స్పందన ఫిర్యాదులపై అలసత్వం వద్దు
స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు.
పాడేరు, న్యూస్టుడే: స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన జగనన్నకు చెబుదాం- ప్రత్యేక స్పందనలో కలెక్టర్, సంయుక్త కలెక్టర్ భావన, ఐటీడీఏ పీఓ అభిషేక్ ప్రజల నుంచి 110 వినతులు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులు, తాగునీటి సదుపాయాల కోసం అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వీటి పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా అధికారులు నిర్దేశించిన సమయానికి స్పందనకు హాజరుకావాలని స్పష్టంచేశారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీ శరభగుడ శ్మశానవాటికకు ప్రహరీ నిర్మించాలని ఎంపీటీసీ సభ్యుడు దురియా ఆనంద్కుమార్ వినతిపత్రం సమర్పించారు. పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ శ్రీపురం కూడలి నుంచి జి.మాడుగుల మండలం నుర్మతి పంచాయతీ చేరువీధి వరకు మట్టి రోడ్డు నిర్మించాలని కె.రాంబాబు, బి.కృష్ణపడాల్ తదితరులు విన్నవించారు. పెదబయలు మండలం పెదకోడాపల్లి గ్రామ సచివాలయం భవనం త్వరితగతిన పూర్తి చేయాలని పాంగి ప్రసాద్ కోరారు. పెదబయలు మండలం కుర్తాడ నుంచి బూరుగువీధి వరకు రోడ్డు నిర్మించాలని బొండపల్లి సర్పంచి జి.మత్స్యరాజు వినతి పత్రం అందించారు. పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ నడింవీధిలో తాగునీటి సమస్య అధికంగా ఉందని, తక్షణమే సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు మంగమ్మ, కొండమ్మ తదితరులు పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో రోడ్డు నిర్మించానని, బిల్లులు మంజూరు చేయాలని గుత్తేదారు ఎం.నాగభూషణం విన్నవించారు. పీవీటీజీలకు ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించాలని భాషా వాలంటీర్లు కోరారు. డీఆర్ఓ లక్ష్మణమూర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్లు వి.వి.ఎస్ శర్మ, భవానీ, గిరిజన సంక్షేమశాఖ ఈఈ డీవీఆర్ఎం రాజు, వేణుగోపాల్, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, డీఎల్పీఓ పి.ఎస్ కుమార్, ఎల్డీఎం రవితేజ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ