అట్టహాసంగా తెదేపా అభ్యర్థి బోడే నామినేషన్
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు.
భారీ ప్రదర్శనగా తరలి వస్తున్న బోడే ప్రసాద్, వెంట ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, కొనకళ్ల, వంగవీటి రాధాకృష్ణ, వైవీబీలు
పెనమలూరు, న్యూస్టుడే: పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ శుక్రవారం అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నేతలు, కార్యకర్తలు, అభిమానలు భారీగా తరలి వచ్చారు. ఉదయం 9.30 గంటలకు పోరంకిలోని పార్టీ కార్యాలయం నుంచి భారీ ప్రదర్శనగా బయల్దేరి పెనమలూరు తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం 11.45 గంటలకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి డి.రాజుకు అందజేశారు. అనంతరం ప్రసాద్ భార్య హేమాచౌదరి మరో రెండు సెట్లు దాఖలు చేశారు. బోడే అభ్యర్థిత్వాన్ని యార్లగడ్డ రాజబాబు, కనకమేడల వెంకటరమణలు ప్రతిపాదించారు. హేమాచౌదరిని సుంకర వెంకటసురేష్, దేవినేని రత్నభూషణ్లు ప్రతిపాదించారు. బోడే ప్రసాద్ వెంట మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, వైవీబీ రాజేంద్రప్రసాద్లు ఉండగా.. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి కేంద్ర ఎన్నికల పరిశీలకులు రిషబ్గుప్తా, ప్రవీణ్ చౌహాన్లు పెనమలూరు తహసీల్దారు కార్యాలయానికి చేరుకొని రిటర్నింగ్ అధికారితో చర్చించారు. నామినేషన్కు ముందు మాజీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పోరంకి తెదేపా కార్యాలయానికి వెళ్లి బోడే ప్రసాద్కు అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం