వైకాపా సిద్ధం.. జనానికి నరకం
ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఆర్టీసీ అధికారుల తీరు మారడం లేదు. తమకు ప్రయాణికుల కంటే అధికార పార్టీ ఆదేశాలే శిరోధార్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
సిటీ బస్సులు గుంటూరు సభకు తరలింపు
ఈనాడు - అమరావతి, న్యూస్టుడే - విజయవాడ బస్టేషన్
బస్సులు లేక ఖాళీగా ఉన్న ప్లాట్ఫామ్లు
ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఆర్టీసీ అధికారుల తీరు మారడం లేదు. తమకు ప్రయాణికుల కంటే అధికార పార్టీ ఆదేశాలే శిరోధార్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అసలే మండే ఎండలు.. దీనికితోడు గమ్యస్థానం ఎక్కాల్సిన బస్సుల రాక కళ్లు కాయలు కాసేలా నిరీక్షించినా ఫలితం కనిపించలేదు. అధికార వైకాపా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ సభల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తగినన్ని బస్సులు లేక ఎదురుచూపులు తప్పడం లేదు. శుక్రవారం గుంటూరులో నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్ సభకు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి వంద చొప్పున మొత్తం 200 బస్సులు గుంటూరుకు వెళ్లాయి.
వెళ్లినవన్నీ సిటీ బస్సులే.. గుంటూరు సభకు ఎన్టీఆర్ జిల్లా నుంచి వెళ్లినవన్నీ సిటీ బస్సులే కావడం గమనార్హం. నగర పరిధిలోని నాలుగు డిపోల నుంచి వీటిని సర్దుబాటు చేశారు. ఇబ్రహీంపట్నం డిపో నుంచి 10, విద్యాధరపురం, గవర్నర్పేట-1, గవర్నర్పేట-2 డిపోల నుంచి 30 చొప్పున మొతం వంద వెళ్లాయి. నగరవాసులు ప్రధానంగా ప్రజారవాణా కోసం సిటీ బస్సులపైనే ఆధారపడతారు. అలాంటిది ఒకేసారి అన్ని బస్సులు పంపించడం వల్ల నరకయాతన అనుభవించారు. నగరంలో రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోనే అత్యధికంగా కళాశాలలు, ఆసుపత్రులు, వివిధ కార్యాలయాలు ఉండడంతో బస్సులకోసం గంటలకొద్దీ ఎదురుచూసినా రాకపోవడంతో కష్టాలు తప్పలేదు. సిటీ బస్ పోర్టులో ప్లాట్ఫాంలపైనే పడిగాపులు పడ్డారు.
రేపు మళ్లీ అవస్థలే..
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పర్యటనలో భాగంగా సీఎం జగన్ ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించనున్న ‘మేమంతా సిద్ధం’ సభకు హాజరుకానున్నారు. ఈ సభకు జన సమీకరణ కోసం ఆర్టీసీ 1,200 బస్సులను కేటాయించింది. ఇందు కోసం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు ఉమ్మడి గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని డిపోల నుంచి వీటిని సర్దుబాటు చేస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో బస్సులు వైకాపా సభకు పంపుతుండడంతో ఈ జిల్లాల పరిధిలో ప్రయాణికులకు అవస్థలు తప్పేలా లేవు. ఈ బస్సులు ఆదివారం ఉదయానికే వాటికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లనున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం, పెడన, పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ, తిరువూరు, ఏలూరు జిల్లా దెందులూరు ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు ఆర్టీసీ బస్సులను అధికార పార్టీ వినియోగించనుంది. ప్రయాణికుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆర్టీసీ యాజమాన్యం అధికార పార్టీకి అడిగినన్ని బస్సులు కేటాయిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..