ఇసుకా.. మస్కా..!
అనకాపల్లి జిల్లాలో ఇసుక డిపోల నిర్వహణ గాడి తప్పింది. అల్లూరి జిల్లాలో ఉచిత ఇసుక హామీ అమలుకు దూరమైంది. లక్షల్లో ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్న సర్కారు వాటి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను మాత్రం అందుబాటులో ఉంచడం లేదు.
నియోజకవర్గానికో నిల్వ కేంద్రమన్నారు.. మూడు మూసేశారు
అల్లూరి జిల్లాలో ఇళ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుకే లేదు..
ఈనాడు - పాడేరు, న్యూస్టుడే - నర్సీపట్నం గ్రామీణం
అనకాపల్లి జిల్లాలో ఇసుక డిపోల నిర్వహణ గాడి తప్పింది. అల్లూరి జిల్లాలో ఉచిత ఇసుక హామీ అమలుకు దూరమైంది. లక్షల్లో ఇళ్లు మంజూరు చేశామని చెబుతున్న సర్కారు వాటి నిర్మాణాలకు అవసరమైన ఇసుకను మాత్రం అందుబాటులో ఉంచడం లేదు. ముఖ్యంగా ఇసుక నిల్వ కేంద్రాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం.. ప్రభుత్వ అధికారుల నియంత్రణ లేకపోవడం ఇసుక సరఫరాలో జవాబుదారీతనం కొరవడింది. దీంతో గుత్తేదారుకు నచ్చినప్పుడు డిపోల్లో అరకొరగా నిల్వలు పెడుతున్నారు.. మరికొన్ని డిపోలు ఏకంగా మూసేశారు. వీరి చర్యల కారణంగా జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నెమ్మదించాయి. ఆయా పనులపై ఆధారపడిన కుటుంబాలు ఉపాధిని కోల్పోయే పరిస్థితి వస్తోంది.
నియోజకవర్గానికి ఒక ఇసుక డిపో అనిచెప్పి అయిదు చోట్ల మాత్రమే నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏడాది తిరగకుండానే వాటిలో మూడు డిపోలను మూసేశారు. ఉన్న రెండు నిల్వ కేంద్రాల్లోనైనా ఇసుక నిల్వలను సక్రమంగా నిర్వహిస్తున్నారా అంటే అదీ లేదు. డిపోల్లో ఎప్పుడు ఉంటుందో తెలీని పరిస్థితి. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి డిపోలో మాత్రమే ఇసుక అమ్మకాలు జరుగుతున్నాయి. నర్సీపట్నం డిపో కొంతకాలంగా మూతపడి ఇటీవలే మరలా నిల్వలు తెచ్చిపెడుతున్నారు. అచ్యుతాపురం, చోడవరం, అనకాపల్లి డిపోలు మూతపడి ఏడాదిపైనే అవుతోంది. అల్లూరి జిల్లాలో ఒక్క డిపో కూడా లేదు.. కానీ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో ‘ఇసుక ఈ ధరకు మించి కొనకండి.. అంతకంటే ఎక్కువ అడిగితే ఫిర్యాదు చేయండ’ని ప్రకటనలు జారీ చేయడం గమనార్హం. సర్కారు ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో సరఫరాకు భిన్నమైన పరిస్థితులున్నాయి.
దూరం.. భారం..: అచ్యుతాపురం, అనకాపల్లి, చోడవరం డిపోలు మూతపడడంతో వాటి పరిధిలో జగనన్న కాలనీలు, ప్రభుత్వ భవనాల నిర్మించే గుత్తేదారులు ఇసుక కోసం ఇక్కట్లు పడుతున్నారు. విశాఖలోని అగనంపూడి, నక్కపల్లి, నర్సీపట్నం డిపోలకు వెళ్లి ఇసుక తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇదివరకు దగ్గరలో డిపో ఉండడంతో ఇసుక రేటు పోను రవాణాగా రూ.వెయ్యి తీసుకునేవారు. ఇప్పుడు అదనపు భారం పడుతోంది. జగనన్న కాలనీలకు కూపన్లు ఇస్తున్నా దూరా భారం కావడంతో అదనంగా సొమ్ములు చెల్లించి స్థానికంగా టైరు బళ్లతో తెప్పించుకుంటున్నారు..
దళారుల దందా.. ఇళ్ల నిర్మాణాలకు లక్ష్యాలను విధిస్తున్నారు.. మరోవైపు ప్రభుత్వ ప్రాధాన్య పనులను పూర్తిచేయాలని ఒత్తిళ్లు తెస్తున్నారు.. అయితే వీటి నిర్మాణంలో కీలకమైన ఇసుకను అందుబాటులో ఉంచడం లేదు. దీంతో అక్రమార్కులు నిర్మాణదారుల నుంచి దొరికినకాడికి దోచుకుంటున్నారు. వారు చెప్పిన రేటుకే కొనాల్సి వస్తోంది. డిపోలకు వెళ్లే లారీలను సైతం పక్కదారి పట్టించి అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి.
నర్సీపట్నంలో డిపోలో ఇసుక నిల్వలున్నా పైనుంచి ఇంకా ఆదేశాలు రాలేదని అమ్మకాలు చేయకుండా చూస్తున్నారు. దీంతో కొంతమంది రాజమహేంద్రవరం నుంచి లారీలతో ఇసుక తెచ్చి ఇక్కడ ట్రాక్టర్లకు అధిక రేట్లకు అమ్మకాలు సాగిస్తున్నారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో ఏకంగా శారదా నదిని గుల్లచేసి ఇసుక తోడేస్తున్నారు. పక్క జిల్లాలకు అమ్మేస్తున్నారు.
ఉచిత ఇసుక మాకేది మహాప్రభో.. ‘అనకాపల్లి జిల్లాలో ఇళ్లు కట్టుకుంటే 20 టన్నుల ఉచితంగా ఇసుక ఇస్తున్నారు. అల్లూరి జిల్లాలో ఎందుకివ్వడం లేదు. మైదాన ప్రాంతంలో కంటే ఏజెన్సీలో ఇంటి నిర్మాణానికి రెట్టింపు వ్యయం అవుతుంది. ఉచిత ఇసుక ఎలాగూ ఇవ్వడం లేదు..ఆ మేరకు యూనిట్ విలువైనా పెంచండి లేకుంటే ఇసుకైనా ఇవ్వండ’ంటూ జడ్పీ సర్వసభ్య సమావేశంలో కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అల్లూరి జిల్లాలో పీఎంఏవై గ్రామీణ్ పథకంలో 12,997 ఇళ్లు మంజూరు చేశారు. పది వేల ఇళ్ల పనులు మొదలుపెట్టినట్లు అధికారులు చెబుతున్నా ఒక్క ఇంటికీ ఉచిత ఇసుక అందజేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు