ఉన్నా.. పేదరికం కారణంగా ఎంతోమంది మధ్యలోనే విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారందరికి ఈ ట్రస్టు సభ్యులు భరోసా ఇస్తున్నారు.
ప్రతిభావంతులకు ప్రోత్సాహం
చోడవరం పట్టణం, న్యూస్టుడే
గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులకు ఫోర్జీఆర్ ట్రస్టు అండగా నిలుస్తోంది. చదువుపై ఆసక్తి ఉన్నా.. పేదరికం కారణంగా ఎంతోమంది మధ్యలోనే విద్యకు దూరమవుతున్నారు. ఇలాంటి వారందరికి ఈ ట్రస్టు సభ్యులు భరోసా ఇస్తున్నారు. ఓ ఉపాధ్యాయిని ప్రోత్సాహంతో పూర్వ విద్యార్థులంతా ఒక్కటై.. పేద విద్యార్థులకు తోడుగా నిలుస్తున్నారు.
చోడవరం పట్టణానికి చెందిన ఈగల వెంకట అన్నపూర్ణ 15 ఏళ్ల కిందట ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పనిచేశారు. అప్పట్లో ఆమె వద్ద చదువుకున్న విద్యార్థులంతా పైసా పైసా పోగేసి ప్రేమ సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించే వారు. చదువు పూర్తి చేసుకుని వివిధ రంగాల్లో స్థిరపడిన వారంతా ఉపాధ్యాయిని అన్నపూర్ణను కలిసి అందరం కలిసి ఏదైనా చేద్దామని ప్రతిపాదన తీసుకువచ్చారు. ఈ క్రమంలో 2020 ఆగస్టు 15న ఫర్ ద గుడ్ రీజన్ (4జీఆర్) పేరుతో సేవా సంస్థ ఏర్పాటైంది.
- ట్రస్టు ద్వారా ఏటా చోడవరంతోపాటు ఖండివరం, చీడికాడ, చుక్కపల్లి, మంచాల ఆదర్శ పాఠశాల, మేడివాడ, జి.అగ్రహారం, గాదిరాయి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు, దివ్యాంగులకు రూ. 25 వేల విలువ చేసే స్టడీ మెటీరియల్తోపాటు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. నూజివీడు ఐఐఐటీలో చదువుతున్న విద్యార్థిని ఆర్.వర్షితకు రూ.పది వేలు ఆర్థికసాయంగా అందజేశారు. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న చిన్నారులకు అవసరమైన విద్యా సంబంధ సామగ్రిని సమకూరుస్తున్నారు.
- చోడవరం ప్రేమ సమాజంలో చదువుకుంటున్న విద్యార్థులకు క్రీడా సామగ్రి, గ్రంథాలయ పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశారు. విద్యార్థులకు చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహించి బహుమతులు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. అనాథలకు, వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.
- హెల్పింగ్ హ్యాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రేమ సమాజం, పోలీస్స్టేషన్, భవిత కేంద్రాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టారు. చోడవరం పోలీస్స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న రాజు కుమారుడు విద్యుదాఘాతానికి గురవగా.. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు అందించారు.
చదువుకు దూరం కాకూడదనే..
- అన్నపూర్ణ, ట్రస్టు వ్యవస్థాపకురాలు
పేదరికం, ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. అటువంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనే 4జీఆర్ ట్రస్టును పూర్వ విద్యార్థులతో కలిసి ఏర్పాటు చేశాం. విద్యాపరంగా పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే