రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
సార్వత్రిక ఎన్నికల ఘట్టానికి తెరలేచింది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ లోక్ సభ స్థానంతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.
25 వరకు గడువు
26న పరిశీలన
29 వరకు ఉపసంహరణలు
రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడుతున్న కలెక్టర్ డిల్లీరావు
ఎన్టీఆర్ కలెక్టరేట్, న్యూస్టుడే : సార్వత్రిక ఎన్నికల ఘట్టానికి తెరలేచింది. ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ లోక్ సభ స్థానంతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 18వ తేదీ నుంచి 25 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ఉంటుంది. 29 వరకు ఉప సంహరణలకు అవకాశం ఉందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. నగరంలోని కలెక్టరేట్లో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల దాఖలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. లోక్ సభ స్థానానికి ఫారం-2ఏ నామినేషన్ పత్రం, శాసన సభ స్థానాలకు ఫారం-2బీ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంది. వీటిలో ప్రతి భాగం గురించి క్షుణ్ణంగా తెలియజేశారు. పేర్లు రాయడం, ఫొటోల సమర్పణ తదితరాలపై సూచనలు చేశారు.
మధ్యాహ్నం 3 గంటల వరకు..
ప్రభుత్వ సెలవు రోజుల్లో మినహా మిగతా పని రోజుల్లో, నిర్దేశిత గడువులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఆయా రిటర్నింగ్ అధికారుల (ఆర్వోల) కార్యాలయాల్లో, లోక్ సభకు సంబంధించి విజయవాడలోని కలెక్టరేట్లోనూ నామినేషన్లను స్వీకరించనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థి సహా మొత్తం అయిదుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయాల్లోకి అనుమతి ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఫారం-7ఎ ద్వారా ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థుల పేర్లను తెలుగు అక్షర క్రమంలో పరిగణనలోకి తీసుకుని, బ్యాలెట్లో పొందుపరుస్తామని తెలిపారు. లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి రూ.25,000, అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థి రూ.10,000 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 50 శాతం రాయితీ ఉంటుందన్నారు.
అఫిడవిట్ చాలా కీలకం
నామినేషన్ పత్రాలతో పాటు ఫారం-26 అఫిడవిట్ దాఖలు చేయడం చాలా కీలకమని కలెక్టర్ చెప్పారు. పాన్ కార్డు వివరాలు, ఆదాయపు పన్ను రిటర్న్ల దాఖలు స్థితి, పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులు, నేరారోపణ కేసులు, చర, స్థిరాస్తులు తదితరాలు పొందుపరచాలి. లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులకు రూ.95 లక్షలు, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే వారికి రూ.40 లక్షల వరకు ఎన్నికల వ్యయం చేసేందుకు అనుమతి ఉంది. నామినేషన్ దగ్గరి నుంచి వ్యయం నమోదు జరుగుతుందన్నారు. అభ్యర్థి నిర్వహించాల్సిన రోజు వారీ ఖాతాలు, నగదు రిజిస్టరు, బ్యాంకు లావాదేవీల రిజిస్టరులను నామినేషన్ తరుణంలో అభ్యర్థికి ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ నెల 30 నుంచి మే 11వ తేదీ వరకు మూడు సందర్భాల్లో ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రముఖ వార్తా పత్రికలు, ఛానళ్లలో క్రిమినల్ యాంటిసిడెంట్స్ను ప్రకటించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.కిరణ్ (కాంగ్రెస్), కె.పరమేశ్వరరావు (ఆప్), డి.వి.కృష్ణ (సీపీఎం), పి.వి.శ్రీహరి (భాజపా), కె.వెంకటేశ్ (బీఎస్పీ), వై.రామయ్య (తెదేపా), షేక్ అబ్దుల్ సత్తార్ (వైకాపా), ఎన్నికల వ్యయ నోడల్ అధికారి శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం