హామీ ఇచ్చారు.. నిర్మాణం మరిచారు
అవనిగడ్డ మండలంలోని లంక గ్రామమైన పాత ఎడ్లంకకు రాకపోకలు సాగించేందుకు వీలుగా కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మరుగున పడింది.
పాత ఎడ్లంకకు వంతెన లేక అవస్థలు
నెరవేరని సీఎం, ఎమ్మెల్యేల హామీ
న్యూస్టుడే, అవనిగడ్డ గ్రామీణం
వరద నీటిలో పడవపై వెళ్తున్న గ్రామస్థులు (పాత చిత్రం)
అవనిగడ్డ మండలంలోని లంక గ్రామమైన పాత ఎడ్లంకకు రాకపోకలు సాగించేందుకు వీలుగా కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మరుగున పడింది. 2022, అక్టోబరు 20న సీఎం జగన్ అవనిగడ్డ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు పాత ఎడ్లంకకు వంతెన నిర్మాణం అవశ్యకతను వివరించారు. దీంతో రూ.8 కోట్లు మంజూరు చేస్తూ సీఎం ప్రకటన చేశారు. అదే నెల 22న పాత ఎడ్లంక ఎంపీటీసీ సభ్యురాలు జెరూసా రాణి ఆధ్వర్యంలో కొందరు గ్రామస్థులు, వైకాపా అభిమానులు తమ చిరకాల స్వప్నం నెరవేరబోతోందని పాత ఎడ్లంక నుంచి అవనిగడ్డలోని వైకాపా కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లి సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేసి వంతెన వచ్చేస్తోందనే భ్రమలో బతుకులీడుస్తున్నారు. కానీ ఇంతవరకూ సీఎం ప్రకటన ఆచరణకు నోచుకోకపోవడంతో గ్రామస్థుల్లో మళ్లీ కలవరం మొదలైంది. హామీ ఇచ్చి 18 నెలలు గడిచినా నెరవేర్చలేదు. సంబంధిత అధికారులు వంతెన నిర్మాణానికి సంబంధించిన పనులు ఏ ఒక్కటీ చేపట్టలేదు. కనీసం మట్టి నమూనా పరీక్షలు కూడా చేయకపోవడంపై లంక గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అవనిగడ్డ రావాల్సిందే...
ఈ గ్రామం చుట్టూ కృష్ణానది ప్రవహిస్తూ ఉంటోంది. పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా ఉండే ఆ పల్లెకు రాకపోకలు సాగించడం కష్టసాధ్యమవుతోంది. కృష్ణమ్మ వరదలకు పాత ఎడ్లంకకు వెళ్లే ప్రధాన ఏకైక మార్గం కాజ్వే మూడేళ్ల కిందట కొట్టుకుపోయింది. నాటి నుంచి వారికి రాకపోకలు ప్రధాన సమస్యగా మారింది. వరదొస్తే గ్రామస్థులకు అధికారులు అవనిగడ్డలో పునరావాసం కల్పించడం.. తర్వాత తిరిగి పంపడం పరిపాటిగా మారింది. ఇక్కడ నివాసం ఉంటున్నవారంతా రెక్కాడితేగాని డొక్కాడని శ్రమ జీవులే. పొట్ట పోషణ కోసం నిత్యం అవనిగడ్డకు రావాల్సిందే. రహదారి సౌకర్యం లేక, వంతెన నిర్మాణానికి నోచుకోకపోవడంతో పాలకుల వైఖరిపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరదల సమయంలో నాటు పడవలపై ప్రమాదకర ప్రయాణం సాగిస్తున్నారు.
పంచాయతీ పేరు : పాత ఎడ్లంక
శివారు గ్రామాలు : తూర్పు పల్లెపాలెం, ఎస్సీకాలనీ
కుటుంబాలు : 250 ఓటర్లు : 450
మా కష్టాలు తీరలేదు
- దోవా ఏసు, పాత ఎడ్లంక
ముఖ్యమంత్రి స్వయం గా హామీ ఇచ్చారు. వంతె న నిర్మాణానికి రూ.8 కోట్లు ఇస్తున్నట్లు అవనిగడ్డ బహిరంగ సభా ముఖంగా ప్రకటించారు. దీంతో మా కష్టాలు తీరుతాయని అనుకున్నాం. ఇచ్చిన హామీ ఆయనే నిలబెట్టుకోలేకపోయారు. మా కష్టాలు ఎప్పుడు తీరుతాయో అర్ధం కావడం లేదు.
ఇంతవరకు అతీగతీ లేదు
- పి.రజిని, పాత ఎడ్లంక
మా గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తామని చెప్పారు. ఆశగా ఎదురు చూసాం. ఇంతవరకు అతీగతీ లేదు. వరద వస్తే పడవలే మాకు దిక్కు. మళ్లీ ఓట్లు వచ్చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?