‘పోతిన మహేశ్ అక్రమాల పుట్ట’
జనసేన అధినేత పవన్కల్యాణ్ను విమర్శించే అర్హత పోతిన మహేశ్కు లేదని, హద్దుమీరితే అతని అక్రమాలను వెలికితీస్తామని జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు.
భవానీపురం: జనసేన అధినేత పవన్కల్యాణ్ను విమర్శించే అర్హత పోతిన మహేశ్కు లేదని, హద్దుమీరితే అతని అక్రమాలను వెలికితీస్తామని జనసేన పార్టీ విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు. భవానీపురంలోని ఓ కల్యాణమండపంలో విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. వాసు మాట్లాడుతూ పోతిన మహేశ్ అధ్యాపకుడిగా పనిచేసే సమయంలో అతడి జీతం రూ.5వేలు మాత్రమేనని, అతడు ఏవిధంగా జనసేన పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశాడన్నారు. కీర్తిరాయినిగూడెం, బుడమేరు వద్ద ఏవిధంగా అక్రమాలకు పాల్పడ్డారో కరపత్రాల రూపంలో వెల్లడిస్తామన్నారు. బుడమేరును పూడ్చి కబ్జా చేశారన్నారు. స్థలాల డబుల్ రిజిస్ట్రేషన్లు అనేకం చేసినట్లుగా ఆరోపించారు. శాసనసభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు అవినీతి గురించి మహేశ్కే ఎక్కువ తెలుసని, ఐదేళ్లుగా అతడి గురించి విలేకరుల సమావేశాలు పెట్టి విమర్శించారన్నారు. ఇప్పుడు వైకాపాలో చేరగానే పునీతుడు అయిపోయాడా అని విమర్శించారు. జనసేన పార్టీలో ఉంటూ వైకాపా కోవర్టుగా పని చేశారని ఆరోపించారు. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్ను కూడా గెలిపించుకోలేకపోయారన్నారు. పవన్ కల్యాణ్ సినిమాలు, ఆస్తుల గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, మున్ముందు ఆ విధంగా చేస్తే తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు. జనసేన పార్టీ నాయకులు తిరుపతి అనూష, ఎం.విజయలక్ష్మి, బి.రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం