జగన్కు సింహాసనం.. జనానికి మరణశాసనం
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే.
మద్యం నిషేధం హామీ కొండెక్కింది
ఏరులై పారుతూ ఖజానా నింపుతోంది
ఇది కదా రక్తమాంసాలతో వ్యాపారం
‘నాసిరకం’ తాగి కేజీహెచ్కు వరుస కడుతున్న బాధితులు
మద్యం ప్రధాన ఆదాయ వనరుగా ప్రభుత్వం పరిగణిస్తోంది. మద్యం మీద ఆదాయం అంటే ప్రజలరక్తమాంసాలతో వ్యాపారం చేయడమే.
మద్యపానం వల్ల నాశనమవుతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. బతుకులను బుగ్గిపాలు చేసి, మహిళ కంట నీరు పెట్టించే ఆదాయం వల్ల ఎవ్వరికీ మేలు జరగదు సరికదా సమాజాన్ని నష్టపరుస్తుంది. ప్రజలు ఎన్నో రెట్లు నష్టపోతారు
మద్య నిషేధం ఎంతో అవసరం అంటూ పాదయాత్రలో జగన్ ఊదరగొట్టిన ఉపన్యాసం
అధికారంలోకి రాగానే దశల వారీగా మద్యపాన నిషేధం అన్న మాటను జగన్ పక్కన పెట్టేశారు. ప్రభుత్వమే మద్యం విక్రయించేలా అడుగులు వేశారు. విశాఖ జిల్లాలో రెండు డిపోల పరిధిలో మద్యం ఏరులై పారుతోంది. బార్లు ఉదయం ఆరు గంటలకు అనధికారికంగా ప్రారంభించేస్తున్నారు. భీమిలి, పద్మనాభం, ఆనందపురం, పెందుర్తి, విశాఖ నగరం, గాజువాక వంటి చోట్ల గొలుసు దుకాణాలు పుట్టగొడుగుల్లా ఉన్నాయి. కొన్ని మద్యం దుకాణాల నుంచే వీటికి అనధికారికంగా సరకు వెళుతోంది. ముఖ్యంగా రకరకాల బ్రాండ్ల పేరుతో కల్తీ మద్యం రాజ్యమేలుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మద్యం బారిన పడి కార్మికులు, మత్స్యకారులు మృతి చెందుతున్నారని ఆందోళనలూ కొనసాగాయి.
ఇంటికెళ్లి...మళ్లీ ఆసుపత్రికి
ఆసుపత్రికి వస్తున్న బాధితులు కల్తీ మద్యం తాగడం వల్లే ఈ స్థితికి వచ్చారని వైద్యులు చెప్పడానికి వెనకాడుతున్నారు. కొవిడ్ సమయంలో మాస్క్ల్లేవని ప్రశ్నించిన వైద్యుడు సుధాకర్ పరిస్థితే తమకూ ఎదురవుతుందని భయపడుతున్నట్లు చర్చ సాగుతోంది. కేజీహెచ్కు ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు, ఉభయగోదావరి, ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి రోగులు వస్తున్నారు. ఇక్కడ ఇన్పేషెంట్లకు ఉన్న 52 పడకల విభాగం నిత్యం రోగులతో కిక్కిరిసి పోతోంది. చికిత్స పొంది ఇళ్లకు వెళుతున్న రోగులు తిరిగి రోజులు వ్యవధిలోనే మళ్లీ ఆసుపత్రి గడపతొక్కుతున్నారు. ఆల్కహాల్ ప్రభావంతోనే రోగాల బారిన పడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరిస్తున్నారు. అయితే ఎలాంటి మద్యం తాగడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందో చెప్పలేమంటున్నారు.
మరణ మృదంగం
మద్యం బారిన పడి అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల గడపతొక్కే రోగుల సంఖ్య భారీగా పెరిగి పోయింది. కొన్ని నెలలుగా మద్యం ప్రభావం వల్ల కాలేయం, ప్రాంక్రియాస్ దెబ్బతిని కేజీహెచ్కు ఎంతో మంది వస్తున్నారు. ఈ విభాగంలో సోమ, బుధ, శనివారం... ఈ మూడు రోజుల్లో ఓపీ చూస్తుండగా, సుమారు 600 మంది రోగులు వస్తున్నారు. ఆల్కహాల్ సంబంధిత సమస్యలతో నెలకు 150-200 మంది ఇన్పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరుతున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది 20-40 ఏళ్ల వయసు వాళ్లున్నారు. కాలేయం, ప్రాంక్రియాస్ సమస్యలతో చనిపోతున్నవారు వారానికి ఇద్దరు-ముగ్గురు ఉంటున్నారని స్టాఫ్ చెబుతుండగా, వైద్యులు మాత్రం నెలకు 5-6 మరణాలుంటాయని అంటున్నారు. చికిత్స పొంది ఇళ్లకు వెళ్లిన రోజుల వ్యవధిలోనే మృత్యువాతపడుతున్న కేసులూ ఉన్నాయి. ఆల్కహాల్ ప్రభావంతో కాలేయ సమస్యలతోపాటు, నరాలు(న్యూరో), కిడ్నీలు, గుండె, కంటి చూపు మందగించడం వంటి సమస్యల బారినపడి ఆయా విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులు సైతం ఉన్నారు.
దాస్తే దాగుతాయా?
మద్యం బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులను కొన్ని నెలల క్రితం భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కేజీహెచ్లో పరామర్శించారు. ఆ సమయంలో రాజు అనే రోగి గతేడాది నాలుగు సార్లు ఆసుపత్రిలో చేరినట్లు వివరించారు. కల్తీమద్యం మరణాలపై వైద్యులు సైతం గోప్యతపాటిస్తున్నారు. ఎప్పటిలాగే కేజీహెచ్కు 20 శాతం మద్యం ప్రభావ కేసులు వస్తున్నాయంటూ మాటదాటేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు లేని సంక్షేమం అభివృద్ధి నిలయంగా మన్యం
[ 06-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
కూటమి విజయభేరి నేడే
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. -
ఓటుతో వైకాపాకు బుద్ధి చెప్పండి: ఈశ్వరి
[ 06-05-2024]
మీకు ఏ కష్టమొచ్చినా అండగా నేనుంటా.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటుతోనే వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
జనం ఆస్తులకు జగనే గండం
[ 06-05-2024]
ఇలా పదులు, వందలు కాదు వేల ఎకరాల భూములు వైకాపా నేతల చెరలో చిక్కాయి. వాటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఉపశమనం పొందారు. -
సెల్ఫోన్ పేలి చిరు వ్యాపారికి గాయాలు
[ 06-05-2024]
సెల్ఫోన్ పేలి వ్యక్తికి గాయాలు పాలైన ఘటన పెదబయలు మండలం బొంగరం పంచాయతీ పరమలమ్మలో చోటు చేసుకుంది. -
చంద్రబాబుతోనే పోలవరం పూర్తి
[ 06-05-2024]
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం
[ 06-05-2024]
కూటమి గెలుపుతోనే గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
ఆసుపత్రిలో ఆకలి కేకలు
[ 06-05-2024]
నక్కపల్లి ఆసుపత్రిలో నిత్యం సగటున 25 మంది రోగులు ఉండేవారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొవిడ్ పేరుతో దాదాపు మూడేళ్లపాటు నిలిపేసింది. -
ప్రత్యర్థులు అసూయ పడేలా అభివృద్ధి చేస్తా: సీఎం రమేశ్
[ 06-05-2024]
కూటమి అభ్యర్థులను గెలిపించి ఇటు కేంద్రం, అటు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
మోదీ సభకు సర్వం సిద్ధం
[ 06-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ విజయభేరి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాళ్లపాలెం సమీపంలోని సభాస్థలి ఏర్పాట్లను కూటమి నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. -
యువత భవిత పట్టని పాలకులు: వడ్డే
[ 06-05-2024]
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, ముఖ్యంగా మనం ఎన్నుకున్న నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ‘భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక’ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
[ 06-05-2024]
పార్లమెంట్ అభ్యర్థి సి.ఎం.రమేశ్పై వైకాపా నాయకుల దాడిని నిరసిస్తూ పేటలో ఆదివారం కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. -
నీటి విడుదల నిలిపేసి గాలింపు
[ 06-05-2024]
మాచ్ఖండ్ జలవిద్యుత్కేంద్రానికి చెందిన జోలాపుట్ జలాశయం నుంచి ఆదివారం కొన్ని గంటలపాటు నీటి విడుదల నిలిపివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
లేని సీట్లను అమ్మి.. రూ.550 కోట్ల ఫైన్ కట్టి.. ఆస్ట్రేలియా ఎయిర్లైన్స్ నిర్వాకం!
-
‘వచ్చేది వైకాపా ప్రభుత్వమే... మాట వినకపోతే చంపేస్తా’
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
పెళ్లైన నాలుగు రోజులకే.. నవ వధువును ఇంటికి పంపిన వరుడు
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు