logo

ఊరేగుతున్నారని ఊచకోత

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నగరంలో పర్యటనకు వస్తున్నారని.. ఆయన వెళ్లే రోడ్ల వెంబడి ఏళ్లుగా ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికేశారు.

Published : 13 Apr 2024 04:30 IST

జగన్‌ బస్సు యాత్ర పేరిట చెట్ల నరికివేత

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నగరంలో పర్యటనకు వస్తున్నారని.. ఆయన వెళ్లే రోడ్ల వెంబడి ఏళ్లుగా ఉన్న చెట్లను యథేచ్ఛగా నరికేశారు. మధ్య, తూర్పు నియోజకవర్గ పరిధిలో జగన్‌ శనివారం (నేడు) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పశువుల ఆసుపత్రి రహదారి, మొఘల్రాజపురం, సత్యనారాయణపురం ప్రాంతాల్లో రహదారి పక్కనున్న పలు చెట్ల కొమ్మలను నగరపాలక సంస్థ సిబ్బంది నరికివేశారు. పోలీసుల రక్షణతో కొమ్మలు నరకడం విశేషం. ప్రజలకు నీడనిచ్చే చెట్లను అడ్డంగా కొట్టేయడంపై ప్రజలు మండిపడ్డారు. ఈ క్రమంలో రహదారుల వెంబడి ప్రయాణించే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. చెట్లను పూర్తిగా నరకలేదని.. అడ్డుగా ఉన్న కొమ్మలు తొలగించినట్లు పోలీసులు తెలిపారు.

సత్యనారాయణపురం, న్యూస్‌టుడే

పోలీసుల సమక్షంలో చెట్లను నరికి వేస్తున్న సిబ్బంది

రహదారి పక్కన చెట్లు నరికివేస్తుండగా.. ట్రాఫిక్‌ రద్దీతో జనం అవస్థలు

నిన్నటి దాకా నీడనిచ్చిన చెట్లు.. ప్రస్తుతం మోడుగా మారి..

రంపంతో ఊచకోత..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని