logo

వైకాపాది దుర్మార్గ పాలన

వైకాపా ఐదేళ్ల పాలనలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటాయని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కిల్లు రమేశ్‌నాయుడు అన్నారు.

Published : 13 Apr 2024 01:40 IST

చింతపల్లి గ్రామీణం, సీలేరు, న్యూస్‌టుడే: వైకాపా ఐదేళ్ల పాలనలో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటాయని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి కిల్లు రమేశ్‌నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి చింతపల్లిలో భాజపా నాయకుడు కూడా కృష్ణారావుతో కలసి ప్రచారం నిర్వహించారు. వైకాపా దుర్మార్గ పాలన ఏ విధంగా సాగిందో వివరించారు. నూడిల్స్‌ షాపు నిర్వాహకురాలితో మాట్లాడి సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సరదాగా నూడిల్స్‌ తయారు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు రామకృష్ణ, శేఖర్‌, వసుపరి శ్రీను, బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. సీలేరులో తెదేపా, జనసేన, భాజపా నాయకులతో సమావేశం నిర్వహించారు. తెదేపా బీసీ సెల్‌ అధికార ప్రతినిధి నక్కా తిరుమలరావు, జనసేన నాయకుడు సిద్దార్థ్‌ మార్క్‌, భాజపా నేతలు శేఖర్‌, చింరజీవి, స్థానిక నాయకులు వల్లిప్రసాద్‌, త్రినాథ్‌, అప్పలరాజు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని