ఆసరా ఎప్పుడో?
డ్వాక్రా రుణాల మాఫీ హామీ అమల్లో భాగంగా వైకాపా ప్రభుత్వం ఆసరా పేరుతో పొదుపు మహిళలకు లబ్ధి చేకూర్చే కార్యాచరణ చేపట్టింది. 2019 ఏప్రిల్ 11 నాటికి లింకేజీ రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల్లోని సభ్యులకు దీనిని వర్తింపజేస్తున్నారు.
మూడో విడత లబ్ధికి ఆరు లక్షల మంది ఎదురు చూపులు
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే
బయోమెట్రిక్ వేస్తున్న పొదుపు సంఘాల మహిళలు (పాత చిత్రం)
డ్వాక్రా రుణాల మాఫీ హామీ అమల్లో భాగంగా వైకాపా ప్రభుత్వం ఆసరా పేరుతో పొదుపు మహిళలకు లబ్ధి చేకూర్చే కార్యాచరణ చేపట్టింది. 2019 ఏప్రిల్ 11 నాటికి లింకేజీ రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల్లోని సభ్యులకు దీనిని వర్తింపజేస్తున్నారు. నాలుగు విడతలుగా రుణమాఫీ అమలు చేయనుండగా.. ఇప్పటి వరకు రెండు విడతల మొత్తాన్ని పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేశారు. మూడో వాయిదా కింద రుణమాఫీ మొత్తాన్ని జమ చేసే ప్రక్రియ ఆరంభించారు. మూడు నెలల కిందటే ప్రతి సభ్యురాలి బయోమెట్రిక్ కూడా తీసుకున్నారు. సంక్రాంతి లోపుగానే లబ్ధిదార్ల ఖాతాల్లో ఆసరా మొత్తం పడుతుందని చెప్పినా నేటి వరకు జమ కాకపోవడం గమనార్హం.
ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో 56,869 పొదుపు సంఘాల్లోని 5,87,250 మంది సభ్యులు ఆసరా ద్వారా తొలి విడతగా లబ్ధి పొందారు. సుమారు రూ.516.71 కోట్లు వీరి ఖాతాల్లో జమయ్యాయి. ఒక్కరే రెండు, మూడు సంఘాల్లో సభ్యురాలిగా నమోదు కావడం, మరణించిన వారు ఉండటంతో వారిని ఏరివేయడంతో పాటు, సంఘ ఖాతాల్లో నగదు జమ చేస్తుంటే బ్యాంకులు రుణాల కింద జమ చేసుకోవడంతో నేరుగా సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో నగదు పడేలా, రెండో విడత ఆసరాకు ముందు బయోమెట్రిక్, బ్యాంకు ఖాతా వివరాల సేకరణ చేపట్టారు. మూడో విడతలోనూ ఇదే పద్ధతి అనుసరించారు. గతేడాది డిసెంబరులోనే వెలుగు ఏపీఎంలు, సీసీలు, వీవోఏలు గ్రామాల వారీగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు.
ఎప్పటికప్పుడు జాప్యమే..
లబ్ధిదార్లకు ఆసరా మొత్తాన్ని విడుదల చేసే విషయంలో ఏటా జాప్యం నెలకొంటోంది. మొదటి విడత మొత్తాన్ని 2020, సెప్టెంబరు 9న, రెండో విడత మొత్తాన్ని 2021, అక్టోబరు9న జమ చేశారు. మూడో విడత మొత్తాన్ని కొంచెం ఆలస్యమైనా, 2022లోనే ఇస్తారని అంతా భావించారు. ఆ తర్వాత సంక్రాంతి లోపుగానే జమ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఫిబ్రవరి రెండో వారం వచ్చినా నేటికీ ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. సీఎం బటన్ నొక్కుడు కార్యక్రమంలో భాగంగా వరుసగా రైతు భరోసా, చేదోడు, తోడు, విద్యా దీవెన పథకాలకు నిధులు విడుదల చేసిన క్రమంలో ఆసరా మూడో విడత జమ చేయడంలో జాప్యం జరిగిందని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.
త్వరలోనే జమ చేస్తాం
పీఎస్సార్ ప్రసాద్, పీడీ, డీఆర్డీఏ
ఆసరా మూడో విడత కింద స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు నగదు జమ చేసేందుకు అవసరమైన ప్రక్రియ మొత్తం పూర్తి చేశాం. లబ్ధి పొందే సంఘాలు, సభ్యుల వివరాలు ఉన్నత స్థాయికి నివేదించాం. సాంకేతిక కారణాల వలన కొంత జాప్యం జరిగింది. ఈ నెలలోనే లబ్ధిదార్ల ఖాతాల్లోకి నగదు జమయ్యే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట