గురువులకే బురిడీ.. వైకాపా నేత కుమారుడి హల్చల్
ఇప్పటికే విద్యాశాఖలో ఉన్నతాధికారుల తనిఖీలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. వారికి తోడు ఇప్పుడు నకిలీ విద్యాశాఖ అధికారులు తెరపైకి వచ్చి తనిఖీలు చేస్తుండడంతో టీచర్లు మరింత ఆందోళన చెందుతున్నారు.
ఇంటర్ విద్యార్థిని మందలించి వదిలేసిన పోలీసులు
జిల్లా విద్యాశాఖలో పర్యవేక్షణా లోపం
ఓ పాఠశాలలో విద్యార్థి పుస్తకాలను తనిఖీ చేస్తున్న నకిలీ వాలంటీరు
ఈనాడు, విశాఖపట్నం, ఆనందపురం, న్యూస్టుడే: ఇప్పటికే విద్యాశాఖలో ఉన్నతాధికారుల తనిఖీలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తిపోతున్నారు. వారికి తోడు ఇప్పుడు నకిలీ విద్యాశాఖ అధికారులు తెరపైకి వచ్చి తనిఖీలు చేస్తుండడంతో టీచర్లు మరింత ఆందోళన చెందుతున్నారు. ఆనందపురం మండలంలో జిల్లా విద్యాశాఖ వాలంటీరుగా అవతారం ఎత్తి గురువులను బురిడీ కొట్టించిన యువకుడు అధికార పార్టీకి చెందిన వార్డు సభ్యుని పుత్రరత్నమే. దిబ్బడపాలేనికి చెందిన యువకుడు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈయన తండ్రి పంచాయతీలో వార్డు సభ్యుడు. వైకాపా సానుభూతిపరుడు. అధికార పార్టీ నేతల దందాలు, అధికారులపై చెలాయిస్తున్న పెత్తనాలు చూసి తానెందుకు చేయకూడదనుకున్నాడేమో. గతేడాదే గిడిజాల ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసిన ఈ విద్యార్థి తనకు తానే జిల్లా విద్యాశాఖ వాలంటీరుగా ప్రకటించుకున్నాడు. తన ఫోన్ నెంబర్ ట్రూకాలర్లో కూడా అదే విధంగా మార్చుకున్నాడు. ఎంఈవో కార్యాలయానికి వెళ్లి పరిచయం చేసుకోగానే అక్కడి అధికారి గుడ్డిగా ఆ కుర్రాడి ఫోన్ నెంబర్ని ఉపాధ్యాయుల వాట్సప్ గ్రూప్లో చేర్చేశారు.
ఉపాధ్యాయులతో ఏకంగా టెలీ కాన్ఫెరెన్స్, గూగుల్మీట్ సమావేశాలు నిర్వహించేశాడు. అక్కడితో ఆగకుండా నేరుగా పాఠశాలలకు వెళ్లి తనిఖీలు చేయడం.. పిల్లల పుస్తకాలను పరిశీలించడం మొదలుపెట్టాడు. ఇతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన కొంతమంది ఉపాధ్యాయులు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గురువారం ఆ విద్యార్థిని పోలీసులు స్టేషన్కు పిలిపించి ఎందుకిలా చేశావ్ అంటే... ఎంఈవో చేయమన్నారు.. అందుకే చేశానని చెప్పుకొచ్చినట్లు తెలిసింది. శుక్రవారం నుంచి ఇంటర్ పరీక్షలున్నాయి విడిచిపెట్టేయండని కోరడంతో మందలించి వదిలేశారు. డీఈవో చంద్రకళ వద్ద నకిలీ వాలంటీరు గురించి ప్రస్తావించగా ‘ఆ యువకుడు ఉపాధ్యాయుల గ్రూపులోకి ఎలా వచ్చాడో తెలియదు. గుర్తించిన వెంటనే తొలగించారు. జిల్లా విద్యాశాఖ వాలంటీరు అనే పోస్టే లేదు. అయినా అతడిని వాలంటీరు అంటే ఎలా నమ్మేశారో అర్థం కావడం లేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అన్నారు. అసలు ఓ యువకుడు గూగుల్మీట్ నిర్వహించాలంటే దానికి సంబంధించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ లేకుండా సాధ్యమవదు. అవి ఎవరిచ్చారు.. ఏమి ఆశించి పిల్లాడితో పాఠశాలలను తనిఖీలు చేయించారో పూర్తిస్థాయిలో విచారణ చేస్తేనే తేలుతుందని ఉపాధ్యాయులంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్