కొండకర్ల రిసార్ట్స్లో రేవ్ పార్టీ!
అచ్యుతాపురం మండలం కొండకర్లలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి రిసార్ట్స్లో రేవ్ పార్టీలో యువతీ యువకుల ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు దారితీసింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మద్యం మత్తుతో యువతీ, యువకుల ఘర్షణ
అచ్యుతాపురం, న్యూస్టుడే
అచ్యుతాపురం మండలం కొండకర్లలో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి రిసార్ట్స్లో రేవ్ పార్టీలో యువతీ యువకుల ఘర్షణ పోలీస్ స్టేషన్ వరకు దారితీసింది. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి విశాఖ జిల్లాతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన 15 మంది యువకులు, నలుగురు యువతులను తీసుకొని బుధవారం రాత్రి కొండకర్ల రిసార్ట్స్కు వచ్చారు. అధికార పార్టీకి చెందిన నేత రిసార్ట్స్లో సాయంత్రం నుంచి మత్తు పదార్థాలు తాగి తెల్లవారుజాము వరకు గడిపారు. మద్యం మత్తు ఎక్కువ కావడంతో వెంట తీసుకొచ్చిన యువతులను దుస్తులు లేకుండా డ్యాన్స్ చేయమని ఒత్తిడి చేశారు. దీంతో రక్షించాలని వారు 100 నంబరుకు ఫోన్ చేసి కోరారు. పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి అచ్యుతాపురం పోలీసులకు సమాచారం అందడంతో ఇద్దరు పోలీసులు రిసార్ట్స్కు వెళ్లారు. అక్కడ ఇద్దరు యువకులు, యువతులు కనిపించారు. పోలీసులు రావడంతో మద్యం మత్తులో ఉన్నవారు జారుకున్నారో? జారవిడిచారో? తెలియదుకానీ అంతా కనిపించకుండా పోయారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకున్న దిశ యాప్ కాదని.. కష్టంలో ఉన్న యువతులు సాధారణంగా ప్రజలందరూ ఉపయోగించే 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. యువతులు పోలీసులకు సమాచారం అందించినా ఒత్తిడో, కాసుల కక్కుర్తో తెలియదుకానీ కేసు నమోదు కాలేదు. తరలించిన యువతీ, యువకులను మందలించి వదిలేసినట్లు తెలిసింది. దీనిపై అచ్యుతాపురం సీఐ బుచ్చిరాజును వివరణ కోరగా మద్యం మత్తులో చిన్నపాటి ఘర్షణ జరిగినట్లు 100కు సమాచారం రావడంతో స్పందించి పరిశీలించామని, ఎటువంటి ఇబ్బందిలేదని తెలిసిందన్నారు. యువతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, అందుకే కేసు నమోదు చేయలేదన్నారు.
అసాంఘిక కార్యకలాపాల అడ్డాగా.. ప్రకృతి ప్రేమికుల మదిని దోచే కొండకర్ల ఆవ అందాలను చూడడానికి వచ్చే పర్యటకుల కోసం ఆవను ఆనుకొని ఐదు రిసార్ట్స్ నిర్మించారు. వీటిలో కొన్ని డ్రగ్స్, జూదాలకు కేంద్రాలుగా మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. గతంలో ఇక్కడ ఉన్న రిసార్ట్స్కు వచ్చిన కొందరు స్నేహితుడిని మద్యం మత్తులో స్విమ్మింగ్ పూల్లోకి నెట్టివేయడంతో చనిపోయాడు. గాజువాకకు చెందిన ఒక బాలుడు స్విమ్మింగ్ఫూల్ వద్ద స్నానం చేస్తూ మృతిచెందాడు. ఓ రిసార్ట్లో గోవా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్తో యువకులు పట్టుపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం