సుద్దగా అన్నం.. అందుకే తినం
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
తోట్లవల్లూరులో సగం మందికే..
న్యూస్టుడే, కౌతవరం (గుడ్లవల్లేరు), తోట్లవల్లూరు, పమిడిముక్కల
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం చాలా మంది విద్యార్థులకు రుచించడం లేదు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మెనూ అమలు చేస్తున్నప్పటికీ ఆహార పదార్థాలు రుచి, శుచి ఉండడం లేదని పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. పర్యవేక్షణ లేకపోవడంతో పెట్టిందే మెనూ చందంగా తయారైంది. బడిలో మధ్యాహ్న భోజనం తింటే కడుపులో నొప్పి వస్తోందని..అందుకే ఇంటికి వెళ్లి భోజనాలు చేస్తున్నామని ఎక్కువ మంది విద్యార్థులు చెబుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా సరైన చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.
గుడ్లవల్లేరు మండలంలో 600 మంది తినడం లేదు
గుడ్లవల్లేరు మండలంలోని కౌతవరం జడ్పీ హైస్కూల్లో గురువారం పరిశీలించగా మొత్తం 348 మంది విద్యార్థులకు 146 మందే భోజనం చేశారు. మండలంలో మొత్తం 65 పాఠశాలల్లో 2,946 మంది విద్యార్థులుండగా వారిలో గురువారం 2,334 మంది భోజనం చేశారు. మిగిలినవారంతా ఇళ్లకు వెళ్లి తిన్నారు. ప్రధానంగా భోజనం రుచించకపోవడం, కొత్త బియ్యం కావడంతో అన్నం సుద్దగా ఉంటోందని అంటున్నారు. దీనిపై ఎంఈవో జగన్మోహన్రావు మాట్లాడుతూ ఎండలు, పరీక్షలు, ఒంటిపూట తరగతులతో ఇళ్లకు వెళ్లి తింటున్నారని తెలిపారు.
తోట్లవల్లూరులో సగం మందికే..
తోట్లవల్లూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో మెనూ ప్రకారం పులిహోర, పచ్చడి, గుడ్డు పెట్టారు. గురువారంతో పరీక్షలు ముగియడంతో ప్రతేక్యంగా కేసరి చేశారు. 309 మంది విద్యార్థులు హాజరవ్వగా 307 మంది భోంచేస్తున్నారని హెచ్ఎం ఫణీంద్రకుమార్ తెలిపారు. వారిని పరిశీలించగా 100 మంది వరకే ఉన్నారు. మిగిలిన వారు భోజనం చేయకుండానే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. వాస్తవానికి సగం మందికి కూడా మెను తయారు చేయలేదు. వారిలో అత్యధిక మంది తినకపోవడంతో పచ్చడి, పులిహార, గుడ్లు మిగిలిపోయాయి. కొంతమంది విద్యార్థులు రాత పుస్తకాల్లో కాగితాల్ని చింపి వాటిలో కేసరి పెట్టించుకొని తిన్నారు. ప్లేట్లు అయితే కాడగాల్సి వస్తోందని..పేపర్స్లో తింటున్నారని ఉపాధ్యాయులు చెప్పడం గమనార్హం.
పమిడిముక్కలలో ఇలా..
- పమిడిముక్కల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో గురువారం 210 మంది హాజరుకాగా 204 మంది భోజనం చేస్తున్నారు. మిగిలినివారిలో కొందరు ఆరోగ్యరీత్యా వైద్యులు బయట భోజనం వద్దన్నారని.. తాము క్యారేజీ తెచ్చుకుంటున్నామన్నారు.
- హనుమంతపురం పాఠశాలలో 89 మంది విద్యార్థులకు 81మంది హాజరయ్యారు. మెనూ ప్రకారం నిమ్మకాయ పులిహోర చేయాల్సి ఉండగా చింతపండుతో చేశారు. 80 మందికి సరిపడా పులిహోర, గుడ్లు, టమాటా చట్నీ సిద్ధం చేశామని వంట ఏజెన్సీవారు తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ నిమ్మకాయలు దొరకనందున చింతపండుతో పులిహోర చేయించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు