కోతల జోగి.. చేతలు ఏవీ..?
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు.
ఒక్క హామీ నెరవేర్చితే ఒట్టు
బంటుమిల్లిలో అసంపూర్తిగా నిలిచి పోయిన డ్రైనేజి నిర్మాణం
నాడు
అధికారంలోకి రాగానే బంటుమిల్లి మండలంలోని ప్రధాన గ్రామాలతో పాటు అన్ని ప్రాంతాలలో డ్రైనేజి వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు మురుగు నీటి సమస్య లేకుండా చేస్తా. బంటుమిల్లి మండలాన్ని అభివృద్ధి చేస్తా
మంత్రి జోగి రమేష్ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ
నేడు
అయిదేళ్లు అధికారంలో ఉన్నా కనీసం ఆ విషయాన్నే పట్టించుకోలేదు. ఇదే కాదు మండలంలో కనీసం ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదు.
బంటుమిల్లి, న్యూస్టుడే
దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఎప్పటికప్పుడు పాలకులు ఈ సమస్యపై హామీలు ఇవ్వడం తప్పితే పీఠం ఎక్కాక దాని ఊసే ఎత్తడం లేదు. ఏటా ఎన్నికల హామీలకే ఇది పరిమితమవుతోంది. బంటుమిల్లితో పాటు మిగిలిన 20 పంచాయతీలలో ఎక్కడా సరైన మురుగు పారుదల వ్యవస్థ లేదు. ఉన్న వాటిల్లోనూ సకాలంలో పూడిక తీయించడం లేదు. ఇళ్లల్లో వాడుకున్న నీరు బయటకు వెళ్లే దారిలేక చాలామంది తమ ఇంటి ఆవరణలోనే గుంటలు తవ్వుకుని అందులోకి మళ్లించుకుంటున్నారు. మరికొందరు రోడ్లపైకి వదిలేస్తున్నారు. దీనితో ఆయా ప్రాంతాలు ఎప్పుడూ అపరిశుభ్రంగా దర్శమిస్తున్నాయి.
దారి మళ్లించిన పంచాయతీ నిధులు.. పంచాయతీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడంతో చేతిలో పైసా లేకపోవడంతో చిన్నచిన్న పనులను సైతం సర్పంచులు, కార్యదర్శులు చేపట్టలేని దుస్థితి నెలకొంది. స్థానికులు తమ సమస్యలను పదే పదే పాలకులకు విన్నవించినా చూస్తాం.. చేస్తామంటూ వాయిదా వేస్తూ వచ్చారు తప్ప వాటి పరిష్కారంపై దృష్టి పెట్టలేదు.
పాలకులకు చెప్పినా..
మా గ్రామం పెదతుమ్మిడి. ఇళ్లల్లోని వాడుకపు నీరు, మురుగు నీరు బయటకు వెళ్లడానికి సీసీ డ్రైనేజీలు లేవు. ఉన్న మురుగు బోదెలలో కూడా పూడికలు తీయించకపోవడంతో అవి పూర్తిగా పూడుకుపోయాయి. వర్షాకాలం వస్తే చాలు వర్షపు నీటితో మురుగు నీరు కలిసి రోడ్లపైకి చేరుతోంది. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన పాలకులు ఆ తరువాత అసలు పట్టించుకోవడం లేదు.
బొల్లా వసంత కుమార్, పెదతుమ్మిడి
సమస్యలు అలాగే ఉన్నాయి
పంచాయతీలకు వచ్చే ఆదాయానికి అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గండికొట్టడంతో పంచాయతీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడంతో దీర్ఘకాలంగా నెలకొన సమస్యలు గ్రామాలలో అలాగే ఉండిపోతున్నాయి. అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని నేరవేర్చకుండా వదిలేసే నాయకులకు ఓటు వేయకూడదు. మా అర్తమూరు గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో వర్షాకాలం దారులన్నీ అధ్వానంగా మారుతున్నాయి.
జోగి వెంకట రవీంద్ర, అర్తమూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల