నాలుగో సింహం నలిగిపోతోంది
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు.
వారాంతపు సెలవు లేక అనారోగ్యాలతో పాట్లు
న్యూస్టుడే, గుడివాడ గ్రామీణం, పామర్రు గ్రామీణం, మచిలీపట్నం క్రైం
వారాంతపు సెలవులు లేక పోలీసులు తీవ్ర ఇబ్బందుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. రోజూ ఒత్తిడితో పని చేయాల్సి వస్తోంది. ఈ విధంగా ఉద్యోగం చేయడం కష్టంగా ఉందని పోలీసు ఉద్యోగుల సంఘం తరఫున ఉన్నతాధికారులను, ప్రజా ప్రతినిధులను వేడుకున్నారు. దీంతో ఇతర ఉద్యోగుల మాదిరిగా పోలీసులు కూడా వారాంతపు సెలవు తీసుకోవచ్చని 2019, అక్టోబరు 21న పోలీసుల అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. తొలి ఆరు నెలలు ఈ ప్రక్రియ బాగానే అమలు చేశారు. అనంతరం మళ్లీ మొదటికి వచ్చింది. వారంలో ఒక్క రోజు కూడా కుటుంబంతో గడిపే అవకాశం లేకుండా పోయింది. అత్యవసర పరిస్థితి వస్తే సెలవులు పెట్టుకోవాల్సి వస్తోంది. అవి కూడా ఏడాదికి 15 రోజులే. దానికీ ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని పలువురు పోలీసులు పేర్కొంటున్నారు. కనీస విశ్రాంతి లేకుండా పని చేస్తుంటే ఒత్తిడి పెరిగి రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు.
హామీ నెరవేరలేదు
- పోలీస్ సిబ్బంది, గుడివాడ సర్కిల్
వారాంతపు సెలవులు లేకుండా పని చేస్తున్నాం. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. అధికారంలోకి రాగానే వారాంతపు సెలవులిస్తామని ప్రతిపక్ష నేతగా ప్రకటించారు. అయిదేళ్ల పాలన పూర్తవుతున్నా కార్యాచరణకు నోచుకోలేదు. సెలవులు లేక ఇవ్బంది పడాల్సి వస్తోంది.
టీఏ, డీఏ విడుదలలోనూ జాప్యం
- పోలీస్ సిబ్బంది, పామర్రు సర్కిల్
తమకు రావాల్సిన టీఏ, డీఏలు విడుదల చేయడంలో జాప్యం జరుగుతోంది. సమయానికి వస్తే కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి. సెలవుల హామీ అమలు కాలేదు.
మానసిక ప్రశాంతత లోపిస్తోంది
- వీఆర్లో ఉన్న ఎస్సై
ప్రశాంతంగా విధులు నిర్వహించుకునే పరిస్థితులు లేకుండా పోయాయి. గతంతో పోలిస్తే పనిఒత్తిడి, బందోబస్తులు, ఇతరత్రా విధులు పెరిగాయి. వీటిని భరిస్తున్నా మానసిక ప్రశాంతత లోపిస్తోంది. స్థిరంగా కొంతకాలం ఒకే చోట విధులు నిర్వహించగలమన్న నమ్మకం సడలిపోయింది.గత ప్రభుత్వంతో పోలిస్తే రాజకీయ పరమైన ఒత్తిళ్లు పెరిగిన కారణంగా కొన్ని సందర్భాల్లో రౌడీ షీటర్లను సైతం గౌరవించాల్సి రావడం గుండెలనుపిండేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
[ 27-07-2024]
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్