పీఠమెక్కారు.. ఆక్వా రైతు నడ్డి విరిచారు
అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు.
భారీగా విద్యుత్తు ఛార్జీల పెంపు
జగన్ పాలనలో కుదేలైన రంగం
న్యూస్టుడే-ఇంతేరు(కృత్తివెన్ను) : అధికారంలోకి వచ్చాక ఆక్వారంగానికి పెద్దపీట వేస్తాం.. తక్కువధరకే విద్యుత్తు అందిస్తామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పీఠమెక్కాక ఆ ఊసే ఎత్తలేదు.. బాదుడే బాదుడు మొదలుపెట్టారని ఆక్వారైతులు ఆరోపిస్తున్నారు. వైకాపా ప్రభుత్వ పాలనలో ఆక్వారంగం కుదేలైంది. విద్యుత్తు ఛార్జీలు పెంచడమే ప్రధాన కారణం. ఆదాయం పెంచుకునేందుకు ఏటా వారిపై భారం మోపుతుండడంతో సామాన్య,పెద్ద రైతులు సైతం సాగుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.
గత తెదేపా ప్రభుత్వ హయాంలో యూనిట్ విద్యుత్తు రూ.1.50కే ఇచ్చి ఆక్వా రైతులను ప్రోత్సహించగా వైకాపా పాలకులు ట్రూఅప్ ఛార్జీలంటూ మోత మోగించడంతో భారం భరించలేక 50శాతం మంది రైతులు ఆక్వాసాగు వదిలేశారు. ప్రస్తుతం యూనిట్ ధర రూ.5.50కు పెంచి రైతుల నడ్డివిరిచారు. తెదేపా హయాంలో ఆక్వారంగం అభివృద్ధి దిశగా అడుగులు వేయగా ఈ అయిదేళ్లలో పూర్తిగా వెనకపడింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. నాడు రూ. 10 వేలు విద్యుత్తు బిల్లులు చెల్లించిన రైతులకు నేడు రూ. 60 వేలకుపైగా బిల్లులు వస్తున్నాయి. అంతమొత్తం చెల్లించకలేక అల్లాడుతున్నారు.
నెలకు రూ.70 వేలకుపైగా బిల్లులు కట్టాం
నేను ఆరు ఎకరాలు వనామి రొయ్యలసాగు చేస్తున్నా.గతంలో నెలకు రూ.10వేల నుంచి రూ.12వేలు మాత్రమే విద్యుత్తు బిల్లులు వచ్చేవి. సరఫరా కూడా సక్రమంగా ఉండేది.దీంతో సాగుకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఒక పంటకు కనీసం రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు లాభాలు వచ్చేవి. ప్రస్తుతం పరిస్థితి భిన్నంగా ఉంది. నెలకు రూ.70వేల నుంచి రూ.90వేలు విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. మరోవైపు మేత, రొయ్యపిల్లల ధరలు సైతం అధికంగా ఉండడంతో వనామి సాగు కష్టంగా ఉంది.
తమ్ము ఆంజనేయులు, ఇంతేరు
లోవోల్టేజీతో అవస్థలు : తిరుమలశెట్టి అంజి
నేను అయిదెకరాల్లో వనామి సాగు చేస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఆక్వాసాగు చేపడుతున్నా. అయిదేళ్ల కిందట వరకు లాభాలు పొందాను. వైకాపా ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలు భారీగా పెంచింది. విద్యుత్తు సరఫరాలోనూ తరచూ అంతరాయం కలుగుతోంది. లోవోల్టేజీ సమస్య వల్ల మోటార్లు కాలిపోవడంతో అదనపు ఖర్చు అవుతోంది. జనరేటర్ వాడాల్సి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి