జగనన్న తప్పులు.. జనానికి తిప్పలు
సకల సదుపాయాలతో కాలనీలు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇవ్వగా ప్రజలు నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్రామాలకు దూరంగా, నదీతీరం, లోతట్టు ప్రాంతాల్లో లేఔట్లు వేశారు.
న్యూస్టుడే, గుడివాడ గ్రామీణం, అవనిగడ్డ
సకల సదుపాయాలతో కాలనీలు నిర్మించి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇవ్వగా ప్రజలు నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక గ్రామాలకు దూరంగా, నదీతీరం, లోతట్టు ప్రాంతాల్లో లేఔట్లు వేశారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదు. కొన్ని చోట్ల నిర్మించినా నివాసం ఉండలేకపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- అవనిగడ్డ నియోజకవర్గంలో రూ.152.28 కోట్ల అంచనాతో 219.15 ఎకరాల్లో 8,941 ప్లాట్లు వేసి 8,460 గృహాలు మంజూరు చేశారు. 2020 డిసెంబర్లో నవరత్నాలు పేరుతో ప్రారంభించిన పనులు ఇప్పటికీ నాలుగో వంతు కూడా పూర్తి కాలేదు. కొన్ని గృహాలు పూర్తయినా రహదారులు, విద్యుత్తు, తాగునీటి వసతి లేక నివాసం ఉండడం లేదు. భారీ వర్షాలు కురిస్తే ఇల్లు ఖాళీచేసి రావాల్సిన దుస్థితి. కొన్ని కాలనీలు ఇప్పటికీ మెరక చేయలేదు. మరికొన్ని లేఔట్లలో తూతూమంత్రంగా పనులు చేసి వైకాపా గుత్తేదారులు లబ్ధిపొందారు. మెరక చేసిన తర్వాత కూడా మోకాలు లోతు నీరు నిలిచి తగ్గడానికి పక్షం రోజులు పట్టింది.
- గుడివాడ మండలంలోని వివిధ గ్రామాల్లో 24 చోట్ల జగనన్న కాలనీలు ప్రారంభించారు. కోర్టు వివాదం వల్ల వలివర్తిపాడులో ఒకటి రద్దు చేశారు. రెండో లేఔట్లో పట్టాలిచ్చినా ఒక్కరికీ గృహనిర్మాణ రుణం మంజూరు చేయలేదు. చేపల చెరువుల వద్ద స్థలాలివ్వడంతో శేరీగొల్వేపల్లిలో ఒక లేఔట్ రద్దు చేశారు. కల్వపూడి అగ్రహారంలో చెత్త వేసే చోట స్థలాలిచ్చారని గ్రామస్థులు నిరాకరించడంతో అదీ రద్దు చేశారు. మోటూరు రైల్వే స్టేషన్ వద్ద లేఔట్లో అడుగు పెట్టలేని పరిస్థితి. మండలం మొత్తం మీద 21 లేఔట్లో 868 మందికి పట్టాలి చ్చారు. వారితో పాటు సొంత స్థలం ఉన్న 372 మందికి కలిపి 1240 మందికి గృహనిర్మాణ రుణం మంజూరు చేశారు. వారిలో 280 మంది నిర్మాణం ప్రారంభించలేదు.
రోడ్లు వేయాలి
- ఓ లబ్ధిదారు
మల్లాయపాలెం కాలనీలో అంతర్గత రోడ్లు గుంతలమయం అయ్యాయి. ట్రాక్టరుతో నిర్మాణ సామగ్రి తీసుకెళ్లాలన్నా ఇబ్బందే. మేమే ఇటుక ముక్కలు వేసుకొని సామాగ్రి తరలించుకోవాల్సిన దుస్థితి.
తాగునీటికీ ఇబ్బందే
- ఆకునూరి కమలకుమారి, కొండిపర్రు
పామర్రు మండలం కొండిపర్రులో మాకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో సరైన సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాలనీలో రోడ్లు, మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం. విద్యుత్తు లైన్లు వేయలేదు. స్థలాలిచ్చి మీ చావు మీరు చావండన్నట్లు ఉంది.
వసతుల కల్పనలో నిర్లక్ష్యం
- యలవర్తి మునీశ్వరరావు, కొత్తపేట
రహదారులు అభివృద్ధి చేయలేదు. మెరక చేసిన తర్వాత కూడా కాలనీలు వర్షపు నీటిలో ఉన్నాయి. కొన్ని కాలనీల్లో విద్యుత్తు వసతి లేదు. తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు.
విద్యుత్తు, నీటి సౌకర్యం కల్పించాలి
- గృహిణి
మల్లాయపాలెం జగనన్న కాలనీలో కనీస వసతులు లేవు. నీరు, రోడ్లు, డ్రెయిన్లు లేవు. ఇక్కడ నివాసం ఉండడం చాలా కష్టం. గత్యంతరం లేక ఉంటున్నాము. అసాంఘిక కార్యకలాపాలు అధికమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి