logo

జనసేనానిపై వడ్డాది యువకుడి పాట

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన తాజాగా విడుదల చేసిన పాటను వడ్డాదికి చెందిన మాకాల రవి రాశారు. ‘ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న’ అంటూ సాగే ఈ పాటను రవి రచించగా.. జానకీరావు పాడారు.

Updated : 03 Apr 2024 03:49 IST

అభినందించిన పవన్‌కల్యాణ్‌

పవన్‌కల్యాణ్‌తో రవి

బుచ్చెయ్యపేట, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జనసేన తాజాగా విడుదల చేసిన పాటను వడ్డాదికి చెందిన మాకాల రవి రాశారు. ‘ప్రశ్నించాలని పంతం పట్టెను పవనన్న’ అంటూ సాగే ఈ పాటను రవి రచించగా.. జానకీరావు పాడారు. దీన్ని జనసైనికులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్నారు. ఎన్నారై జనసైనికుల సహకారంతో మరో నాలుగు పాటలు రాశానని, వాటిని త్వరలో విడుదల చేయనున్నట్లు రవి చెప్పారు. ఇంతకుముందు పవన్‌పై దండకం రాయగా.. ఆయన రవిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని