మిస్టర్ అబద్ధం..! విజయవాడకు రూ. 150 కోట్లు ఇస్తానని చెప్పి వంచించిన జగన్
విజయవాడ, మచిలీపట్నాల అభివృద్ధి కోసం గత అయిదేళ్లలో జగన్ చేసిందేమిటంటే... రూ. వందల కోట్ల అబద్ధపు హామీలు గుప్పించడం. అంతేకాదు.. పన్నుల బాదుడుతో జనం బతకలేక పారిపోయేంతగా భయపెట్టడం.
ఈనాడు, అమరావతి
2021లో నగర పాలక సంస్థ
ఎన్నికల తరువాత....
విజయవాడలో అభివృద్ధి పనులకు
నిధుల్లేవంటూ వైకాపా ప్రజాప్రతినిధులంతా
వెళ్లి సీఎం జగన్ని కలిశారు.. ఓస్ అంతే కదా.. ఓ రూ. 50 కోట్లు ఇస్తున్నానంటూ ఆయన హామీ ఇచ్చేశారు. కొంతకాలానికి మళ్లీ కలిసిన ప్రజాప్రతినిధులతో ‘ఆ మొత్తం సరిపోదా... సరే మరో రూ. వంద కోట్లు ఇస్తున్నా’ అంటూ మరో హామీ వదిలేశారు!
ఇంతకీ ఆ రూ. 150 కోట్లలో ఎంత
వచ్చిందో తెలుసా...?
అతికష్టమ్మీద రూ. 30 కోట్లు!.. ఇదీ జగనన్న మాటలకు.. చేతలకు మధ్య ఉన్న దూరం.
జనాన్ని నమ్మించడంలో... వారిని బురిడీ కొట్టించడంలో డిగ్రీలు ఏమైనా ఉంటే వాటన్నిటికీ అర్హత ఉన్న ఏకైన వ్యక్తి సీఎం జగన్. అంతలేదు.. ఇంతలేదంటారు.. ఆనక మొండిచేయి చూపిస్తారు. ఇలా ఆయనిచ్చిన హామీల వర్షంలో తడిచి.. నిధుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసి.. పైసా కూడా అందక.. కష్టనష్టాల కూపంలోనే ఈ అయిదేళ్లూ జనం మగ్గిపోయారు.
విజయవాడ, మచిలీపట్నాల అభివృద్ధి కోసం గత అయిదేళ్లలో జగన్ చేసిందేమిటంటే... రూ. వందల కోట్ల అబద్ధపు హామీలు గుప్పించడం. అంతేకాదు.. పన్నుల బాదుడుతో జనం బతకలేక పారిపోయేంతగా భయపెట్టడం. కానీ.. వైకాపా నేతలు మాత్రం.. విజయవాడను ఉద్ధరించేశాం.. బందరును ముస్తాబు చేసేశామంటూ.. ఊదరగొడుతూ ప్రకటనలు గుప్పించేస్తున్నారు. విజయవాడకు ముఖ్యమంత్రి రెండు దఫాలుగా ఇచ్చిన రూ.150 కోట్ల హామీల్లోఅత్యంత కష్టమ్మీద రూ. 30 కోట్లు ఇచ్చారు. అది కూడా గుత్తేదారులను ముప్పుతిప్పలు పెట్టి.. కొద్దికొద్దిగా ఇచ్చారు. ఈ దెబ్బకు విజయవాడ నగరంలో అభివృద్ధి పనులకు టెండర్లంటూ.. పదేపదే పిలుస్తున్నా.. గుత్తేదారులు రావడం లేదు.
నమ్మించి.. ముంచేసి..
విజయవాడ నగరాన్ని ప్రగతికి ప్రతిరూపంలా మారుస్తామని 2021 నగర పాలక సంస్థ ఎన్నికలకు ముందు వైకాపా నేతలు ఊదరగొట్టారు. ఇది నమ్మి జనం ఓట్లేసి.. వైకాపా తరఫున 49 మంది కార్పొరేటర్లను గెలిపించి పీఠం అప్పగించారు. అంతే వారిని అడ్డంగా మోసగించి, ఇచ్చిన మాట తప్పి నమ్మకద్రోహం చేసిన ఘనత జగన్ సర్కారుదే. నగరంలో కనీసం ఫాగింగ్ చేసే దిక్కు లేకుండా, చెత్తతో నగర జీవనాన్ని అత్యంత దుర్భరంగా మార్చేశారు. దోమలు విపరీతంగా పెరిగాయి. ఖాళీ స్థలాలన్నీ మురికికూపాలుగా మారి.. దోమలకు ఆవాసాలయ్యాయి. వైకాపా పాలనలో డెంగీ, మలేరియా జ్వరాలు విపరీతంగా వ్యాప్తి చెందాయి. అనేకమంది డెంగీతో మృత్యువాత పడ్డారు.
జగన్ మాటిస్తే.. అలా ఉంటుంది మరి!
- విజయవాడలో వివిధ పనులకు తొలుత సీఎం జగన్ ఇస్తానని చెప్పిన రూ. 50 కోట్లతో మూడు సర్కిళ్లలో 88 (సర్కిల్-1లో 18, సర్కిల్-2లో 29, సర్కిల్-3లో 41) పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. ఉద్యానవనాలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, కాలువల సుందరీకరణ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, యూజీడీ లైన్ల ఏర్పాటు, ఓపెన్ జిమ్, అంతర్గత డ్రెయిన్లు, షాపింగ్ కాంప్లెక్స్ కమ్ ఫంక్షన్ హాళ్లు, క్రీడలకు వసతులు.. ఇలా పెద్ద ప్రణాళికే సిద్ధం చేశారు.
- ఆ తర్వాత సీఎం ఇస్తానని చెప్పిన.. రూ. 100 కోట్లతో మరో 99 అభివృద్ధి పనులకు రూపకల్పన చేశారు. అన్ని డివిజన్లలో రహదారుల నిర్మాణం, సామాజిక భవనాల అభివృద్ధి, గ్రంథాలయాలు, సీవేజీ లైన్ల పనులు వీటిలో ఉన్నాయి.
- టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులప్పగించారు. వీటిని చేపట్టాకే జగన్ సర్కారు ఎలాంటిదో గుత్తేదార్లకు అర్థమైంది. రూ. 30 కోట్ల వరకూ పనులు చేస్తే.. ఆ బిల్లులు రావడానికి ఏడాదిన్నరకు పైనే పట్టింది.
- ఆ తర్వాత చాలా పనులు టెండర్ల దశలోనే ఆగిపోయాయి. కొన్నింటిని మధ్యలో వదిలేశారు.
మచిలీపట్నం ప్రజలను మోసగించి..
మచిలీపట్నం నగర పాలక ఎన్నికల్లో వైకాపాను గెలిపిస్తే.. రూపురేఖలు మార్చేస్తామని ప్రచారం చేశారు. జనం నమ్మి ఏకంగా 44 డివిజన్లను కట్టబెట్టారు.అంతే.. జగన్ సర్కారు నైజం బయటపడింది. హామీలన్నీ జగన్ తుంగలో తొక్కేశారు. ఇక్కడి ప్రజల కోసం వైకాపా చేసిన అభివృద్ధి శూన్యం. తెదేపా ఆధ్వర్యంలో కట్టిన పార్కులు, ఇతర అభివృద్ధి పనులనూ గాలికొదిలేశారు. డ్రెయినేజీ సమస్య, వర్షపు నీటి కాలువల సమస్య పరిష్కారం కాలేదు. కనీసం తాగునీరు కూడా మెరుగు పరిచింది లేదు. ఫాగింగ్, దోమల నియంత్రణ ఊసేలేదు.
అన్నింటికీ మోకాలడ్డి.. మచిలీపట్నంలో ప్రజలందరికీ ఉపయోగపడే పనులను సొంత పార్టీ ఎంపీ చేసినా.. సహించలేనంతగా అరాచకాలకు పాల్పడింది పేర్ని వర్గం. నగరం నడిబొడ్డున జిల్లా కోర్టు సెంటర్లో రూ. 60 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో భోగరాజు పట్టాభి సీతారామయ్య జ్ఞాపకార్థం.. గ్రంథాలయం, ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం నిర్మించాలని ఎంపీ బాలశౌరి ప్రతిపాదనలు రూపొందించారు. యూనియన్ బ్యాంకు అధికారులతో ఆయన మాట్లాడి రూ.40 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించారు. ఇవన్నీ నగరాభివృద్ధిలో కీలకాంశాలు. ప్రజలకూ ఉపయోగపడేవి. కానీ.. నగరపాలక యంత్రాంగాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్న నాని.. అడుగడుగునా అడ్డం పడ్డారు. ఏ పనికీ అనుమతి రాకుండా చేశారు. అదే సమయంలో ఆ స్థలంపై కన్నేసి.. వైకాపా కార్యాలయం కోసం స్వాధీనం చేసుకున్నారు. రాత్రికి రాత్రే అనుమతులన్నీ తెచ్చి నిర్మాణం ఆరంభించేసి.. నెలల్లో భవనం కట్టేశారు. విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైకాపా కార్యాలయం పేరుతో ఆక్రమించుకోవడంపై.. నగరవాసులు మండిపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం