తెచ్చిపెట్టేది లేదు... తరిమికొట్టుడే..!
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది.
హెచ్సీఎల్, అశోక్లేల్యాండ్ ఇవన్నీ చంద్రబాబు ఘనతే
కొత్త పరిశ్రమలు తేకపోగా.. ఉన్నోళ్లనూ వేధించిన వైకాపా
జగనొచ్చాక పూర్తిగా ఆగిపోయిన రాయితీ, ప్రోత్సాహకాలు
ఈనాడు, అమరావతి
‘గత ఐదేళ్ల జగన్ పాలనలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా నెలకొల్పింది లేదు. కానీ.. గత చంద్రబాబు సర్కారు ఎన్నో ఇబ్బందులు పడి, పారిశ్రామికవేత్తలను ఒప్పించి, రాయితీలు ఇచ్చి ఇక్కడ పెట్టించిన పరిశ్రమలను మూతపడేలా చేయడంలో వైకాపా సర్కారు విజయవంతమైంది. ఒకటి కాదు రెండు కాదు.. అనేక పెద్ద, చిన్న పరిశ్రమలు ఇక్కడి నుంచి తమ కార్యకలాపాలను పూర్తిగా మూసేసి వెళ్లిపోయాయి. ఎంఎస్ఎంఈల నుంచి ఐటీ కంపెనీల వరకూ వందల కంపెనీలు 2014 నుంచి 2019 వరకూ తెదేపా హయాంలో ఇక్కడ ఏర్పాటయ్యాయి. వాటిలో ఇప్పటికే చాలావరకూ వెళ్లిపోయాయి. చివరికి తమ సొంత కాళ్లపై.. బ్యాంకు రుణాలతో చిన్నచిన్న పరిశ్రమలు పెట్టుకుని నడుపుతున్న ఎలీప్ వంటి మహిళా పారిశ్రామికవేత్తల ప్రాంగణాల్లోనూ అనేక యూనిట్లు మూతపడ్డాయి. ఒక్క సూరంపల్లి ఎలీప్ ప్రాంగణంలోనే 2019 తర్వాత ఇప్పటివరకూ దాదాపు 40కు పైగా యూనిట్లు మూతపడ్డాయంటే జగన్ సర్కారు దెబ్బకు పరిస్థితి ఎంతదారుణంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.’
- చంద్రబాబు సీఎం హోదాలో 2018 మార్చిలో మల్లవల్లిలో అశోక్ లేల్యాండ్ యూనిట్కు శంకుస్థాపన నిర్వహించారు. నేరుగా 150 అడుగుల రోడ్డు వేయడంతో పాటు, వివిధ ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పడంతో ఏడాది వ్యవధిలోనే బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ని అందుబాటులోకి తెచ్చారు. కానీ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అశోక్ లేల్యాండ్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ ఇక్కడ యూనిట్ నెలకొల్పిందన్న సంగతే పట్టించుకోలేదు. ఫలితంగా జగన్ ప్రమాణ స్వీకార సమయానికే ప్రారంభానికి సిద్ధమైన యూనిట్ ఐదేళ్లుగా అలంకార ప్రాయంగానే మిగిలిపోయింది.
- మొత్తం 1,360 ఎకరాల విస్తీర్ణం గల మల్లవల్లి ఏపీఐఐసీ లేఔట్లు వేసి ఎనిమిదేళ్ల కిందటే మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులు చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఫుడ్పార్కులతో పాటు, అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ శరవేగంగా నిర్మాణం జరిగింది. హెరిటేజ్ దాణా కర్మాగారం, మోహన్ స్పింటెక్స్, చాక్లెట్లు, మైదా, గోధుమ పిండి తయారీ వంటి యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధం చేశారు. కానీ వైకాపా హయాంలో వీటిల్లో కీలక పరిశ్రమలు తరలిపోయాయి. అశోక్ లేల్యాండ్తో పాటు రైల్నీర్, పార్లే ఆగ్రో వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు యూనిట్ల స్థాపన ప్రారంభించి నేటికీ కొలిక్కి తీసుకురాలేదు.
న్యూస్టుడే, హనుమాన్జంక్షన్, గన్నవరం గ్రామీణం
నేడు చీకట్లు..
జగన్ ఈ ఐదేళ్లలో కనీసం పరిశ్రమలను తేలేకపోయినా.. గత ప్రభుత్వం హయాంలో నెలకొల్పిన వాటినైనా.. మూతపడకుండా ఆపగలిగితే.. ఇంత పెద్దఎత్తున ఉపాధి రంగానికి దెబ్బపడేది కాదు. చంద్రబాబు ప్రభుత్వం ఉమ్మడి కృష్ణా జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి పారిశ్రామిక ప్రగతికి ఊపిరిలూదింది. అందుకే.. తలసరి ఆదాయంలో కృష్ణా జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెట్టింది. పారిశ్రామిక ప్రగతి అంటే.. కేవలం మల్లవల్లిలో అశోక్లేల్యాండ్ వంటి భారీ పరిశ్రమలతోనే కాకుండా.. ఎంఎస్ఎంఈలపై అత్యధిక దృష్టి పెట్టారు. ఇదే సమయంలో ఐటీ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలకు విపరీతంగా ప్రోత్సాహకాలు ఇచ్చారు. వీటికి అవసరమైన మౌలిక వసతులు, భవనాల ఏర్పాటుపైనా ప్రత్యేక దృష్టిపెట్టారు. కానీ.. జగన్ గద్దెనెక్కిన నుంచి ఇవన్నీ.. ఎక్కడికక్కడే ఆగిపోయాయి. వీరికి ఇచ్చిన ప్రోత్సాహకాలను ఆపేశారు. అంతే.. ఉద్యోగ, ఉపాధి రంగంలో వెలుగులన్నీ మాయమై.. చీకట్లు అలముకున్నాయి.
నాడు.. స్వర్ణయుగం..
చంద్రబాబు దార్శనికత ఎలా ఉంటుందనడానికి.. 2014 జూన్ నుంచి 2019 వరకూ ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన పరిశ్రమలే నిదర్శనం. కాటన్, టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్, కెమికల్స్, నిర్మాణరంగ అనుబంధ ఉత్పత్తుల తయారీ, ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, సిరామిక్, ప్లాస్టిక్, గోనెసంచులు, స్టీల్ సామగ్రి, రక్షణ రంగ విడిభాగాలు, ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు పెద్దసంఖ్యలో ఏర్పాటయ్యాయి. భారీ పరిశ్రమలు 17 ఏర్పాటై.. ఉత్పత్తిని ఆరంభించగా రూ.2,339 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 6,820 మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి.
వెంటాడి మరీ పారిపోయేలా చేసి..
ఉమ్మడి కృష్ణాలో చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పారిశ్రామికంగా ఏం చేశారనగానే.. హెచ్సీఎల్ నుంచి.. మేథా టవర్స్-1, 02, ఆటోనగర్లో సాఫ్ట్వేర్ టవర్స్ వరకూ అనేకం గుర్తొస్తాయి. మల్లవలి,్ల వీరపనేనిగూడెంల్లో.. భారీ పరిశ్రమలకు వందల ఎకరాలు కేటాయించారు. కొండలు, గుట్టలను చదునుచేసి.. పారిశ్రామికవాడలుగా మార్చారు. కానీ.. జగనొచ్చారు. అంతే.. అక్కడితో.. ఆ పారిశ్రామిక ప్రాంగణాల కళ తప్పింది. గత సర్కారు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇచ్చిన భూముల ధరలను అమాంతం పెంచేసి.. వారిని గుల్లచేయడం ఆరంభించారు. కొందరు న్యాయస్థానాల్లో పోరాడుతుంటే.. మరికొందరు ఈ తలనొప్పులన్నీ ఎందుకని వదిలేసి వెళ్లిపోయారు.
ఉపాధి దూరం
-రాఘవరావు, బాపులపాడు
మల్లవల్లిలో పరిశ్రమలు మొత్తం అందుబాటులోకి వస్తే కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల పరిధిలోని 40 గ్రామాల్లోని వేల మంది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేశారు. ఒక్క అశోక్ లేల్యాండ్తోనే దాదాపు నాలుగు వేల మందికి అవకాశాలు వస్తాయన్నారు. వైకాపా వచ్చిన తర్వాత ఇవన్నీ కల్లలయ్యాయి.
ధర పెంచేశారు
- ప్రదీప్, పారిశ్రామికవేత్త
మల్లవల్లిలో చిన్నతరహా పరిశ్రమ స్థాపించాలని దరఖాస్తు చేశా. అనూహ్యంగా ఎకరాకు రూ.89.50 లక్షలు ధర చెల్లించాలని ఏపీఐఐసీ అధికార్లు చెప్పారు. తెదేపా హయాంలో ఎకరా ధర రూ.16.50 లక్షలు నిర్ణయించగా, వైకాపా పాలనలో దాదాపు అయిదు రెట్లు పెంచేశారు. దీంతో యూనిట్ ఏర్పాటు ఆలోచన విరమించుకున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
[ 27-07-2024]
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా రాజధాని అమరావతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ తెలిపారు. -
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్