విజయీభవ.. దిగ్విజయీభవ!
‘‘క్షేత్రంలో మెరుపు వేగంతో కదలండి.. తెదేపా, జనసేన, భాజపా కూటమి ఓట్లు మార్పిడి జరిగేలా అత్యంత అప్రమత్తంగా మసలుకోండి. అందరూ సమన్వయంతో సాగి.. ప్రజల మనసులు గెలవండి.
బి-ఫారాలు అందుకున్న తెదేపా అభ్యర్థులు
తెలుగుదేశం శ్రేణుల్లో సమరోత్సాహం
ఈనాడు - అమరావతి: ‘‘క్షేత్రంలో మెరుపు వేగంతో కదలండి.. తెదేపా, జనసేన, భాజపా కూటమి ఓట్లు మార్పిడి జరిగేలా అత్యంత అప్రమత్తంగా మసలుకోండి. అందరూ సమన్వయంతో సాగి.. ప్రజల మనసులు గెలవండి. కూటమిని విజయపథాన నడపండని’’ తెదేపా అధినేత చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం తరఫున సార్వత్రిక ఎన్నికల బరిలో నిలవనున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో బీ-ఫారాలు అందజేసి.. దిశానిర్దేశం చేశారు.
తగ్గేదే లేదంతే..
కృష్ణా జిల్లా నుంచి అభ్యర్థులు బోడే ప్రసాద్ (పెనమలూరు), వర్ల కుమార్రాజా (పామర్రు), వెనిగండ్ల రాము (గుడివాడ), కొల్లు రవీంద్ర (బందరు), యార్లగడ్డ వెంకట్రావు (గన్నవరం), కాగిత కృష్ణప్రసాద్ (పెడన) బీ-ఫారాలు తీసుకున్నారు. గుడివాడలో నామినేషన్ల ఘట్టం వేడెక్కింది. వాస్తవానికి సోమవారం నామినేషన్లు దాఖలు చేయాలని తెదేపా నిర్ణయించుకోగా.. అదే రోజు వైకాపా కూడా నామినేషన్లను వేస్తామని ప్రకటించడంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ర్యాలీకి అనుమతించలేదు. దీంతో తేదీలను మార్చుకున్నట్లు తెలిసింది. ఈనెల 23న తెదేపా, 25న వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారని తెలిసింది.
ప్రచారంలో ఉరకలు...
తెదేపా, భాజపా, జనసేన కూటమి.. నియోజకవర్గ స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. విజయవాడ ఎంపీ అభ్యర్థి.. నియోజకవర్గాల అభ్యర్థుల సమన్వయంతో ప్రచారం చేస్తున్నారు. తూర్పు, సెంట్రల్, తిరువూరు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేటల్లో ప్రచారాలు ఊపందుకున్నాయి. పశ్చిమలో తెదేపా, భాజపా నాయకులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వీరి కుటుంబ సభ్యులు సైతం రంగంలోకి దిగారు. బందరు పరిధిలోనూ ఇప్పటికే అధినేత రెండుసార్లు పర్యటించారు. పామర్రు, ఉయ్యూరులలో చంద్రబాబు సభలు జరిగాయి. పెడన, బందరులో పవన్ కల్యాణ్, చంద్రబాబు ఉమ్మడి సభలు నిర్వహించారు. గుడివాడలో ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. పెడన, అవనిగడ్డల్లో ఉత్సాహంతో.. జనసేన, తెదేపా కార్యకర్తలు ఉరకలేస్తున్నారు.
వసంత, ఉమా ఐక్యతారాగం
ఇప్పటికే కొందరు నామినేషన్లు దాఖలు చేయగా మరికొందరు ముహూర్తాలను నిర్ణయించుకున్నారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నితోపాటు అసెంబ్లీ అభ్యర్థులు బొండా ఉమా (సెంట్రల్), తంగిరాల సౌమ్య (నందిగామ) శ్రీరాం తాతయ్య (జగ్గయ్యపేట), కొలికపూడి శ్రీనివాసరావు (తిరువూరు), వసంత కృష్ణప్రసాద్ (మైలవరం) అధినేత చేతుల మీదుగా బీఫారాలు అందుకున్నారు. మైలవరంలో తెదేపా కూటమి అభ్యర్థిగా వసంతకృష్ణప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈసందర్భంగా మాజీ మంత్రి దేవినేని ఉమాను ఆయన నివాసంలో కలిసి మద్దతు కోరారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి