భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయం
భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
పెనమలూరు, న్యూస్టుడే: భవన నిర్మాణదారుడి ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.35 లక్షలు లాగేశారు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మట్టపర్తి శ్రీకాంత్ పోరంకి వసంత్నగర్ కాలనీ నివాసి. ఇతను భవన నిర్మాణదారుడిగా అపార్ట్మెంట్లు నిర్మిస్తుంటారు. ఇటీవల ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లో లాగిన్ అయ్యారు. విడతల వారీగా తన బ్యాంకు ఖాతాల నుంచి రూ.35 లక్షలు యాప్లోని ఖాతాకు బదిలీ చేశారు. ఇతనికి నగదు అవసరమై ఈ నెల 2వ తేదీన ట్రేడింగ్ యాప్ నుంచి నగదు డ్రా చేసుకోవడానికి ప్రయత్నించారు. యాప్ నిర్వాహకులు రెండు రోజుల్లో నగదు తిరిగి ఖాతాకు జమ అవుతాయంటూ నమ్మబలికారు. రెండు రోజుల తర్వాత ఇతను నగదు డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా ఫలించలేదు. పైగా నిర్వాహకులు ఇతడిని తమ యాప్ నుంచి తొలగించారు. మోసపోయినట్లు గుర్తించిన శ్రీకాంత్ పెనమలూరు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వడ్డీ వ్యాపారి వేధింపులతోనే ఆత్మహత్య
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియో
మచిలీపట్నం క్రైం, న్యూస్టుడే: వడ్డీ వ్యాపారి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆలస్యంగా వెలుగు చూసిన ఓ సెల్ఫీ వీడియో నగరంలో కలకలం రేకెత్తించింది. బాధితుల వివరాల మేరకు సర్కిల్పేటకు చెందిన ఖాదర్ఖాన్ ఈనెల 6వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేముందు అతను ఓసెల్ఫీ వీడియో తీశారు. శుక్రవారం కుటుంబ సభ్యులు దాన్ని చూడడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బీ నగరానికి చెందిన వడ్డీ వ్యాపారి కొల్లిపర శివకుమార్ దగ్గర కొంత కాలం కిత్రం ఖాదర్ఖాన్ రూ.70,000 అప్పుగా తీసుకున్నారు. కొంత మొత్తం చెల్లించినా వడ్డీలు, చక్రవడ్డీలు వేసి రూ.10.50 లక్షలు చెల్లించాలంటూ కోర్టులో కేసు వేయడంతో పాటు ఇంటి ముందు టముకా వేయించాడు. కుటుంబ సభ్యుల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ అవమానాన్ని తట్టుకోలేక పోలీసులు, పెద్దలను ఆశ్రయించినా న్యాయం దక్కే పరిస్థితి లేకపోవడంతో వేరే మార్గం లేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియోలో స్పష్టం చేశాడు. ఇదే మరణ వాంగ్మూలంగా తీసుకుని వడ్డీ వ్యాపారిపై తగు చర్యలు తీసుకోవాలని, తన కటుంబానికి రక్షణ కల్పించాలని అందులో పేర్కొన్నాడు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
కారుపై యాసిడ్ పోసిన అపార్ట్మెంట్ వాసులపై కేసు
పెనమలూరు, న్యూస్టుడే: అపార్ట్మెంట్ కొనుగోలులో కమిషన్ ఇవ్వలేదనే ఆగ్రహంతో మహిళకు చెందిన కారుపై యాసిడ్ పోసి భయాందోళనలకు గురిచేసిన నలుగురిపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం.. పొన్నం పావని కానూరు కృష్ణనగర్లోని ఎస్ఎస్ రెసిడెన్సీ నివాసి. ఈమెకు అదే అపార్ట్మెంట్లో నివసించే ఎన్.ఆంజనేయులుతో అపార్ట్మెంట్ కొనుగోలులో కమిషన్పై వివాదం ఉంది. తనకు కమిషన్ ఇవ్వాలంటూ కొంతకాలంగా ఆంజనేయులు సునీతతో పాటు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. తమకు పార్కింగ్ సమస్య ఉందని సమస్యను పరిష్కరిస్తేనే కమిషన్ ఇస్తామంటూ సునీత తెలుపుతూ వస్తోంది. ఇటీవల ఈమె కారు పార్కింగ్కు ద్విచక్ర వాహనాన్ని అడ్డుపెట్టడం, కమిషన్ కోసం వేధించడం చేస్తున్నాడు. గురువారం ఈమె బయటకు వెళ్లడానికి కారు వద్దకు రాగా అప్పటికే కారుపై యాసిడ్ పోసి ఉండడం కారు రంగు మారిపోవడాన్ని గుర్తించింది. భయాందోళనలకు గురైన ఈమె పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కారుపై యాసిడ్ పోయడంతో పాటు బెదిరిస్తున్న ఆంజనేయులు, ఆనందరావు, శ్రీహరి, వాచ్మెన్ ఏడుకొండలుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్వారీలో ప్రమాదం.. లారీడ్రైవర్ అనుమానాస్పద మృతి
గన్నవరం గ్రామీణం, న్యూస్టుడే: గన్నవరం మండలం ముస్తాబాద క్వారీలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం అతడు మృతి చెందాడు. కంకిపాడు మండలం కోలవెన్నుకు చెందిన వేముల వీరబాబు(45) లారీ డ్రైవర్ కాగా.. గత రెండేళ్లుగా జాస్తి సునీల్ వద్ద పనిచేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ యథావిధిగా వీరబాబు పని నిమిత్తం ఇంటి నుంచి ఉదయం బయలుదేరి వచ్చారు. రాత్రి పది గంటల సమయంలో క్వారీలో లారీ బోల్తా కొట్టిందని, వీరబాబు తలకు బలమైన గాయమవడంతో విజయవాడ ఆసుపత్రికి తరలించామని తోటి డ్రైవర్.. వీరబాబు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు.. మాట్లాడలేని స్థితిలో ఉన్న వీరబాబు చూసి భోరుమన్నారు. ఒంటిపై ఎటువంటి దెబ్బలు లేని వీరబాబు చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, ఇద్దరు అమ్మాయిలు సంతానం.
ప్రాణాలతో చెలగాటం..: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినా గన్నవరం పరిసరాల్లో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా వెదురుపావులూరు, ముస్తాబాద, గొల్లనపల్లి, కొండపావులూరులో నిత్యం వందల లారీల మట్టిని తరలిస్తున్నారు. లారీలను ప్రమాదకరంగా కొండల పైకి ఎక్కిస్తూ ఓ పక్క డ్రైవర్లతో.. రోడ్లను నాశనం చేస్తూ దుమ్ము, ధూళితో నివాసితుల ప్రాణాలతో క్వారీ నిర్వాహకులు చెలగాటం ఆడుతున్నారు. క్వారీలో నిత్యం ఏదో ప్రమాదం జరుగుతున్నా.. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అటు నిర్వాహకులు, ఇటు పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కారు ఢీకొని మరొకరు..
కురుమద్దాలి(పామర్రుగ్రామీణం), న్యూస్టుడే: కురుమద్దాలి వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడ తాడిగడపకు చెందిన పరిశె రఘురామయ్య(59) ద్విచక్రవాహనంపై మచిలీపట్నం వైపు నుంచి విజయవాడ ప్రయాణిస్తుండగా..కురుమద్దాలి ఫ్లైఓవర్ వద్దకు రాగానే వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలను సేకరించి విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశారు. మృతదేహాన్ని గుడివాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య నాంచారమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్