ఇవేనా ఊళ్లు.. నమ్మేనా జనం కళ్లు!
జగనన్న కాలనీల పేరుతో వైకాపా ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎంతో మేలు చేస్తున్నాం అన్నట్లు లబ్ధిదారులను ఎంపిక చేసి... స్థలాలు చూపినా ప్రతి దశలో ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది.
నగరానికి దూరంగా కొండల పక్కన స్థలాలు
ఇళ్లు నిర్మించేస్తామని చెప్పి.. చేతులెత్తేసిన జగన్ ప్రభుత్వం
పునాదుల స్థాయి దాటని జగనన్న కాలనీలు
సబ్బవరం మండలం పైడివాడలో పునాదుల దశలో జగనన్న ఇళ్లు
జగనన్న కాలనీల పేరుతో వైకాపా ప్రభుత్వం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎంతో మేలు చేస్తున్నాం అన్నట్లు లబ్ధిదారులను ఎంపిక చేసి... స్థలాలు చూపినా ప్రతి దశలో ప్రభుత్వం వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. అంతా ఓట్ల ధ్యాస తప్ప... ఆ ‘ఒక సెంటు’ స్థలాల్లో గృహాల నిర్మాణం పూర్తి చేసే ఆలోచనే కనిపించలేదు. పైగా నగర శివారు ప్రాంతాల్లో ఆ స్థలాలు కేటాయించారు.
ప్రస్తుతం నిర్మాణాల తీరు పరిశీలిస్తే ఒక్క వర్షానికే కూలిపోతాయేమో అనే భయం కలుగుతోంది. కొండలపైనుంచి రాళ్లు... వరదనీరు దూసుకువచ్చే పరిస్థితులు భయపెడుతున్నాయి. పునాదులు శిథిలమైపోతున్నా ఇళ్లు(ఊళ్లు) నిర్మిస్తామని ప్రగల్భాలు పలుకుతున్న వైకాపా నేతలు...ఏళ్లుగా ఎందుకు పూర్తిచేయలేదని జనం ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారో!!
నగరంలో పేదల కోసం 72 లేఅవుట్లలో 1.25 లక్షల మందికి ఇళ్లను కేటాయించారు. ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం, అనకాపల్లి, పరవాడ మండలాల్లోని శివారు గ్రామాల్లో భూములు సమీకరించి లేఅవుట్లు వేసి ఒక సెంటు ప్లాట్లను అభివృద్ధి చేశారు. వాటిలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. నగరంలోని పేదలు చాలామంది విశాఖలోనే కూలి పనులు, చిరువ్యాపారాలు చేసుకొని జీవిస్తుంటారు. స్థలాలు కేటాయించిన చోట ఇళ్లు నిర్మించినా పనుల కోసం మళ్లీ నగరానికే వారు రావాలి. నగర పరిధిలో స్థల సమస్య అధిగమించేందుకు ‘టిడ్కో’ ఇళ్ల తరహా నిర్మాణాలు ఉపయుక్తం. కేవలం వైకాపా నేతల స్వార్థ ప్రయోజనాల కోసం కొండల వద్ద నిర్మాణాలు చేపట్టి నిధులు తినేశారే తప్ప పేదలకు సరైన గూడు కల్పించలేదు. అందుకే చాలా మంది నిర్మాణాలపై ఆసక్తి చూపలేదు.
దూరం... దూరం
నగరంలోని సీతంపేట ప్రాంతంలోని వారికి ముదపాక; ఆరిలోవలో ఉంటున్న వారికి ఆనందపురం మండలంలోని గిడిజాల, తంగుడుబిల్లిలో ఇళ్లు కేటాయించారు. గాజువాకలో పేదలకు అనకాపల్లిలో; గోపాలపట్నం, శ్రీహరిపురంలోని నివాసితులకు సబ్బవరం, పరవాడ మండలాల్లో కేటాయించారు. అక్కడికి వెళ్లి వచ్చేందుకు వాహన సౌకర్యం లేకపోగా ఛార్జీలకు అదనపు భారం అవుతుంది. విశాఖ నుంచి స్థలాల వద్దకు వెళ్లాలంటే రానుపోను దాదాపు 30 నుంచి 40 కి.మీ. పైగా దూరం ఉంటుంది. నేరుగా వెళ్లేందుకు బస్సు సౌకర్యం కూడా ఉండదు. బస్సులు, ఆటోలు మారి వెళ్లాలి.
అక్రమాలెన్నో..
పేదల కోసం ఇళ్లంటున్నా...అందుకు అవసరమైన స్థలాల కొనుగోలులో ఎన్నో అక్రమాలు జరిగాయి. ప్రస్తుతం మంజూరైన ఇళ్లకు కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. ఇవే దాదాపు రూ. 10 వేల కోట్లకు పైగా ఉంటాయి. వాటి కోసమే వైకాపా కీలక నేతలు తమ అనుయాయులను గుత్తేదారులుగా దింపి పనులు చేయించినట్లు చర్చ సాగుతోంది. ఆ నిర్మాణాలు కూడా నాణ్యతగా లేవు. చాలా చోట్ల పునాదుల దశను దాటలేదు.
ఇదీ సంగతి (ఎకరాల్లో)
భూసమీకరణకు గుర్తించిన మొత్తం భూమి: 6,116
లేఅవుట్లు అభివృద్ధి చేసినది: 3,466
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
నాడు ఏకపక్షం.. నేడు ప్రజాపక్షం
[ 27-07-2024]
జిల్లాలో ప్రధాన సమస్యలను చర్చించి వాటికి పరిష్కార మార్గాలను సూచించే చక్కని వేదిక జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం. -
అయిదో రోజూ అదే అవస్థ
[ 27-07-2024]
పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న గోదావరి వరద శుక్రవారం అయిదో రోజు గ్రామాలను వీడలేదు. రహదారులు తెరుచుకోలేదు. -
ఒలింపిక్స్లో అతిథులను అలరించనున్న మన్యం పంట.. పారిస్లో అరకు కాఫీ రుచులు!
[ 27-07-2024]
మన్యం పేరు చెప్పగానే గుర్తుకొచ్చే కమ్మని అరకు కాఫీకి ఇప్పటికే అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి. ప్రేమ నగరిగా పేరొందిన పారిస్లో శుక్రవారం నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. -
శాకంబరిగా ధారాలమ్మ
[ 27-07-2024]
మన్యం ప్రజల ఇలవేల్పు ధారాలమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారిని శాకంబరిదేవిగా అలంకరించారు. కుంకుమపూజలు చేశారు. -
ముంపు బాధితులను ఆదుకోవాలి
[ 27-07-2024]
వరద ముంపునకు గురైన బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈమేరకు శుక్రవారం శాసనసభలో ఆమె మాట్లాడారు. -
పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం దిశగా అడుగులు
[ 27-07-2024]
ఏళ్ల తరబడి పరిష్కారం కాని.. విశాఖపట్నంలోని సింహాచల ఆలయ భూముల్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను కొలిక్కి తెచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. -
ముంపు గ్రామాలను వీడని వరద
[ 27-07-2024]
చింతూరు - వరరామచంద్రపురం మండలాల్లోని సోకులేరు, చీకటి వాగుల వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో ఈ రెండు మండలాల మధ్య, చింతూరు మండలంలోని సుమారు 54 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
డుడుమకు వరద ఉద్ధృతి
[ 27-07-2024]
వర్షాలకు డుడుమ జలాశయంలో నీటిమట్టాలు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి నీటిని విడుదల చేస్తున్నప్పటికీ వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం లేదు. -
కొండలపైనే బాధితులు బిక్కుబిక్కు
[ 27-07-2024]
ఇళ్లలో వరద నీరు.. గుడారాల్లో దోమల రొద.. చుట్టూరా అడవి, చీకటితో కలిసి జీవనం.. ఇదీ ముంపు ప్రాంతాల్లో వరద బాధితుల పరిస్థితి. -
పెద్దకొండ ఘాట్రోడ్డులో జారిపడిన బండరాళ్లు
[ 27-07-2024]
వర్షాలతో రంపచోడవరం మన్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని మర్రివాడ పంచాయతీ పెద్దకొండ గ్రామానికి వెళ్లే ఘాట్రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడ్డాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం