సంప్రదాయ చేతివృత్తులకు కేంద్రం చేయూత
సంప్రదాయ చేతి వృత్తులకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో వారి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పాడేరు ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ పిలుపునిచ్చారు.
మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ అభిషేక్, ఎంఎస్ఎంఐ ప్రతినిధి నాగకుమార్, జిల్లా పరిశ్రమ కేంద్రం జీఎం శ్రీవాణిధర్ రామన్, ఏడీఎం నవీన్ కుమార్, డీఆర్డీఏ పీడీ మురళీ, డీఎల్పీఓ కుమార్
పాడేరు, న్యూస్టుడే: సంప్రదాయ చేతి వృత్తులకు ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో వారి సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పాడేరు ఐటీడీఏ పీఓ వి.అభిషేక్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంపై బుధవారం ఐటీడీఏ సమావేశ మందిరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి ఎంటర్ప్రైజస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పీఓ మాట్లాడుతూ చేతివృత్తులవారు పారిశ్రామికంగా ఎదగాలని ఆకాంక్షించారు. సరైన శిక్షణ లేని కారణంగా కళాకారులు వారి వృత్తుల్లో వెనుకబడి పోతున్నారని తెలిపారు. తయారీ వస్తువులకు మరింత విలువ పెంచి, మార్కెట్ సౌకర్యం కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా ఎదిగే విధంగా తీర్చిదిద్దడమే పీఎం విశ్వకర్మ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. గుర్తించిన వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, మంగలి, స్వర్ణకారులు, తాపీ పనివారు, చాకలి, టైలరింగ్ తదితర 18 వృత్తుల్లో నిమగ్నమైన వారికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని సూచించారు. ఆయా చేతివృత్తుల వారికి సరైన శిక్షణ ఇచ్చి మొదటి దశలో రూ. లక్ష, రెండో దశలో రూ. రెండు లక్షలు స్వల్ప వడ్డీకి రుణాలు అందిస్తారని వెల్లడించారు. శిక్షణ కాలంలో గౌరవ వేతనంతోపాటు టూల్ కిట్లు అందిస్తారన్నారు. 18 ఏళ్లు వయస్సు నిండి ఆసక్తి గల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఇప్పటి వరకు 9,300 మంది మాత్రమే ఈ పథకం కింద నమోదు చేసుకున్నారని, పాడేరు డివిజన్ పరిధిలో 5,500 మంది నమోదు చేసుకున్నారని వివరించారు. రుణాలు తీసుకుని వేరే పనులకు వినియోగించరాదని సూచించారు. నమోదు చేసుకున్న వారికి పంచాయతీల పరిధిలోనే శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. విశాఖపట్నం ఎంఎస్ఎంఈ సహాయ సంచాలకులు డీవీఎస్ఆర్ యూర్తి మాట్లాడుతూ విశ్వకర్మ పథకంలో ఎలా లబ్ధి పొందాలో అవగాహన కల్పించారు. సదస్సులో ఎంఎస్ఎంఐ ప్రతినిధి పి.నాగకుమార్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం శ్రీవాణిధర్ రామన్, ఏడీఎం నవీన్కుమార్, డీఆర్డీఏ పీడీ మురళి, డివిజన్ పంచాయతీ అధికారి పి.ఎస్.కుమార్, పలువురు పాల్గొన్నారు.
సదస్సుకు హాజరైన మహిళలు, యువత
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ