పట్టం కడితే.. పట్టాలిస్తాం
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అధికార పార్టీ రాజకీయ లబ్ధికి వినియోగించనుంది.
తెరవెనక అధికార పార్టీ మంతనాలు
మచిలీపట్నం(కోనేరుసెంటరు), న్యూస్టుడే
కోన ప్రాంతంలో చెరువులుగా మారిన అసైన్డ్భూములు
జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను అధికార పార్టీ రాజకీయ లబ్ధికి వినియోగించనుంది. ముఖ్యమంత్రి జగన్ హామీ మాటున స్థానిక పెద్దలు తీర ప్రాంత భూములను గుప్పెట్లో పెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందే దిశగా ఆ పార్టీ నాయకులు ప్రలోభాలకు తెరతీశారు. రాబోయే ఎన్నికల్లో సహకరించే ప్రతి ఒక్కరికీ ఎన్నికల అనంతరం పట్టాలు ఇప్పిస్తామంటూ పలువురు అధికార పార్టీ నాయకులు ఓటర్లతో మంతనాలు సాగిస్తున్నారు. తటస్థంగా ఉండే వారిని పిలిపించి వారి పేర్లు నమోదు చేసుకుంటూ పట్టాలు ఇచ్చేసినంత హంగామా చేస్తున్నారు.
మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. వీటితో పాటు వందల ఎకరాల విస్తీర్ణంలో సీఆర్జడ్ పరిధిలోని భూములూ ఉన్నాయి. ఎప్పటినుంచో అప్పటి ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధుల జిల్లా పర్యటనల సందర్భంగా ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు వందల ఎకరాల ప్రభుత్వ భూములను డి.పట్టాల పేరుతో పంపిణీ చేశారు. ఆ భూముల పంపిణీ కేవలం ప్రచారానికి మాత్రమే పనికివచ్చేది. పట్టాలు పొందిన లబ్ధిదారులు సైతం తమ భూమి ఎక్కడ ఉందనే దానిపై ఆసక్తి చూపేవారు కాదు. ఆక్వా పరిశ్రమ వృద్ధి చెందుతున్న సందర్భంలో ఈ భూములపై పలువురి దృష్టి పడడంతో నిబంధనలకు విరుద్ధంగా అవి చేతులు మారిపోయాయి. ముందు చూపుతో కొందరు రాజకీయ అండతో అనుభవదారులుగా తమ పేర్లను రెవెన్యూ రికార్డుల్లోనూ చేర్పించేశారు. భీమవరానికి చెందిన కొందరు ఇక్కడి భూముల సర్వే నంబర్లతో కొన్ని బ్యాంకుల్లో అక్రమంగా కోట్లాది రూపాయల రుణం తీసుకుని ఎగ్గొట్టేయడంతో సదరు బ్యాంకులు ఈ ప్రాంత వాసులకు నోటీసులు పంపడం, వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో కేసు తీవ్రతను బట్టి సీబీఐకి అప్పగించారు. మొత్తం మీద ప్రభుత్వ పరంగా పంపిణీ చేసిన వేలాది ఎకరాల భూములు గడచిన కొన్ని సంవత్సరాలుగా అసలైన లబ్ధిదారుల చేతిలో లేకుండా పరాధీనంలోకి వెళ్లిపోయాయి. బినామీ పేర్లతో కొందరు రాజకీయ నాయకులు, బడాబాబులు వందల ఎకరాల విస్తీర్ణంలో చెరువులు తవ్వేశారు.
సీఎం హామీతో కదలిక
స్థానిక నాయకులు మచిలీపట్నంలో ఉన్న దాదాపు 12,000 ఎకరాల అసైన్డ్భూములను అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరడంతో అంగీకరించిన సీఎం తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూశాఖను ఆదేశించారు. దీంతో రెవెన్యూ సిబ్బంది ఆగమేఘాల మీద మండల పరిధిలోని గ్రామాల్లో సర్వే చేశారు. అసైన్డ్ భూములు అర్హులైన లబ్ధిదారుల చేతుల్లో ఎన్ని ఉన్నాయి. ఇతరుల చేతుల్లో ఎన్ని ఉన్నాయన్న లెక్కలు తీసి ప్రస్తుతం అనుభవదారులుగా ఉన్న వారికి తమ హక్కులకు సంబంధించిన పత్రాలు చూపించాలంటూ నోటీసులు ఇచ్చారు. దాదాపు 3,000 ఎకరాల్లో అసలైన లబ్ధిదారులు ఉన్నారని మిగిలిన 9,000 ఎకరాలు ఇతరుల ఆధీనంలో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు నివేదించారు.
విలువ పెరగడంతో పెద్దల కన్ను
ఆక్వా సాగు పెరగడంతో అసైన్డ్ భూముల విలువ అపారంగా పెరిగింది. దీంతో స్థానికంగా పట్టున్న నాయకుల కన్ను ఆ భూములపై పడింది. నిబంధనలకు విరుద్ధంగా చేతులు మారిన భూములను తమ గుప్పెట్లోకి తీసుకుని ఆర్థిక లబ్ధిపొందేదిశగా చర్యలు ప్రారంభించారు. ఏ అండా లేని వారికి అరకొరగా ముట్టచెప్పి బలవంతంగా భూములు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ భూముల ద్వారా రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందాలన్న ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. అందుకు పోర్టు పనుల ప్రారంభోత్సవం కోసం మచిలీపట్నం వచ్చిన సీఎం కార్యక్రమాన్ని వేదికగా ఎంచుకున్నారు.
పారని పాచిక
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే తమ అనుయాయులు, బినామీ దార్లకు సదరు భూములకు పట్టాలు ఇప్పించేయాలనుకున్న అధికార పార్టీ నాయకుల పాచిక పారలేదు. పాములపుట్టలా ఉన్న భూముల వ్యవహారంలో తలదూర్చి ఇబ్బందులు కొనితెచ్చుకోవాల్సి వస్తుందన్న భయంతో రెవెన్యూ సిబ్బంది తగు సహకారం అందించలేదు. ఈ లోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేయడంతో పట్టాల పంపిణీ ప్రక్రియ పక్కకు వెళ్లిపోయింది. దీంతో తాజాగా ఎన్నికల్లో తమకు సహకరించిన వారికి గెలిచిన తరువాత పట్టాలు అందజేస్తామంటూ ప్రసన్నం చేసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు