తప్పుకోవడానికి సిద్ధం
‘సాగునీటి చెరువుల పునరుద్ధరణకు సంబంధించి టెండరులో పేర్కొన్నట్లు మేం కొంతమేర పనులు చేశాం. వాటిలో కొన్ని పనులకు బిల్లులు ఇప్పటికీ అందలేదు. సకాలంలో సొమ్ములు ఇవ్వక మిగతా పనులు చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
చెరువుల పనులు చేయలేమంటున్న గుత్తేదారులు
14 వేల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ ఒట్టిమాటే
ఈనాడు అనకాపల్లి, పాడేరు
ఎస్.రాయవరం మండలం వేమగిరిలో పూడికతో నిండిన చెరువు
‘సాగునీటి చెరువుల పునరుద్ధరణకు సంబంధించి టెండరులో పేర్కొన్నట్లు మేం కొంతమేర పనులు చేశాం. వాటిలో కొన్ని పనులకు బిల్లులు ఇప్పటికీ అందలేదు. సకాలంలో సొమ్ములు ఇవ్వక మిగతా పనులు చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా కాలంగా బిల్లుల కోసం ఎదురుచూసి ఆఖరికి ఓ నిర్ణయానికి వచ్చాం. ఇక మీరు సొమ్ములిచ్చినా, ఇవ్వకున్నా పనులైతే చేయడానికి ఆసక్తిగా లేం.. మా టెండరు ఒప్పందాన్ని మధ్యలోనే ముగించేయండి (ప్రి క్లోజర్)’ అంటూ పలువురు గుత్తేదారులు జలవనరుల శాఖ అధికారులను అభ్యర్థిస్తున్నారు.
ప్రపంచ బ్యాంకు నిధులతో నాలుగేళ్ల క్రితమే ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సమీకృత సేద్య, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్టు (ఏపీఐఐఏటీపీ) ద్వారా 64 గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేయడానికి సంకల్పించారు. దీనివల్ల 14,123 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని అంచనా వేశారు. రూ.28.99 కోట్లతో 37 పనులకు మూడేళ్ల క్రితమే టెండర్లు పిలిచి 21 పనులను గుత్తేదారు సంస్థలకు అప్పగించారు. వారు కొంత మేర పనులు చేసినా బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చూసి వెనకడుగు వేస్తున్నారు. పునరుద్ధరణ పనులను మధ్యలోనే వదిలేసి మా సంగతి తేల్చేయండి వెళ్లిపోతామంటూ సంబంధిత అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. దీంతో రూ.కోట్ల పనులు మంజూరు దశ నుంచి ముందడుగు వేయలేకపోతున్నాయి.
చేతులెత్తేసిన గుత్తేదారులు.. ఉమ్మడి జిల్లాలో 37 ప్యాకేజీల్లో 64 చెరువులను పునరుద్ధరించాలనుకున్నారు. అందులో 10 ప్యాకేజీలకు టెండర్లు ఎవరూ వేయలేదు. మరో ఆరు పనులు ఇంకా టెండరు ఒప్పంద దశలోనే మగ్గుతున్నాయి. 21 పనులు మొదలుపెట్టి మూడున్నరేళ్లు దాటుతున్నాయి. ఒక్క పనీ పూర్తిచేయకుండానే చేతులెత్తేస్తున్నారు. తమ టెండర్లు ముగించి సెటిల్ చేయాలని కోరడంతో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆయా పనులు వివరాలు, గుత్తేదారులు ఎంత మేర చేశారు..? వారికి ఎప్పుడెప్పుడు ఎంతమేర బిల్లులిచ్చారో తెలపాలంటూ జిల్లా అధికారులను ఆదేశించారు.
లుబ్బర్తి జలాశయం వద్ద ఇలా..
ఇదీ పనుల తీరు..
- రాంబిల్లి మండలం దిమిలి వద్దనున్న తామరచర్ల కాలువ ద్వారా 1045 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందాలి. దీని అభివృద్ధికి రూ.97.37 లక్షల అంచనా విలువతో 2019లోనే గుత్తేదారుకు అప్పగించారు. చేయాల్సిన కాలపరిమితిని రెండుసార్లు పొడిగించినా ఈ పని ఇంకా మొదలుకాలేదు. కాంట్రాక్టర్ తన టెండరు ఒప్పందాన్ని రద్దు చేయాలని అధికారులను కోరుతున్నారు.
- ఎస్.రాయవరం మండలం వేమగిరిలో ఉమ్మడి చెరువుతో పాటు 12 అనుసంధాన చెరువులు, కాలువలను బాగుచేయడానికి రూ.7.47 కోట్లతో పనులు గుత్తేదారుకు 2020లో అప్పగించారు. 2022 నవంబర్ నాటికే పనులు పూర్తిచేయాలి. కేవలం 15 శాతం మాత్రమే చేసి వదిలేశారు.
- అనకాపల్లి మండలంలో ఎరకన్నదొర చెరువును రూ.1.87 కోట్లతో అభివృద్ధి చేయడానికి కాంట్రాక్టర్కు పని అప్పగించారు. కేవలం అయిదు శాతం పనులే చేసి నిలిపేశారు. దీంతో ఆయకట్టుదారులకు సాగునీటి సమస్య తీరకుండా పోయింది.
- చింతపల్లి మండలం తాజంగి జలాశాయం అభివృద్ధికి రూ.92.21 లక్షలు కేటాయించారు. బిల్లుల చెల్లింపులపై అనుమానంతో గుత్తేదారు ఆరుశాతం పనులే చేసి నిలిపేశారు.
- కొయ్యూరు మండలంలో లుబ్బర్తి జలాశయం అభివృద్ధికి రూ.44.19 లక్షలు మంజూరు చేశారు. గుత్తేదారు 75 శాతం పనులు చేశారు. వాటికి సకాలంలో బిల్లులు అందకపోవడంతో మిగతా పనులు నిలిపేశారు. ఈ పనుల నుంచి గుత్తేదారులు తప్పుకోవడానికి సిద్ధమంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల