కట్టబెట్టలే.. కష్టబెట్టుడే!
విజయవాడ తూర్పు పరిధిలో ఎనిమిదో వార్డువాసి నారు రామారావుకు గత ప్రభుత్వం టిడ్కో గృహం కేటాయించింది. భార్య విజయ పేరు మీద లబ్ధిదారు వాటా కింద రూ.50 వేలు కట్టారు. 2021 డిసెంబరు 30న సప్తగిరి గ్రామీణ బ్యాంకు రూ.3.65 లక్షలు రుణం ఇచ్చింది.
టిడ్కో లబ్ధిదారులకు బ్యాంకుల తాఖీదులు
ఈనాడు, అమరావతి
జక్కంపూడిలో అసంపూర్తిగానే గృహాలు
విజయవాడ తూర్పు పరిధిలో ఎనిమిదో వార్డువాసి నారు రామారావుకు గత ప్రభుత్వం టిడ్కో గృహం కేటాయించింది. భార్య విజయ పేరు మీద లబ్ధిదారు వాటా కింద రూ.50 వేలు కట్టారు. 2021 డిసెంబరు 30న సప్తగిరి గ్రామీణ బ్యాంకు రూ.3.65 లక్షలు రుణం ఇచ్చింది. నాటి నుంచి రెండేళ్లు మారటోరియం ఉంటుంది. తర్వాత నుంచి వాయిదాలు చెల్లించాలి. ఆ ప్రకారం 2023 డిసెంబరు 29తో రెండేళ్ల గడువు ముగిసినా ఇల్లు ఇవ్వనేలేదు. కానీ బ్యాంకు మాత్రం నెలవారీ వాయిదాలు వడ్డీ కలిపి రూ.39 వేలు చెల్లించాలని.. నోటీసులు ఇచ్చింది. అధికారులు మాత్రం మౌనంగా ఉన్నారు.
ఇదీ విజయవాడ లబ్ధిదారుల బాధే కాదు.. ఉమ్మడి జిల్లాలో అన్ని పట్టణాల్లో టిడ్కో గృహాల లబ్ధిదారుల ఆవేదన. ఇళ్లే ఇవ్వలేదు... రుణాలు చెల్లించాలని తాఖీదులు అందుతున్నాయి. మరికొందరికి రుణాలూ ఇవ్వలేదు కానీ.. వాయిదాలు చెల్లించాలట. ఒక్క గుడివాడలో మినహా ఎక్కడా లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించలేదు. విజయవాడ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు నీలిరంగులు వేశారే తప్ప.. పూర్తయిన ఇళ్లకు వసతులు కల్పించి లబ్ధిదారులకు కేటాయించాలనే స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు. విజయవాడ నగర పేదలకు 40 వేల టిడ్కో గృహాలను కట్టాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. వాటిని వైకాపా ప్రభుత్వం 6,576కు కుదించింది. పునాదులు నిర్మించిన వాటిని పక్కన పెట్టేశారు. నాలుగేళ్లలో వీఎంసీ పరిధిలో 3,800 మందికి డాక్యుమెంటేషన్ పూర్తి చేసి బ్యాంకులు, యూఎల్బీలు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. కేవలం రూ.85 కోట్లు రుణం అందించాయి. వీరికి రెండేళ్ల గడువు ముగియగా వారికి వాయిదాలు చెల్లించాలని నోటీసులు అందుతున్నాయి.
నిధులు లేక ఆగిన నిర్మాణం...
జిల్లాలో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్లు నిర్మిస్తున్నారు. మొదటి రకానికి లబ్ధిదారు వాటా రూ.1. కేంద్రం, రాష్ట్రం రూ.3 లక్షల సబ్సిడీ ఇస్తోంది. రెండోది రూ.25 వేలు, మూడోది రూ.50 వేలు లబ్ధిదారు వాటాగా నిర్ణయించారు. బ్యాంకు రుణం రూ.3.15 లక్షలు, రూ.3.65 లక్షలు ఇస్తారు. కేంద్రం నుంచి రూ.1.50 లక్షలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అందుతుంది. రాష్ట్రం నుంచీ అంతే మొత్తం ఇవ్వాలి. జిల్లాలో బ్యాంకులు రూ.679.70 కోట్లు రుణం ఇస్తేనే బ్లాకులు పూర్తవుతాయి. ఇప్పటికి రూ.370 కోట్లు మంజూరు చేయగా ఇవి టిడ్కోకు నేరుగా అందుతున్నాయి. వీటి నుంచి గుత్తసంస్థలకు బిల్లులు చెల్లిస్తున్నారు. లబ్ధిదారులతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటే రుణం మంజూరు చేసినట్లే. నాటి నుంచి రెండేళ్లు వాయిదాలు చెల్లించాల్సిన పని లేదు. కానీ ఆ గడువు కొన్నింటికి పూర్తవడంతో నోటీసులు వస్తున్నాయి. ఒకటి రెండు వాయిదాలు చెల్లించకపోతే.. డిఫాల్టరుగా మారతారని హెచ్చరిస్తున్నారు.
బిల్లులు రానిదే కట్టమంతే..
- ఎన్టీఆర్ జిల్లాకు రూ.262 కోట్లకు గాను.. రూ.95 కోట్లే విడుదల చేశాయి. ఇంకా రూ.165.50 కోట్లు అందాలి.
- బిల్లులు రానిదే నిర్మాణాలు ప్రారంభించబోమని మిగిలిన పట్టణాల్లో గుత్తసంస్థలు స్పష్టం చేస్తున్నాయి.
- జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు, ఉయ్యూరు పట్టణాలకు మంజూరైన టిడ్కో గృహాలు తెదేపా ప్రభుత్వం మారాక ఒక్క ఇటుక వేయలేదు.
- విజయవాడలో మొత్తం ఇళ్లలో 2490 ఇళ్లను 90శాతం పూర్తి చేశారు. బీ తిరువూరులో 384 గృహాలే ఉన్నా.. నెల వాయిదా కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు.
ప్రభుత్వమే చెల్లించాలి.. లబ్ధిదారులకు నోటీసులు అందడంపై టిడ్కో ఈఈ చిన్నోడును ‘ఈనాడు’ వివరణ కోరగా బ్యాంకులు రుణం మంజూరు చేసిన నాటి నుంచి రెండేళ్ల వరకు మారిటోరియం ఉంటుందని, తర్వాత ఇంటి నిర్మాణం పూర్తి కాని పక్షంలో సంబంధిత మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని సొమ్ములు చెల్లించాలన్నారు. ప్రభుత్వమే ఈ బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్