తీరాన నేడు.. ప్రజాగళం
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్లు బుధవారం పెడన రానున్నారు.
తరలిరానున్న తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కల్యాణ్
పెడన, న్యూస్టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజాగళం సభలో పాల్గొనేందుకు తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్లు బుధవారం పెడన రానున్నారు. సాయంత్రం 4 గంటలకు స్థానిక బస్టాండు సెంటరులో జరగనున్న బహిరంగ సభలో ఈ ఇరువురు అధినేతలు ప్రజల నుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు పెడనలో సభ ముగిసిన తర్వాత మచిలీపట్నం చలరస్తా సెంటరులో జరగనున్న సభలో పాల్గొంటారు.
హెలీప్యాడ్ సిద్ధం: స్థానిక మచిలీపట్నం రోడ్డులోని ఫ్లైఓవర్కు సమీపంలో రెండు హెలీప్యాడ్లను సిద్ధం చేశారు. తెదేపా, జనసేన అధినేతలు వేర్వేరుగా హెలీకాప్టర్లలో పెడనకు చేరుకుంటారు. అక్కడి నుంచి కి.మీ దూరంలో ఉన్న సభాస్థలికి రోడ్డు మార్గంలో వస్తారు. పెడనలో సభ పూర్తయిన తర్వాత రోడ్డు మార్గంలో మచిలీపట్నం వెళ్తారు.
పెడనలో హెలీప్యాడ్ పరిశీలిస్తున్న ఎస్పీ
ఎస్పీ పరిశీలన: హెలీప్యాడ్, బస్టాండు సెంటరులోని సభాస్థలిని ఎస్పీ నయీమ్ అస్మి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. భద్రతకు తీసుకున్న చర్యల గురించి ఇన్ఛార్జి డీఎస్పీ రమేష్బాబు ఎస్పీకి వివరించారు. మొత్తం 384 మంది బందోబస్తులో పాల్గొంటారని అన్నారు. సభాస్థలి పరిసరాల్లోని భవనాలపై రూఫ్ టాప్ బందో
బస్తును ఏర్పాటు చేయాలని, భవనాల పైకి ప్రజల్ని అనుమతించవద్దని ఆదేశించారు. పెడన రూరల్ సీఐ నాగేంద్రప్రసాద్, ఎస్సై సూర్యశ్రీనివాస్, ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి అధికారులు ఎస్పీ వెంట ఉన్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా...
పెడనలో బుధవారం సాయంత్రం ప్రజాగళం సభ జరగనున్న నేపథ్యంలో పట్టణంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ట్రాఫిక్ మళ్లించనున్నారు. మచిలీపట్నం-గుడివాడ రహదారిని పూర్తిగా మూసేస్తారు. ప్రత్యామ్నాయంగా గుడివాడ, 216 జాతీయ రహదార్లపై వాహనాల రాకపోకలను అనుమతిస్తారు. గుడివాడ రోడ్డు వైజంక్షన్, గూడూరు రోడ్డు కొత్తపేట రైల్వేగేట్ల వద్ద వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్