గన్న‘వరాల్లేవు’.. శాపాలే.. నియోజకవర్గం వైపు తొంగిచూడని సీఎం జగన్
సీఎం హోదాలో ఉన్న జగన్ గడచిన అయిదేళ్లుగా గన్నవరం నియోజకవర్గం నుంచి తరచూ రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. అది ప్రేమతోనో, అభివృద్ధి కోసమో కాదు..
అయిదేళ్లలో అభివృద్ధి తిరోగమనం
అయినా ఓట్లడిగేందుకు రాక
హనుమాన్జంక్షన్, గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే
సీఎం హోదాలో ఉన్న జగన్ గడచిన అయిదేళ్లుగా గన్నవరం నియోజకవర్గం నుంచి తరచూ రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. అది ప్రేమతోనో, అభివృద్ధి కోసమో కాదు.. కేవలం విమానం ఎక్కి రాష్ట్రమంతటా పర్యటించడానికి మాత్రమే వచ్చి వెళుతుంటారు. 58 నెలలు సీఎంగా ఉన్న ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా అధికారికంగా నియోజకవర్గంలో పర్యటించింది లేకపోగా.. చెప్పుకోతగ్గ రీతిలో మచ్చుకు ఒక్కటంటే ఒక్కటి కూడా అభివృద్ధి పని చేసిందే లేదు. కానీ నియోజకవర్గంలో బస్సు యాత్ర చేయడానికి వస్తున్న జగన్, ప్రజలకు ఏం చెబుతారు, ఏమని ఓటడుగుతారనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి.
గన్నవరం.. నాడు-నేడు
అసంపూర్తిగా నిలిచిన ఐటీ పార్కు రెండో టవర్
ఐటీ తిరోగమనం
2014 నుంచి 2019 మధ్య కాలంలో కేసరపల్లిలో ఉన్న ఐటీ పార్కులో దాదాపు 20కి పైగా సంస్థలు కొలువుదీరాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించాయి. కానీ 2019 నుంచి ఇప్పటి వరకు కొత్త సంస్థ ఒక్కటి రాకపోగా, ఉన్న సంస్థలన్నీ ఒక్కొక్కటిగా వెళ్లిపోయాయి. దీంతో స్థానిక యువతకు ఉద్యోగాలు, ప్రజలకు ఉపాధి అవకాశాలకు గండిపడిపోయింది. శనివారం రాత్రి జగన్ బస కూడా కేసరపల్లి ఐటీ పార్కులో ఎలాంటి పురోగతి లేక మధ్యలోనే ఆగిపోయిన రెండో టవర్ పక్కనే కావడం గమనార్హం.
రహ‘దారుణాలు’..
తెదేపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనే అత్యధికంగా రహదారులు అభివృద్ధి చేసిన ఘనత దక్కింది. 84 గ్రామ పంచాయతీలకు 70 పంచాయతీల్లో అంతర్గత రహదారులను సిమెంట్ రోడ్లుగా మార్చారు. ప్రధాన మార్గాలు, అనుసంధాన రహదారులను సైతం పునర్నిర్మించారు. కొన్ని రోడ్లను రవాణా అవసరాలకు వీలుగా విస్తరించారు కూడా. కానీ జగన్ హయాంలో సిమెంట్ రోడ్ల ఊసే లేకపోగా, ప్రధాన, అంతర్గత రహదారులకు నిధులు కేటాయించి కూడా పనులు పూర్తి చేయించలేకపోయారు.
పరిశ్రమలు డీలా
2014-19 మధ్య కాలంలో నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా ఆవిర్భవించింది. వీరపనేనిగూడెం, మల్లవల్లిలో అనేక సంస్థలు తమ యూనిట్ల స్థాపనకు ముందుకొచ్చాయి. మల్లవల్లిలో ఏకంగా 1,360 ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామికవాడకు రూపకల్పన చేశారు. అశోక్ లేల్యాండ్, పార్లే ఆగ్రో వంటి దిగ్గజ సంస్థలు యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. కానీ వైకాపా అధికారంలోకి రాగానే వీటితో సహా అనేక సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయి.
ఇళ్ల స్థలాలేవీ?
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా అర్హులైన అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నామంటూ గొప్పలు చెప్పుకున్న జగన్, నియోజకవర్గంలో దాదాపు ఇంకా 20 వేల మందికి స్థలాలు ఇవ్వకుండా గాలిలో పెట్టేశారు. ఎన్నికల కోడ్ వచ్చే వరకు అదిగో పట్టా, ఇదిగో స్థలం అంటూ లబ్ధిదార్లతో దోబుచూలాడి, చివరకు మొండిచెయ్యి చూపారు. ఇచ్చిన లేఔట్లలో కూడా చాలా వాటికి రోడ్డు సౌకర్యమే కల్పించకుండా ‘మమ’ అన్పించారు.
అన్నింట్లోనూ వెనకంజే
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, ఆరోగ్య క్లినిక్ భవనాల నిర్మాణం, రెండో విడత నాడు-నేడు పనులు, జగనన్న లేఔట్లలో మౌలిక వసతుల కల్పన, జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి సౌకర్యం కల్పించే పనులు, ఉంగుటూరు వద్ద బుడమేరుపై వంతెన, రామవరప్పాడులో ఏలూరు కాల్వపై వంతెన నిర్మాణాలు, సీఎం సహాయనిధి మంజూరు, మల్లవల్లి పారిశ్రామికవాడ, గన్నవరం విమానాశ్రయం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం వంటి కీలక పనులు ఎక్కడికక్కడే ఉండిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల