పేదల కష్టం కనపడలేదా?
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మధురానగర్ ఆర్యూబీ పూర్తి చేస్తాం. వాంబేకాలనీ వాసులకు ఉపయోగపడేలా దేవీనగర్-వాంబేకాలనీ మధ్య ఆర్వోబీ రెండేళ్లలో కట్టేస్తాం.’ 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చేందుకు నియోజకవర్గ ప్రజలకు వైకాపా గుప్పించిన హామీలివి.
పట్టించుకోని వైకాపా ప్రజాప్రతినిధులు
మధురానగర్, న్యూస్టుడే
‘అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మధురానగర్ ఆర్యూబీ పూర్తి చేస్తాం. వాంబేకాలనీ వాసులకు ఉపయోగపడేలా దేవీనగర్-వాంబేకాలనీ మధ్య ఆర్వోబీ రెండేళ్లలో కట్టేస్తాం.’ 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చేందుకు నియోజకవర్గ ప్రజలకు వైకాపా గుప్పించిన హామీలివి. అధికారంలోకి వచ్చి.. అయిదేళ్లు అవుతున్నా మధురానగర్ ఆర్యూబీనే పూర్తి చేయలేకపోయారు. మిగిలిన 15 శాతం పనులు పూర్తి చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. దేవీనగర్-వాంబేకాలనీ మధ్య రెండేళ్లలో కట్టేస్తామన్న ఆర్వోబీ ఊసే మరిచిపోయారు. వేలాది మంది నిరుపేద వాంబేకాలనీ వాసుల కష్టాలు తీర్చే.. ఈ ఆర్వోబీ నిర్మాణంపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అయిదేళ్లలో కనీసం ప్రతిపాదనే చేయలేదు. ఫలితంగా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక నిత్యం వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ట్రాక్ దాటుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చి మడమ తిప్పిన వైకాపా హామీ వైఫల్యంపై కథనం.
అజిత్సింగ్నగర్ వాంబేకాలనీలో అందరూ నిరుపేదలే ఉంటారు. దాని చుట్టుపక్కల దాదాపు 50 వేల మంది నివాసం ఉంటున్నారు. వీరిలో రోజు వారీ కూలీలు, ముఠా, తాపీ, మెకానిక్ పనులకు వెళ్లే వారే అధికం. ఆయా పనుల నిమిత్తం ఆటోనగర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళుతుంటారు. వాంబేకాలనీ, డాబాకొట్లు రోడ్డు మీదుగా అజిత్సింగ్నగర్ పై వంతెన ద్వారా నగరంలోకి వెళతారు. అంత దూరం వెళ్లలేక.. దగ్గర దారిగా ఉన్న వాంబేకాలనీ-దేవీనగర్ మార్గాన్ని ఎంచుకున్నారు. విశాఖపట్నం రైల్వే ట్రాక్ ఎక్కి దిగి.. దేవీనగర్, మధురానగర్ మీదుగా నగరంలోకి సులువుగా చేరుకుంటున్నారు.
మార్గం తవ్వేశారు : ఈ రైల్వేట్రాక్ పక్కనే భారీ మురుగునీటి కాలువ ఉండేది. దేవీనగర్ వైపు వెళ్లేందుకు కాలువ దాటే చోట తూములు ఉండేవి. వీటి మీదుగా పాదచారులు, సైకిలిస్టులు వెళ్లే వారు. రైల్వే అధికారులు భద్రతా కారణాలు చూపుతూ తూములను తొలగించి మార్గాన్ని తవ్వేశారు. స్థానికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అధికార వైకాపా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. స్థానికుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో సిమెంటు కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు.
8 కిలోమీటర్లు దూరం కలిసి వస్తుంది
వాంబేకాలనీ వాసులు.. దేవీనగర్ మీదుగా నగరంలోకి వెళితే సుమారు 8 కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది. ఉదయం వేళల్లో అజిత్సింగ్నగర్ పైవంతెనపై విపరీతమైన రద్దీ ఉంటుంది. ఒక్కోసారి ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఈ ట్రాఫిక్లో ఇరుక్కుపోతే.. సరైన సమయానికి కూలి పనులకు వెళ్లలేరు. అదే.. దేవీనగర్ మీదుగా వెళితే అజిత్సింగ్నగర్ పై వంతెన ఎక్కనవసరం లేదు. ఫలితంగా దూరం కలిసి రావడమే కాకుండా ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. అందుకే ఆర్వోబీ కట్టాలని ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. వైకాపా నాయకులు.. రెండేళ్లలో కట్టేస్తామని 2019 ఎన్నికల్లో హామీలు ఇచ్చి విస్మరించారు. కనీసం ప్రతిపాదన చేయకుండా మొండి చెయ్యి చూపించిందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎర్రమట్టితో కట్ట నిర్మాణం : తాజాగా దేవీనగర్-వాంబేకాలనీ మధ్య రాకపోకల సాగించే మార్గం వద్ద రైల్వే అధికారులు ఎర్రమట్టి కుప్పలుగా పోశారు. ఈ మట్టితో రైల్వేట్రాక్ వద్ద కంకర జారిపోకుండా రక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ఎర్రమట్టి జారిపోకుండా ఉండేందుకు అటు వైపు రాకపోకలను నిషేధించే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. ఇదే జరిగితే.. మళ్లీ జనమంతా అజిత్సింగ్నగర్ పైవంతెనపై నుంచి వెళ్లాల్సిందే. దీని వల్ల సమయం వృథా, రవాణా ఖర్చుల భారం అవుతుందని వాంబేకాలనీ వాసులు భయపడుతున్నారు.
ఆటో ఖర్చు కలిసి వస్తుంది
- వాసుదేవరావు, తాపీ కూలి
వాంబేకాలనీలో ఉంటా. రోజూ ముఠా పనికి వెళతా. మాకు రైల్వే ట్రాక్ ఎక్కి దిగితే.. పనికి దగ్గరగా ఉంటుంది. రోజూ ఇలాగే వస్తున్నాం. రైలు వచ్చే సమయంలో భయమేస్తుంటుంది. అయినా తప్పదు. కంకరపై జారిపోతున్నా.. దగ్గరని ఇటు వైపే వెళతాం. సింగ్నగర్ పైవంతెన మీదుగా వెళితే ఆటో కోసం రూ.40లు ఖర్చు చేయాలి. దేవీనగర్ మీదుగా వెళితే ఆ ఖర్చు కలిసి వస్తుంది.
సీతారాంపురంలో పనికి వెళుతుంటా
- పెద్ది శ్రీను, ముఠా కూలి
సీతారాంపురంలో ముఠా కూలిగా పనిచేస్తున్నా. ప్రతి రోజూ వాంబేకాలనీ నుంచి దేవీనగర్, మధునానగర్ మీదుగా వెళుతుంటా. దీని వల్ల చాలా దూరం కలిసి వస్తుంది. నేను గతంలో చాలా సార్లు అజిత్సింగ్నగర్ పైవంతెనపై ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్నా. అందుకే దేవీనగర్ మీదుగా వెళుతున్నా. మాకు ఇక్కడ ఆర్వోబీ కడతామని చెప్పారు. ఇప్పటికీ కట్టలేదు. రోజూ మాకు ఇబ్బందులు తప్పడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
[ 27-07-2024]
కృష్ణానది తీరాన కొండల్లో వజ్రాల కోసం జనం వెతుకులాట కొనసాగుతోంది. వర్షాలు పడుతుండటంతో వజ్రాలు దొరుకుతాయనే ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జనం వస్తున్నారు -
ఏటికో లెక్క.. ఏమిటో మాయ!
[ 27-07-2024]
అదే సర్వేనెంబరు 5-4లో ఫసలీ 1428 వచ్చే నాటికి మొత్తం విస్తీర్ణం కేవలం 28.70 ఎకరాలుగా అదే అధికారులు ధ్రువీకరిస్తూ.. అడంగల్ కాపీ జారీ చేశారు. ఇక్కడ మొత్తం ఆరుగురే పట్టాదారులు ఉన్నారు. -
అశోక్ లేల్యాండ్ ప్రారంభానికి అడుగులు
[ 27-07-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నెలకొల్పిన అశోక్ లేల్యాండ్ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త్వరలో ప్రారంభం కాబోతుంది -
సైబర్ నేరం.. అవగాహనతో దూరం
[ 27-07-2024]
సైబర్ నేరాలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణంలో ఏ మార్గంలో ఖాతా నుంచి డబ్బులు మాయమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. -
కీలక విభాగాల్లో.. తక్షణం స్పందించేలా..!
[ 27-07-2024]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు ఆరంభమయ్యాయి. కొత్త, పాతాసుపత్రుల్లోని కీలకమైన విభాగాల్లో ఉండే వైద్యాధికారులు, సిబ్బంది.. నిత్యం రోగులు, వారి బంధువులకు అందుబాటులో ఉండేలా కనెక్టివిటీని తాజాగా ఏర్పాటు చేశారు. -
డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు సీబీసీఐడీకి అప్పగింత
[ 27-07-2024]
అవనిగడ్డలో దాదాపు మూడున్నర సంవత్సరాల కిందట జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్యకేసు విచారణను రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించినట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. -
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధంలో దేశం కోసం పోరాడి పాకిస్థాన్పై విజయం సాధించడంలో అసువులు బాసిన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జిల్లా సైనిక సంక్షేమాధికారి డాక్టర్ కె.కల్యాణవీణ పేర్కొన్నారు -
గగన వీధిలో.. ఘనమై ఎగిరేలా..‘
[ 27-07-2024]
గన్నవరం విమానాశ్రయానికి.. ప్రయాణికుల రద్దీ పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఏ దేశం, నగరానికి కొత్త సర్వీసులు ఏర్పాటు చేసినా.. అవి అత్యంత రద్దీగా నడుస్తుండడమే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం