ప్రోత్సాహం అన్నావు.. సాయం మరిచావు
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది.
వైకాపా పాలనలో పడకేసిన పరిశ్రమలు
మచిలీపట్నం(గొడుగుపేట), పెడన, న్యూస్టుడే
బందరు బంగారంగా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన రోల్డ్గోల్డ్ పరిశ్రమ ప్రస్తుతం అనేక ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. పరిశ్రమలకు అనేక రాయితీలు ఇచ్చి ఆదుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆ తరువాత వాటి గురించి పట్టించుకోకపోవడం పట్ల పరిశ్రమల యజమానుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రోత్సాహకాలు లేక అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.పెడన పరిసర ప్రాంతాల్లోని కలంకారీ చేనేత పరిశ్రమలు కూడా చాలావరకు మూతపడ్డాయి.
మచిలీపట్నంలో ఏటా రూ.120 కోట్ల వ్యాపారం
పోతేపల్లి జ్యూయలరీపార్కులో మొత్తం 236 పరిశ్రమలు ఉన్నాయి. కొవిడ్ కారణంగా కోలుకోని స్థితికి వెళ్లిన పరిశ్రమలను ప్రభుత్వం కూడా ఆదుకోకపోవడంతో చాలావరకు మూతపడ్డాయి. మచిలీపట్నం కేంద్రంగా ఏటా రూ.120 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. పరిశ్రమల ద్వారా పన్నుల రూపేణా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా బాగానే ఉంటుంది. అలాంటి పరిశ్రమలను ఆదుకునేందుకు పరిశ్రమ నిర్వాహకులకు వర్కింగ్ క్యాపిటల్గా రూ.2లక్షలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దానికి ప్రభుత్వమే హామీగా ఉంటుందని కూడా మార్గదర్శకాల్లో పొందుపరిచారు. క్షేత్రస్థాయిలో మాత్రం బ్యాంకులు ఆ దిశగా అమలు చేసిన దాఖలాలు లేవు.
హస్తకళలపైనా నిర్లక్ష్యమే
ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది జీఐ ట్యాగ్ ఉన్న కలంకారీని రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా పూర్తి నిర్లక్ష్యం చేసింది. కలంకారీపై ఆధారపడి పెడన నియోజకవర్గంలో 5వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈపరిశ్రమను గుర్తించకపోవడంతో రాయితీలు అందటంలేదు. గత తెదేపా ప్రభుత్వం హయంలో విరాజిల్లిన కలంకారీ పరిశ్రమ నేడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.
ఆదుకోలేదు
-ఆలపాటి రమేష్, మచిలీపట్నం రోల్డ్గోల్డ్ అసోసియేషన్ అధ్యక్షుడు
పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తామని ప్రభుత్వం చెప్పడమే తప్ప ఆ దిశగా సహకారం అందించిన దాఖలాలు లేవు. పెట్టుబడి కావాలంటే బ్యాంకులకు ఆస్తులు హామీ పెట్టాల్సి వస్తోంది. అందరికీ రుణాలు ఇస్తామని చెప్పడమే తప్ప అమలు చేసిన దాఖలాలు లేవు.
మార్కెటింగ్ ప్రభుత్వమే చేయాలి
- కొండ్రు గంగాధర్, హస్తకళల నిపుణుడు
కలంకారీకి ప్రభుత్వం రాయితీలు అందిస్తే మరింత మంది ఈ పరిశ్రమను ఉపాధిగా ఎంచుకుంటారు. మార్కెటింగ్ సైతం ప్రభుత్వం తమ సంస్థల ద్వారా చేయిస్తే పరిశ్రమ వర్గాలు మరిన్ని లాభాలను పొందుతారు. ప్రస్తుతం అరకొర లాభాలతో ఉత్పత్తి చేయడం ఇబ్బందికంగా మారింది.
ఎగ్జిబిషన్లు లేవు
-బళ్ల ప్రసాద్, పారిశ్రామిక వేత్త
గత ప్రభుత్వ హయంలో దిల్లీలోని ఏపీ భవన్లో ఏడాదికి రెండుసార్లు ఎగ్జిబిషన్లను ఏర్పాటు చేసేవారు. సంక్రాంతి సంబరాలు, దసరా వేడుకల పేరిట ఈ ప్రదర్శనలు జరిగేవి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా ఇలాంటివి నిర్వహించలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వ హస్తకళల మార్కెటింగ్ సంస్థ లేపాక్షిని కూడా నిర్వీర్యం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల