logo

పేర్ని కిట్టూ ప్రలోభాల ఎర.. కూపన్ల ఆధారంగా నగదు, వస్త్రాల పంపిణీ

రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఏకైక లక్ష్యంతో వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైన మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టూ శుక్రవారం పాస్టర్ల(దైవసేవకులు)తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

Updated : 13 Apr 2024 09:16 IST

కృత్తివెన్నులో ఉప్పాల రాము విలేకర్లకు పంపిణీ చేసిన దుస్తులు

మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఏకైక లక్ష్యంతో వివిధ వర్గాలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమైన మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టూ శుక్రవారం పాస్టర్ల(దైవసేవకులు)తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక జి.కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన సమావేశానికి హాజరైన ఆయన వారి ఆశీర్వచనాలు కోరారు. సమావేశ నిర్వహణ బాధ్యతలు చేపట్టిన పార్టీ నాయకులు సమావేశానికి హాజరైన వారికి కూపన్లు అందజేశారు. విందు భోజన అనంతరం కూపన్ల ఆధారంగా నూతన వస్త్రాలు, నగదు సమర్పించి ఎన్నికల్లో పేర్ని విజయానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆత్మీయ సమావేశంలో పేర్ని కిట్టూ

కృత్తివెన్నులో పాత్రికేయులకు వస్త్రాలు

కృత్తివెన్నులో పాత్రికేయుల ఆశీస్సులు కోరుతూ పెడన వైకాపా అభ్యర్థి ఉప్పాల రాము బహమతులు అందజేశారు. పట్టుచీర, ఫ్యాంట్‌, షర్ట్‌లతో పాటు గిఫ్ట్‌ అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని