నాడు కళకళ.. నేడు వెలవెల
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి.
బోసిపోతున్న ఆటోనగర్
న్యూస్టుడే, గుడివాడ(నెహ్రూచౌక్)
వైకాపా పాలనలో పారిశ్రామికవాడలు పూర్తిగా చతికిల పడ్డాయి. గుడివాడ ఆటోనగర్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా వ్యవసాయ పరికరాలకు ప్రఖ్యాతి. కర్నాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు ఇక్కడి నుంచి కల్టివేటర్లు, వీల్స్, నూర్పిడి యంత్రాలు సరఫరా అయ్యాయి. మౌలిక సౌకర్యాల అభివృద్ధి, రాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం స్విస్తి పలకడంతో ఇప్పుడు ఆ కళ తగ్గి ఆటోనగర్ బోసి పోతోంది.
ఉపాధి లేక వలసలు
ఒకప్పుడు పెద్ద కర్మాగారాలు నడిపిన వారు కూడా ప్రభుత్వ ఆదరణ లేక వాటిని మూసేసి మరో వ్యాపారంలోకి మారుతున్నారు. మేస్త్రీలు, వెల్డర్లు, కార్మికుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వలసపోతున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు కాలేదు. కనీస మౌలిక వసతులు లేక ఆటోనగర్వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాల్వలు కూడా లేకపోవడంతో రోజూ మురుగు తోడుకోవాల్సి వస్తోంది.
వ్యవసాయ పరికరాలకు రాయితీ లేదు
- ఎ.సూర్య, పరిశ్రమ నిర్వాహకుడు
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పరికరాలకు రాయితీలు ఇవ్వడం లేదు. ఇప్పటికే చాలా పరిశ్రమలు మూత పడ్డాయి. దీంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కార్మికులకు జీతాలివ్వలేని పరిస్థితి. పనులు లేక వారు కూడా వలస వెళ్లిపోతున్నారు.
నిధులు మంజూరు కాలేదు
- లింగం ప్రసాదు, ఐలా పూర్వాధ్యక్షుడు
ఆటోనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు కాలేదు. కనీస మౌలిక వసతులు కూడా కల్పించే పరిస్థితి లేదు. ఒకప్పుడు వైభవం చూసిన తాము నేటి పరిస్థితులు చూడలేకపోతున్నాం. సొసైటీకి కేటాయించిన స్థలం నిరుపయోగంగానే మిగిలింది.
పన్నుల రూపంలో దోచుకుంటున్నారు
- అడ్సుమిల్లి శ్రీనివాసరావు, లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు
ఈ ప్రభుత్వ హయాంలో లారీలు తిప్పలేకపోతున్నాం. గ్రీన్ ట్యాక్సు భారీగా పెంచేశారు. వివిధ పన్నుల రూపంలో దోచుకుంటున్నారు. ఒకప్పుడు ఏటా కొత్త లారీ ఛాసిస్లు బుక్ చేసేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉన్న లారీలు అమ్మేసి ఈ రంగం నుంచి మారిపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ