ఆ భోజనం మా కొద్దు
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
మెనూ మార్చినా ఆసక్తి చూపని విద్యార్థులు
సుద్దగా మారుతున్న అన్నం
మచిలీపట్నం కార్పొరేషన్, భాస్కరపురం, పెడన గ్రామీణం, బంటుమిల్లి, కృత్తివెన్ను, న్యూస్టుడే
మధ్యాహ్నభోజన మెనూ మార్చాం...పోషకాలతో కూడిన భోజనం అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి జగన్ గొప్పలు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మెనూలో ఎన్ని మార్పులు చేసినా మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య మాత్రం రోజు రోజుకు తగ్గిపోతోంది. భోజనం రుచిగా లేకపోవడం, నిర్దేశించిన మోతాదులో లేకపోవడం తదితర కారణాలతో విద్యార్థులు బడి భోజనం అంటేనే భయపడుతున్న విషయం ‘న్యూస్టుడే’ పరిశీలనలో వెల్లడైంది. మరోవైపు భోజనపథక నిర్వాహకులకు రావాల్సిన వేతనాలు, ఇతర బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడం కూడా భోజనం నిర్వహణపై ప్రభావం చూపుతోంది.
బందరు, పెడన నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలకు గురువారం హాజరైన విద్యార్థులు, వారిలో మధ్యాహ్న భోజనం చేసిన వారి సంఖ్యను పరిశీలిస్తే అతి తక్కువమంది మాత్రమే భోజనం చేశారు.బందరు నగరంలోని చిలకలపూడి పాండురంగ ఉన్నత పాఠశాలలో వివిధ తరగతులకు చెందిన 769మంది విద్యార్థులకు గానూ 577మంది హాజరు కాగా వారిలో కేవలం 194మంది మాత్రమే భోజనం చేశారు. 383మంది భోజనం చేయకుండా ఇంటికి వెళ్లిపోయారు. ఈ పాఠశాలలో గత కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి నెలకొన్నా తగు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పెడన భట్టజ్ఞానకోటయ్య హైస్కూల్లో 625మంది వివిధ తరగతుల విద్యార్థులు హాజరైతే 425మంది మాత్రమే భోజనాలు చేశారు. బంటుమిల్లి మండలంలో రెండు , కృత్తివెన్ను మండలంలో రెండు పాఠశాలలను తనిఖీ చేయగా అక్కడ కూడా తక్కువ సంఖ్యలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు.
ఇచ్చేది నాసిరకం బియ్యం
మెనూ ప్రకారం భోజనం అందించడం, విద్యార్థులకు అందించే భోజన నాణ్యతను తల్లిదండ్రులు కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు పరిశీలించడం, యాప్లో నమోదు చేయడం ఇలా అధికారికంగా అన్ని ఏర్పాట్లు చేసినా ఎందుకు బడిభోజనం చేయడం లేదంటే ఎక్కువశాతం మంది నాసిరకం బియ్యం ఇవ్వడం వల్ల అన్నం సుద్దగా మారుతోందని చెబుతున్నారు. ఈ సమస్యపై అనేకమంది విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులకు మౌఖికంగా చెప్పడంతోపాటు అర్జీలు కూడా అందజేశారు. పోర్టిఫైడ్ బియ్యాన్ని ఇస్తున్నారన్నమాటే కానీ తరచూ అన్నం సుద్ద అవుతుందని భోజన పథక కార్మికులు చెబుతున్నారు. కేవలం బియ్యం కారణంగానే అనేకమంది తల్లిదండ్రులు పిల్లలకు ఇంటినుంచి భోజనం పంపిస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాలే చెబుతున్నాయి.
అనేకసార్లు ఫిర్యాదు చేశాం
- విన్నకోట సత్యకీర్తిరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు
వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం బాగుండడం లేదని అనేక సార్లు ఫిర్యాదు చేయడంతోపాటు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. అయినా ఇంతవరకు సమస్య పరిష్కారం కావడం లేదు. చాలా పాఠశాలల్లో మెనూ అమలు కావడం లేదు. పలు సమస్యల కారణంగా విద్యార్థులు మధ్యాహ్నభోజన పథకానికి దూరం అవుతున్నారు.
ఇంటి నుంచే భోజనం
- సమరం, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
మధ్యాహ్న భోజనంలో అనేక మార్పులు చేసినా ఎక్కువశాతం మంది విద్యార్థులు ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. సంఘ పరంగా వివిధ పాఠశాలల్లో పరిశీలించిన సమయంలో ఈ విషయాన్ని గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అయినా తీరులో ఏమాత్రం మార్పు లేదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందుతుందున్న భరోసా కల్పించలేకపోతున్నారు. దీంతో తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని బడిలో భోజనం చేయవద్దని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం