దండుకోవడానికే ఓటీఎస్.. ప్రయోజనం లేని గృహ హక్కు పత్రాలు
ఏకకాల పరిష్కారం(ఓటీఎస్) సొమ్ము చెల్లించి లబ్ధిదారులు పొందిన ‘గృహహక్కు’ ధ్రుపపత్రాలు(పట్టాలు) ఎందుకూ పనికి రావని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సొమ్ము చెల్లించినా 30 శాతం మందికే జారీ
కంకిపాడు, న్యూస్టుడే
ఏకకాల పరిష్కారం(ఓటీఎస్) సొమ్ము చెల్లించి లబ్ధిదారులు పొందిన ‘గృహహక్కు’ ధ్రుపపత్రాలు(పట్టాలు) ఎందుకూ పనికి రావని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. 2021 డిసెంబరు నుంచి రెండు నెలలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు క్షేత్రస్థాయి సిబ్బందికి రోజువారీ లక్ష్యాలు పెట్టి మరీ సొమ్ము వసూలు చేయడం విదితమే. 52 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతూ దాదాపు రూ.10 వేల కోట్ల రుణమాపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రచారం చేసింది. దీనికి ‘జగనన్న సంపూర్ణ గృహహక్కు’ పథకంగా పేరు పెట్టంది. 2011లోపు వివిధ పథకాల ద్వారా గృహ నిర్మాణాలు చేపట్టిన లబ్ధిదారులను ‘రుణ విముక్తి’ చేయడమే లక్ష్యంగా పేర్కొంది. 15 ఏళ్ల కిందట ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికీ తాఖీదులు అందాయి. గ్రామాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్ పరిధిలో రూ.20 వేల చొప్పున ఒక్కో లబ్ధిదారు నుంచి వసూలు చేశారు.
చెప్పింది ఇదీ!
- లబ్ధిదారుకు ఇంటిపై సర్వహక్కులూ కల్పిస్తారు.
- స్థలానికి గృహాన్ని తాకట్టు పెట్టుకోవచ్చు..అమ్ముకోవచ్చు..బహుమతిగా ఇవ్వవచ్చు.
- ప్రధానంగా బ్యాంకుల్లో తనఖాపెట్టి రుణాన్ని పొందవచ్చు.
- ఎటువంటి సేవా రుసుములు లేకుండా సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.
జరిగింది ఇదీ..
- ఓటీఎస్ కింద సొమ్ము చెల్లించిన 30 శాతం మందికే ‘పట్టాలు’ ఇచ్చారు
- గృహ నిర్మాణానికి రుణాన్ని పొందిన వ్యక్తి మరణించిన సందర్భాలు, అప్పటికే సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాలు, వారసులు ఒక్కరి కంటే అధికంగా ఉండడం, అప్పటికే ఆరేడు చేతులు మారడం తదితర సమస్యలు ఎదురయ్యాయి. కొన్ని రోజులు అవగాహన కల్పించి కొందరికి ‘పట్టాలు’ ఇచ్చి ‘మమ’ అనిపించారు
- గతంలో మహిళల పేరుతోనే గృహ రుణాలు మంజూరు చేశారు. 90శాతం పురుషుల పేరుతోనే స్థలాలు ఉన్నాయి. నిబంధనల మేరకు లబ్ధిదారు పేరుతోనే రుణ విముక్తి ధ్రువపత్రాలు ఇచ్చారు. స్థలం కుటుంబ సభ్యులో మరొకరి పేరుతో ఉండడంతో ‘పట్టాలు’ జారీ చేయలేదు. దీనిపై తరచూ మార్గదర్శకాలను మార్చడంతో పట్టాల మంజూరు గందరగోళంగా మారింది.
కొండెక్కిన పట్టాలు
నిర్ధరించిన సొమ్ము వసూళ్లు పూర్తి కాగానే, పథకం అమలును అనధికారికంగా ఆపేశారు. సర్వర్లు పనిచేయలేదని, ‘యాప్’ మూసేశారని, అప్పటికే సమయం మించిపోయిందనే సాకులతో స్వస్తి చెప్పారు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఇంతవరకు అందని ఓటీ¨ఎస్ చెల్లింపుదార్లు 70 శాతం ఉండడానికి ఇవే కారణం.
కంకిపాడు మండలం గొడవర్రు వంతన సమీపంలో నివసించే ఎనిమిది మంది ఓటీఎస్ సొమ్ము చెల్లించి పొందిన పట్టాలను కంకిపాడులోని ఆరు ప్రభుత్వ, ప్రైవేటు సహకార బ్యాంకులకు తీసుకువెళ్లి రుణాన్ని అడిగారు. తనఖా పెట్టుకోడానికి ఇవి పనికిరావని తేల్చి చెప్పారు. ఒక ప్రభుత్వరంగ బ్యాంకు మేనేజర్ ‘ఇవి నాలుక గీసుకోవడానికీ పనికిరావన్నారు’. ఇదే విషయాన్ని గడప గడపకూ మన ప్రభుత్వంతో మహిళలు ప్రస్తావించారు. బ్యాంకర్లతో మాట్లాడతామని దాట వేశారు. ఇంతవరకు వారికి రుణం మంజూరు కాలేదు. ఇవి తనఖా పెట్టి రుణాన్ని పొందిన దాఖలాలులేవు. దీంతో వారు అంతా మోసం అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఒకే స్థలానికి మూడు రిజిస్ట్రేషన్లు?
సబ్రిజిస్ట్రార్ కార్యాలయం, ఓటీఎస్, ప్రస్తుత భూసంరక్షణ పథకం..ఇలా ఒకే స్థలానికి మూడు రిజిస్ట్రేషన్లు..అవీనీ వివిధ పేర్లతో జారీ అయ్యాయి. ఏది ప్రామాణికమో చెప్పలేని దయనీయ స్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ ధర్నాతో అభాసు పాలైన జగన్ : దేవినేని ఉమా
[ 26-07-2024]
ఏపీ శాసనసభ సమావేశాలు జరుగుతుంటే పాల్గొనకుండా జగన్ దిల్లీ పారిపోయి అక్కడ ధర్నా చేసి అబాసు పాలయ్యారని మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్కొన్నారు. -
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
[ 26-07-2024]
గత నెలన్నరగా ఎన్టీఆర్ కమిషనరేట్లో నమోదైన సైబర్ మోసాల్లో ఇవి కొన్ని మాత్రమే. పదుల సంఖ్యలో ఈ తరహా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. -
‘నా’దంటూ.. గుంజడమే ప‘ని’..!
[ 26-07-2024]
గుడివాడలో దశాబ్దాలుగా కళలకు వెలుగులద్దుతూ.. కళాకారులు, రచయితలు, కవులకు కేంద్రంగా ఉన్న ‘బారిష్టరు శతావధాని కవిరాజు శ్రీ త్రిపురనేని రామస్వామిచౌదరి స్మారక కళాభవనం’ కబ్జా కోరల్లో చిక్కుకుంది. -
వైకాపా పా‘పాలు’.. వెంటాడే శాపాలు
[ 26-07-2024]
గతంలో జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన పాల వెల్లువ కార్యక్రమంపై గ్రామాల్లో తిరుగుబాటు మొదలైంది. -
ముంచాలనుకున్నారు.. మునిగిపోయారు..!
[ 26-07-2024]
అద్భుతాలు సృష్టించాలంటే... ఆలోచన ఉండాలి.. వివేకం చూపాలి... అంతం చేయాలనుకుంటే కళ్లు మూసుకుని, మెదడు పనిచేయకుండా ఉంటే చాలు... నాటి జగన్ సర్కారు చేసిందిదే... -
పైవంతెన ప్రాజెక్టు డీపీఆర్కు వినతి
[ 26-07-2024]
జాతీయ రహదారి 16పై మహానాడు జంక్షన్ నుంచి నిడమానూరు రైల్వే బ్రిడ్జి వరకు నిర్మించే నాలుగు లైన్ల పైవంతెనకు సంబంధించి కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని గురువారం విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కలిసి వినతిపత్రం అందజేశారు. -
నాణ్యత కల్ల.. దారులు గుల్ల
[ 26-07-2024]
నిత్యం ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, వేలాది వాహనాలు రాకపోకలు సాగించే చెన్నై-కోల్కతా జాతీయ రహదారి పరిస్థితి ఎప్పటికప్పుడు దారుణంగా మారింది. -
వైకాపా హయాంలో దళితుల అణచివేత
[ 26-07-2024]
‘జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు, హత్యలు జరిగాయి. మాదిగ జాతి ఉనికిని కాపాడుకోవడం కష్టమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దళితులంతా ఏకం కావాలి. చైతన్యవంతం కావాలి. -
మచిలీపట్నం-నర్సాపూర్ మధ్య కొత్త రైల్వేలైన్
[ 26-07-2024]
మచిలీపట్నం నుంచి నర్సాపూర్కు కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. -
వైద్య ఖర్చులు వడ్డీతో చెల్లించాలని తీర్పు
[ 26-07-2024]
వైద్య ఖర్చులు వడ్డీతో చెల్లించాలని వినియోగదారుల కమిషన్ తీర్పు చెప్పింది. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్వో దుర్మరణం
[ 26-07-2024]
కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరు వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తాడేపల్లి 12వ వార్డు సచివాలయ వీఆర్వో దుర్మరణం పాలయ్యారు. -
బోటు తిరగబడి మత్స్యకారుడి మృతి
[ 26-07-2024]
చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మచిలీపట్నం మండల పరిధిలో జరిగింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్
-
ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదు.. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటపై మణిశర్మ క్లారిటీ
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్