సమస్యలు చెబుదామని వస్తే... భయపెట్టి పంపించారు
తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన విద్యార్థినులను భయపెట్టి పంపించిన సంఘటన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వసతిగృహ విద్యార్థినుల ఆవేదన
కార్యాలయం ఎదుట బైఠాయించి విద్యార్థినుల నిరసన
విశాఖపట్నం (ఏయూ ప్రాంగణం), న్యూస్టుడే: తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన విద్యార్థినులను భయపెట్టి పంపించిన సంఘటన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినులు తాము ఉంటున్న వసతి గృహంలో అనధికారిక వసూళ్లకు పాల్పడుతున్నారని.. లేని సౌర విద్యుత్తుకు డబ్బులు వసూలు చేస్తున్నారని.. భోజనంలో పురుగులు వస్తున్నా పట్టించుకోవడం లేదని.. ఇలా తాము పడుతున్న ఇబ్బందులు పరిష్కరించాలంటూ మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో సుమారు వంద మంది ఏయూ చీఫ్ సెక్యూరిటీ కార్యాలయం సమీపంలో బైఠాయించి నిరసన తెలియజేశారు. వీసీ వస్తే ఆయనతోనే తమ సమస్యలు చెప్పి పరిష్కారం కోరతామని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి.శశిభూషణరావు, ఓఎస్డీ ఆచార్య వి.కృష్ణమోహన్, ఆచార్య పాల్ డగ్లస్ వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. సమస్యలు తెలిపేందుకు గదిలోకి నలుగురు విద్యార్థినులు రావాలని సూచించారు. అందుకు విద్యార్థినులు ససేమిరా అనడంతో పదిమందిని అనుమతించారు.
విద్యార్థినులు చీఫ్ సెక్యూరిటీ అధికారి కార్యాలయంలోకి వెళ్లగానే సెక్యూరిటీ అధికారులు తలుపులు మూసివేశారని.. ఫోన్ నెంబర్లు, విభాగం అడిగి తీసుకున్నారని.. చరవాణీలో వీడియో తీశారని.. తాము ఏ సమస్య చెప్పినా ఇది ‘సిల్లీ పాయింట్’ అంటూ తేలిక చేసి మాట్లాడారని విద్యార్థినులు వాపోయారు. విద్యార్థులు మాట్లాడేందుకు వెళ్లిన గది బయట ఎవరూ రాకుండా భద్రత సిబ్బందిని ఉంచటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్